Just In
- 1 hr ago హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- 2 hrs ago వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- 3 hrs ago Horoscope on Indian Elections : ఈ ఎన్నికల్లో ఎవరికి రాజయోగం.. ఎవరికి ఓటమి..?
- 4 hrs ago బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
సెలబ్రిటీలు కలకాలం కలిసి ఉండలేరా? విడిపోయినా స్నేహితుల్లా ఉంటామంటున్న జంటలెవరో చూసెయ్యండి...
పెళ్లయి సుదీర్ఘ కాలం తర్వాత విడిపోయిన ప్రముఖ జంటల గురించి తెలుసుకుందాం.
మన దేశంలో పెళ్లంటే నూరేళ్ల పంట.. అందుకే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. అయితే ఆ బంధంలో మంటలు రాకుండా ఉండాలంటే.. స్త్రీ, పురుషులిద్దరి మనసులు ఒక్కటి కావాలి.
అంతేకాదు వారిద్దరూ కలిసి జీవితాంతం వివాహ బంధంలో ఒక్కటై ప్రయాణించాలి. అయితే మీ వైవాహిక జీవితం కలకాలం హాయిగా సాగాలంటే.. మీ బంధం బలంగా ఉండాలంటే.. మాత్రం ఆ బాధ్యత భార్యభర్తల చేతుల్లోనే ఉంటుంది.
అయితే ప్రస్తుత కాలంలో కొందరు జంటలు కొన్నాళ్లు కాపురం బాగానే చేస్తున్నారు. అయితే ఆ తర్వాతే పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి కొన్ని జంటలు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇలా సామాన్యుల నుండి సెలబ్రెటీల దాకా జంటలు విడిపోవడానికి ఎన్ని వ్యక్తిగత కారణాలున్నప్పటికీ.. ప్రముఖులు విడాకులు తీసుకోవడం.. బ్రేకప్ వంటి విషయాలు ఎప్పటికీ చర్చనీయాంశం అవుతూ ఉంటాయి. ఇటీవలే అమీర్ ఖాన్-కిరణ్ రావు దంపతులు తమ 15 ఏళ్ల వివాహ బంధానికి ముగించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇలా విడిపోయిన కొందరు సెలబ్రిటీ జంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వామ్మో!పెళ్లయ్యాక అతనికి 47 మంది పిల్లలని తెలిసిందట... ఆ తర్వాత ఏమి జరిగిందంటే...
బిల్ గేట్స్-మిలిందా..
ఈ జంట గురించి పరిచయం అస్సలు అక్కర్లేదు. ప్రపంచంలో వీరి పేర్లు తెలియని వారుండరు ఉండరంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, మిలిందా ఇద్దరూ ఇటీవల వ్యక్తిగత కారణాలతో తమ వివాహ బంధానికి వీడ్కోలు చెబుతున్నట్టు ప్రకటించారు. అయితే వీరిద్దరూ ప్రజా సేవలో సంతోషాన్ని వెతుక్కున్నారు. ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్'ను కంటిన్యూ చేస్తామన్నారు. ఈ సేవా సంస్థ వేదికగా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తమ మానవతను చాటుకున్నారు. కానీ 27 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అయితే తాము విడిపోయినంత మాత్రం తమ సంస్థలో ఇద్దరి భాగస్వామ్యం, ఇతర సేవా కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం ఉండదని, తామిద్దరం ఇకపైనా కలిసే పని చేస్తామని చెప్పారు. ఈ జంటకు క్యాథరిన్ గేట్స్, ఫోబే అడెలే గేట్స్, రోరీ జాన్ గేట్స్.. అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అమీర్ ఖాన్ - కిరణ్ రావ్..
బాలీవుడ్ ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ కిరణ్ రావుతో 15 సంవత్సరాల వివాహ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు ఇటీవల ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ‘ఇప్పుడు తాము తీసుకున్న నిర్ణయం ముగింపు కాదని.. ఇప్పుడు మా జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం' అని వివరించారు. అమీర్ ఖాన్ తొలి భార్య రీనా దత్తా నుండి విడిపోయాక కిరణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ‘లగాన్'చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన కిరణ్ తో ప్రేమలో పడిన ఈ పీకే.. 2005లో డిసెంబర్ 28వ తేదీన రెండో పెళ్లి చేసుకున్నాడు. 2011లో ఆజాద్ అనే బాబుకి సరోగసీ పద్ధతిలో జన్మనిచ్చారు.
