Latest Updates
-
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
ఇండియాస్ గోల్డెన్ బాయ్గా పేరు తెచ్చుకున్న జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఒలింపిక్స్లో రెండు సార్లు పతకాలు సాధించి భారత దేశానికి ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఆయన, పెళ్లి చేసుకోవడంతో యావత్ దేశం ద్రుష్టి ఆ కొత్త జంటపై పడింది. నీరజ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు హిమానీ. కేవలం కొద్దీ మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. అయితే నీరజ్ పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఎవరు? ఆమె చరిత్ర ఏంటి అని నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆమె వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నీరజ్ చేయి పట్టుకున్న ఈ హిమానీ ఎవరు?
25 ఏళ్ల హిమానీ టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె సోనిపట్లో నివసిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. ఫ్రాంక్లిన్ పియర్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. అంతకుముందు ఢిల్లీలోని మిరాండా హౌస్లో పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ తరఫున జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ ఆడారు.

అలాగే తైపీలో జరిగిన 2017 విద్యాలయ స్థాయి క్రీడా పోటీలలో కూడా పాల్గొన్నారు. 2016లో మలేషియాలో జరిగిన ప్రపంచ జూనియర్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో పాల్గొని బంగారు పతకం సాధించారు. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం, హిమానీ 2018లో సింగిల్స్లో 42వ ర్యాంక్ మరియు డబుల్స్లో 27వ ర్యాంక్ను సాధించారు. హిమానీ సోదరుడు కూడా టెన్నిస్ ప్లేయర్.
నీరజ్ను గోల్డెన్ బాయ్ అని ఎందుకు పిలుస్తారు?
హర్యానాలోని పానిపట్ జిల్లా ఖండ్రా గ్రామానికి చెందిన 27 ఏళ్ల అథ్లెట్ అయిన నీరజ్ చోప్రా.. ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్గా పనిచేశారు. నీరజ్ చోప్రా 2011లో జావెలిన్ శిక్షణ ప్రారంభించాడు. అప్పటి నుంచి క్రమక్రమంగా రాణిస్తూ.. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించారు. దీంతో జావెలిన్ త్రోయర్లో స్వర్ణం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా నిలిచాడు. అలాగే 2018లో గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో కూడా స్వర్ణం సాధించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అతడిని అర్జున అవార్డుతో సత్కరించింది.



Click it and Unblock the Notifications