Latest Updates
-
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.! -
బ్రేక్ఫాస్ట్లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.! -
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, భద్ర, పంచకాలు.. మరి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.? -
ఇడ్లీ, దోశలు కాదు.. చుక్క నూనె లేకుండా ఆవిరిపై ఉడికే సొరకాయ కడుబు.. బరువు తగ్గడానికి పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్!
ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.?
నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. జులై 15 నుంచి ఆగష్టు 12 వరకు ఈ మాసం కొనసాగుతుంది. హిందూ సంప్రదాయంలో ఆషాఢం అనగానే మొదటిగా కొత్తగా పెళ్లయిన జంటలు దూరంగా ఉండాలని పెద్దలు నియమం తీసుకురావడం గుర్తొస్తుంది. తర్వాత ఈ మాసాన్ని శూన్య మాసంగా పిలుస్తారు. కాల గమనానికి, బుుతు మార్పులకు అనుగుణంగా ఇంకా ఆషాఢంలో చాలా ఆధ్యాత్మిక విశేషాలు, కట్టుబాట్లే ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం..

జులై 15 పాడ్యమి తిథి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆగష్టు 12 అమావాస్యతో ముగుస్తుంది. ఆధ్యాత్మికంగా, కాలానుగుణంగా, బుుతు మార్పులతో ఈ మాసంలో కొన్ని కట్టుబాట్లు, నియమాలు పాటించాలని హిందూ సంప్రదాయం చెబుతోంది. ఈ క్రమంలోనే ఆషాఢంలో వివాహాలకు ముహూర్తాలు ఉండవు. గృహ ప్రవేశాలు, ఉప నయనాలు, పుట్టు వెంట్రుకలు తీయడం, వ్యాపారాలు ప్రారంభించడం ఇంకా ఇతర శుభకార్యాలకి ఈ మాసంలో జరగవు. అందుకే ఈ మాసాన్ని శూన్య మాసంగా, మూఢంగా పెద్దలు చెబుతారు.

ఆషాఢ బోనాలు
అయితే ఆధ్యాత్మిక పరంగా దైవారాధాన, జపం, తపస్సు, వ్రతాలు, ఇతర పూజలకు ఈ మాసం శ్రేష్ఠమైనదని పండితులు పేర్కొంటున్నారు. ఈ మాసం దక్షిణాయాన ప్రారంభాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు, అమ్మవార్లకు బోనాలు ఆషాఢం నుంచి ప్రారంభమవుతాయి. భక్తిశ్రద్లలతో, డోలు చప్పుళ్లతో అమ్మవారికి చీరా, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
తొలి ఏకాదశి
ఇక ఆషాఢ మాసంలో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే తొలి ఏకాదశి(శయన ఏకాదశి) ఈ మాసంలోనే వస్తుంది. జులైన 25న తొలి ఏకాదశి నాడు విష్ణుమార్తిని ఆరాధిస్తారు. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు క్షీర సాగరంలో శేష తల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారని భక్తులు విశ్వసిస్తారు. దేవతా మూర్తులు నిద్రావస్థలో ఉండే ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఉండవని చెబుతారు. అందుకే శుభకార్యాల కంటే ఆధ్యాత్మిక చింతన ప్రయోజనం చేకూరుస్తుందని పండితులు చెబుతారు. ఇక, తొలి ఏకాదశి నాడు భగవంతుని ధ్యానంలో ఉపాసనలు, ఉపవాసాలు చేస్తే శుభం కలుగుతుందని చెబుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే పుణ్యం ఫలం లభిస్తుందని అంటారు.

ఆషాఢంలో గోరింటాకు
ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఈ మాసం ఆరోగ్య, సామాజిక పరంగా కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. వేసవి తాపం నుంచి బయటపడి వర్షాకాలంలో ప్రవేశించగానే సూర్యుని గమనం వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతాయి. వర్షాలు, వాతావరణంలో అధిక తేమ, బురద కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకే వీటి బారి నుంచి కాపాడుకునేందుకు ముందుగా శరీర బాహ్య సంరక్షణ అవసరం. ఈ క్రమంలో ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. అది అనాదిగా సంప్రదాయంగా వస్తోంది.
కారణాలివే..
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఎంతో ప్రయోజనం ఉంది. అందులోని ఔషధ గుణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ కాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వ్యవసాయం పరంగా చూస్తే ఈ మాసంలో రైతులు ఎక్కువగా సాగు పనుల్లో బిజీగా గడుపుతారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు నిర్వహిస్తే ప్రయాణ రాకపోకలకి ఇబ్బందిగా ఉంటుందని మన పూర్వీకులు ఈ నియమం తీసుకొచ్చారు.
కొత్త దంపతులు
ఆషాఢం ప్రారంభం అయ్యాక కొత్త దంపతులను విడిగా ఉంచే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. అందుకే వధువును పుట్టింటికి తీసుకెళతారు. ఈ నెల రోజుల పాటు దూరంగా ఉంచుతారు. అంతే కాకుండా అత్తాకోడళ్లు ఒకే గడప దాటకూడదని చెబుతారు. ఈ సంప్రదాయాన్ని నేటీకి పాటిస్తారు. ఇందులో శాస్త్రీయ, వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. ఆషాఢంలో మహిళ గర్భం దాల్చితే తొమ్మిది నెలల తర్వాత వేసవిలో ప్రసవం ఉంటుంది. వేసవిలో వేడి కారణంగా బాలింతలకు, నవజాత శిశువులకు శ్రేయస్కరం కాదని ఈ ఆచారాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు. మరో కారణాన్ని చూసుకుంటే.. పూర్వంలో వ్యవసాయ సంబంధిత పనులపైనే జనజీవనం సాగేది. మగవారు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండి, అలసిపోవడం కారణంగా భార్యతో గడిపే సమయం తక్కువ. అందుకే అత్తామామలు కోడలిని పుట్టింటికి పంపిస్తారు.



Click it and Unblock the Notifications