మంచు మనోజ్-ప్రణతీ రెడ్డి..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ప్రణతీ రెడ్డి జంట తమ వివాహ బంధానికి కేవలం నాలుగేళ్లలోనే ముగింపు పలికేశారు. 2015లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట 2019 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సందర్భంలో మనోజ్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘కలిసి ఉన్నంతకాలం మా ప్రయాణం చాలా ఆనందంగా సాగింది. అయితే కొన్ని విషయాల్లో విభేదాలు రావడంతో బాగా ఆలోచించి మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోయినా.. మాకు ఒకరిపై మరొకరికి గౌరవం అలాగే ఉంటుంది' అని వివరించాడు మనోజ్.
శ్వేతా బసు ప్రసాద్ - రోహిత్ మిట్టల్..
‘వేడి వేడి పాలు ఓలుకమ్మా' అంటూ కొత్త బంగారు లోకం సినిమాలో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అలరించిన శ్వేతా బసు ప్రసాద్ పెళ్లి చేసుకున్న సంవత్సరంలోపే తన భర్తతో విడిపోయింది. బాంబేకి చెందిన ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో 2018 సంవత్సరం డిసెంబర్ నెలలో 13వ తేదీన పూణే వేదికగా ఏడడుగులు వేసింది. అంతకుముందు నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు ఈ జంట. అయితే మొదటి పెళ్లిరోజు జరుపుకోవడానికి సరిగ్గా మూడు రోజుల ముందే విడిపోతున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘పుస్తకంలోని అన్నీ పేజీలు చదవకపోయినంత మాత్రాన ఆ పుస్తకం చెడ్డదని కాదు.. కొన్ని విషయాలు అసంపూర్ణంగా ఉంటేనే బాగుంటాయని అనుకుంటున్నా.. నా జీవితంలో మధుర జ్ణాపకాలను మిగిల్చినందుకు.. ఎల్లప్పుడూ నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు థ్యాంక్యూ రోహిత్' అని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన డైవర్స్ మ్యాటర్ ను రివీల్ చేసింది ఈ బ్యూటీ.
దియా మీర్జా-సాహిల్..
మరో బాలీవుడ్ జంట దియా మీర్జా-సాహిల్ జంట 2014 సంవత్సరంలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అంతకుముందు 2009 సంవత్సరంలో ప్రేమ ప్రయాణం మొదలుపెట్టిన వీరు 2019లో విడిపోతున్నట్లు ప్రకటించారు. అయితే తామిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ.. ఎప్పటికీ మంచి స్నేహితుల్లా ఉంటామని చెప్పుకొచ్చారు. ఇక విడాకుల అనంతరం ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖిని కరోనా కాలంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ అయిన ధియా.. త్వరలో తల్లి కాబోయే మధురానుభూతుల్ని ఆస్వాధిస్తోంది.
జెఫ్ బెజోస్-మెకంజీ..
ప్రపంచంలోనే అత్యంత కుభేరుల్లో ప్రముఖుడిగా పేరుగాంచిన అమెజాన్ కార్యనిర్వహకఅధికారి(CEO) జెఫ్ బెజోస్, ఆయన భార్య మెకంజీ స్కాట్ 2019లో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా నిలిచిన ఈ జంట తమ పాతికేళ్ల దాంపత్య బంధానికి గుడ్ బై చెప్పారు. 1993లో ఉద్యోగాన్వేషణలో భాగంగా మెకంజీని జెఫ్ ఇంటర్వ్యూ చేయడం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వారిద్దరూ పెళ్లి పీటలెక్కారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా నలుగురు పిల్లలు పుట్టారు. జెఫ్ తో విడిపోయిన తర్వాత ఈ ఏడాది డాన్ జెవెట్ అనే స్కూల్ టీచర్ ని మళ్లీ పెళ్లి చేసుకుంది.