Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
షాక్! ఆ మోజులో పడి కట్టుకున్న వారినే మోసం చేస్తున్నారట! వీరిలోనూ భార్యా బాధితులే ఎక్కువగా ఉన్నారట.
భారతీయ మహిళలు అవిశ్వాసం గురించి ఓపెన్ మైండ్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రొమాంటిక్ విషయంలో తమ నిజ జీవిత వ్యవహారానికి ఇబ్బంది కలిగించని వ్యక్తులతో కొత్త ప్రేమకథను ప్రారంభిస్తారట.
మన భారతదేశంలో కళ్యాణం వంటి కమనీయమైన ఘట్టం ముగించుకుని... కలకాలం కలిసి జీవించేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటారు. అయితే అలాంటి వివాహ వ్యవస్థలో ప్రస్తుతం విపరీతమైన మార్పులొచ్చేశాయి. కలకాలం కలిసి ఉండటానికి బదులు.. బయటి సంబంధాలను కోరుకుంటున్నారు భారతీయులు.

'పొరుగింటి పుల్లకూర రుచి' అన్న చందాన వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత తమ భాగస్వామిని మోసం చేయడంలో మహిళలు ముందజలో ఉండటంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలపై గ్లీడెన్ అనే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో 55 శాతం మంది మహిళలు భర్తలకు నమ్మకద్రోహం చేసి.. ఇతర సంబంధాలను కోరుకున్నారట.

పెళ్లి అయిన వారిలో చాలా మంది మహిళలు ఒక్కసారైనా తమకు భర్తలను మోసం చేస్తున్నారని సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మహిళలు ఇంకా ఎలాంటి విషయాలో వెల్లడించారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు...

ఉద్రేకంలో నిర్ణయాలు..
చాలా మంది మహిళలు ఉద్రేకంలో నిర్ణయాలు తీసుకుంటున్నారట. వారు తమ భాగస్వామిని మోసం చేసే ముందు దాని గురించి అస్సలు ఆలోచించరట. కేవలం దాని గురించి మాత్రమే కాదు.. తమ పరిస్థితి గురించి కూడా ఏ మాత్రం ఆలోచన లేకుండా అలాంటి సంబంధాలపై అడుగులు వేస్తారట.

ఇద్దరితో ప్రేమలో..
మరో సర్వేలో 48 శాతం మంది ప్రజలు ఒకేసారి ఇద్దరితో ప్రేమలో ఉంటున్నారట. 46 శాతం మంది ప్రేమలో ఉండి కూడా మోసానికి పాల్పడుతున్నారట. మరో ట్విస్ట్ ఏంటంటే తమ భాగస్వామికి ఇతరులతో సంబంధం ఉందని తెలిసినప్పటికీ ఏడు శాతం మంది క్షమించి వదిలేస్తున్నారట.

వివాహేతర సంబంధాలు
ముందుగానే వివాహేతర సంబంధాలు గొడవలైనప్పటికీ.. 69 శాతం మంది రాజీ పడిపోయి.. గుట్టు చప్పుడు కాకుండా కాపురం చేసేసుకుంటున్నారట.

25 నుండి 50 ఏళ్ల వయసు వారు...
ఈ సర్వేలో 25 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు సుమారు వెయ్యి మందికి పైగా పాల్గొన్నారట. వివాహితులు ఎక్కువగా వివాహేతర సంబంధాలకు ఆకర్షితులు అవుతున్నారని ఈ సర్వే సంస్థ బాంబు పేల్చింది. అందులోనూ ఎక్కువగా మహిళలే ఉండటం గమనార్హం.

సిటీలలో..
హైదరాబాద్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, పూనే, చెన్నై, కోల్ కత్తా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఇలాంటి వివాహేతర సంబంధాలు ఎక్కువగా సాగుతున్నాయట. ఈ నగరాల్లో జీవించే వారు తమ జీవిత భాగస్వాములను చాలా సులభంగా మోసం చేస్తున్నారట.

అతి తక్కువగా విడాకులు..
2017లో భారతదేశానికి చేరుకున్న గ్లీడెన్ సంస్థ ఇప్పటివరకు మన దేశంలో సుమారు ఎనిమిది లక్షల మంది సభ్యులను చేర్చుకుని సర్వే చేపట్టింది. అయితే మన దేశంలో కేవలం ఒక శాతం మంది ప్రజలు మాత్రమే విడాకులు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతి తక్కువ అని వివరించింది. మన దేశంలో ప్రతి 1000 మంది జంటలలో 13 మంది మాత్రమే విడిపోయారట.

90 శాతం వివాహాలు..
భారతదేశంలో ఇప్పటికీ కుటుంబాలే వివాహ నిర్ణయాలను తీసుకుంటున్నాయట. 5 నుండి 10 శాతం మంది జంటలు మాత్రమే ప్రేమ వివాహం చేసుకుంటున్నారట.

ఓపెన్ మైండెడ్...
భారతీయ మహిళలు అవిశ్వాసం గురించి ఓపెన్ మైండ్ గా కనిపిస్తారు. ముఖ్యంగా రొమాంటిక్ విషయంలో తమ నిజ జీవిత వ్యవహారానికి ఇబ్బంది కలిగించని వ్యక్తులతో కొత్త ప్రేమకథను ప్రారంభిస్తారట. వారితో పూర్తిగా అలాంటి అనుభవాలను పొందుతారట.

మహిళల గోప్యత..
తమ సంస్థ ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో మహిళా సభ్యులను ఆకర్షిస్తోందని, ఇది వారికి సెక్యూరీటీ, విచక్షణ మరియు భాగస్వాముల ఎంపికను వారికి సులభం చేస్తుందని గ్లీడెన్ మార్కెటింగ్ డైరెక్టర్ సోలీన్ పైలెట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications