ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ అమ్మవారిని పూజిస్తే ఒత్తిడి తగ్గిపోతుందట..!

ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి తేదీ, సమయం, ఘటస్థాపన ముహుర్తం, పూజా విధానం గురించి తెలుసుకుందాం.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ నవరాత్రులు హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం నాలుగుసార్లు వస్తాయి.

Ashadha Gupt Navratri 2022 dates, Time, Ghatasthapana Muhurat, Puja Vidhi, Vrat Rules and Significance

అందులో మొదటిది ఛైత్ర నవరాత్రులు, రెండోది శరద్ నవరాత్రులు, మూడోది ఆషాఢ గుప్త నవరాత్రులు, నాలుగో మాఘ గుప్త నవరాత్రులు. ప్రస్తుతం ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభయ్యాయి.. అంటే జూన్ 30వ తేదీ గురువారం నుండి ప్రారంభమైన ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ దుర్గా పూజలు చేయడం చాలా పవిత్రకరంగా భావిస్తారు. ఈ సమయంలో వినాయకుడిని, దుర్గాదేవిని పూజించడం వల్ల మన బలం, ధైర్యం పెరుగుతుందని, మన జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు.

Ashadha Gupt Navratri 2022 dates, Time, Ghatasthapana Muhurat, Puja Vidhi, Vrat Rules and Significance

హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో జూన్ 30వ తేదీ గురువారం ప్రారంభమైన ఆషాఢ గుప్త నవరాత్రులను 9 రోజుల పాటు అంటే జులై 9వ తేదీ శనివారం వరకు జరుపుకుంటారు. దశమి రోజున అంటు జులై 9న పారాయణం నిర్వహిస్తారు.

ఈ ఏడాది అమ్మవారు శక్తి స్వరూప డోల మీద స్వారీ చేయనున్నారు. అంటే కాలినడకన వెళ్లనున్నారు. అమ్మవారి రాక మరియు నిష్క్రమణ వల్ల రెండు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ దుర్గామాతను పూజించడం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుందని, జీవితంలో ఏదైనా సమస్య ఉంటే, దాని నుండి బయటపడొచ్చని, దుర్గా మాతకు సంబంధించిన ప్రత్యేక మంత్రాలను పఠించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.

శుభ సమయం..
ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ శుభ ముహుర్తం ఉదయం 5:14 నుండి 11:33 గంటల వరకు ఉంటుంది. అభిజిత్ ముహుర్తం : 11:25 నుండి 12:35 గంటల వరకు ఉంటుంది.

FAQs
ఆషాఢ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి?

హిందూ క్యాలెండర్ ప్రకారం, 2022 సంవత్సరంలో జూన్ 30వ తేదీ గురువారం ప్రారంభమైన ఆషాఢ గుప్త నవరాత్రులను 9 రోజుల పాటు అంటే జులై 9వ తేదీ శనివారం వరకు జరుపుకుంటారు. దశమి రోజున అంటు జులై 9న పారాయణం నిర్వహిస్తారు.హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం నాలుగుసార్లు వస్తాయి. అందులో మొదటిది ఛైత్ర నవరాత్రులు, రెండోది శరద్ నవరాత్రులు, మూడోది ఆషాఢ గుప్త నవరాత్రులు, నాలుగో మాఘ గుప్త నవరాత్రులు. జూన్ 30వ తేదీ గురువారం నుండి ప్రారంభమైన ఆషాఢ గుప్త నవరాత్రుల వేళ దుర్గా పూజలు చేయడం చాలా పవిత్రకరంగా భావిస్తారు.

BoldSky Lifestyle

Desktop Bottom Promotion