Latest Updates
-
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి
అక్రమ సంబంధాలపై లేటెస్ట్ సర్వే.. ఆ సంబంధాలు పెరగడానికి 50 శాతం కారణాలు ఇవే!
ఇటీవలి కాలంలో అక్రమ సంబంధాలు భారీగా పెరిగిపోయాయి. చాలా మంది ఆ అక్రమ సంబంధాల కారణంగా తమ భాగస్వామిని హతమార్చడం, లేదా వేరే వారితో లేచిపోవడం వంటివి చేస్తున్నారు. అలాగే వివాహితులు తమ భాగస్వాములను మోసం చేయడం, ఆ తర్వాత అవి బయటపడితే అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదా కుటుంబాన్ని నష్టం వాటిల్లించే పరిస్థితులలోకి వెళ్లడం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో అక్రమ సంబంధాలపై కొందరు సర్వే నిర్వహించారు. ఈ తాజా సర్వేల్లో వివాహేతర సంబంధాలకు సంబంధించిన కొన్ని షాకింగ్ ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. వీటిలో ముఖ్యంగా "వివాహేతర సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఏమిటి?", "ఎంత శాతం మంది తమ భాగస్వాములను మోసం చేస్తున్నారు?" వంటి అంశాలపై సర్వే నిర్వహించారు.

ఎవరు సర్వే చేశారంటే
2022లో అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయం నిర్వహించిన గ్లోబల్ సోషల్ సర్వే (GSS) ప్రకారం, 20% మంది పురుషులు మరియు 13% మంది మహిళలు తమ జీవిత భాగస్వాములను మోసం చేసి అక్రమ సంబంధంలో కొనసాగుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. అలాగే, 2019లో బ్రిటన్లో నిర్వహించిన ఒక సర్వేలో 1000 మందికి పైగా వివాహితులపై ప్రశ్నించగా, 20% మంది పురుషులు మరియు 10% మంది మహిళలు తమ భాగస్వాములను మోసం చేసినట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య మారొచ్చు. ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ఎక్కువైపోవడంతో చాలా మంది ఇతరులతో సంబంధాలు పెట్టుకోవడం సాధారణంగా అయిపోయింది.
అయితే గత కొన్ని దశాబ్దాలుగా, వివాహేతర సంబంధాల ఏర్పాటు చేసే మహిళల సంఖ్య పెరిగింది. 2010లో జరిగిన ఒక సర్వేలో, భార్యలు తమ భర్తలను మోసం చేసే ధోరణి 20 సంవత్సరాల క్రితం కంటే 40% ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. అసలు వివాహేతర సంబంధాల్లో పాల్గొనడానికి కారణాలు ఏంటో ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
వివాహేతర సంబంధాలకు కారణాలు:
ఒంటరితనం:
స్త్రీలు ఎక్కువగా భావోద్వేగంగా స్పందిస్తారు. వారు తమ భాగస్వామి దగ్గరగా లేకపోతే, ఆ ఒంటరితనాన్ని తట్టుకోలేరు. దానివల్ల వారు వివిధ ఆలోచనలను చేయవచ్చు. చాలామంది తమ పనులు లేదా కుటుంబ సంబంధాలలో బిజీ అయి, భాగస్వామికి సమయం కేటాయించలేరు. అయితే, ఇది వారి బంధాన్ని బలహీనపరిచేస్తుంది.
ఆత్మగౌరవం:
స్త్రీల ఆత్మగౌరవం దెబ్బతినటం లేదా భాగస్వామి వారి వైపు గమనించే ప్రయత్నం చేయకపోవటం, వివాహేతర సంబంధాలకు కారణంగా మారుతుంది. ఈ పరిస్థితిలో, వారు అవసరమైన శ్రద్ధ, గౌరవం కోసం ఇతరుల వైపు చూడవచ్చు.
ఆవశ్యకతలు:
అధికారిక అధ్యయనాల ప్రకారం.. స్త్రీలు తమ భావోద్వేగ అవసరాలను తీర్చడానికి మోసం చేయాలని భావిస్తారు. ఇందులో సెక్స్, శ్రద్ధ, సానుభూతి, గౌరవం, ప్రశంస లాంటి అంశాలు కూడా ఉంటాయి. వారు తమ ప్రస్తుత సంబంధం నుంచి ఇవి పొందలేకపోతే, అవి ఇతర వ్యక్తుల దగ్గర కలుగుతాయని భావిస్తారు.
కోపం:
కొంతమంది స్త్రీలు తమ భాగస్వామిని ఒక నిర్దిష్ట విధంగా ఊహించుకుని వివాహం చేసుకుంటారు. కానీ భాగస్వామి వారి అంచనాలకు తగ్గట్లుగా వ్యవహరించకపోవడం, సంబంధంలో రుగ్మతలను తెచ్చిపెట్టవచ్చు. అదేవిధంగా, గత సంబంధాల కారణంగా కొంతమంది తమ ప్రస్తుత భాగస్వామిని మోసం చేస్తుంటారు. ఈ సమస్యలు తీవ్రమైన పరిణామాలను కలిగిస్తాయి, కనుక వివాహేతర సంబంధాల నుండి దూరంగా ఉండడం, సంబంధం యొక్క ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications











