Latest Updates
-
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి! -
ఏప్రిల్ 22 పంచాంగం: ఈ పనులు ఈ సమయంలో మొదలుపెడితే తిరుగుండదా? నేటి శుభ ముహూర్తాలివే! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి
శివుడి ఈ రుద్ర మంత్రాన్ని పఠిస్తే.. ఎన్నో అద్భుతాలు..!!
శివుడికి రుద్ర మంత్రమంటే చాలా ఇష్టం. ఈ రుద్ర మంత్రాన్ని రుద్రాభిషేకం సమయంలో పఠిస్తారు. రుద్ర మంత్రాలు యజుర్వేదంలో ఉంటాయ్. వీటిని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి నమకం, రెండు చమకం. ఈ రుద్ర మంత్రాలు శివుడి ఉగ్ర రూపాన్ని ప్రశాంతపరచడానికి, శక్తిని పిలిచే ఒక విధమైన మంత్రాలుగా చెప్పబడింది.

శివుడి రుద్ర మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి ?
1. వేద జ్యోతిషశాస్త్రంలో సోమవారం ఈ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాలి, ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది
2. ఉదయాన్నే స్నానం చేసుకొని శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని తూర్పు దిశలో శివలింగానికి ఎదురుగా కూర్చోవాలి. శివలింగంపై గంగాజలం సమర్పించడం ప్రారంభించి, బిల్వ పత్రాలు, పండ్లు, పువ్వులు, గంధం, ధాతురా మొదలైన వాటిని సమర్పించి, రుద్ర మంత్రాన్ని భక్తితో పఠిస్తానని ప్రతిజ్ఞ చేయాలి.
3. మీరు రుద్ర మంత్రాన్ని 108, 121, 133, లేదా 14611 సార్లు పఠించవచ్చు. మీరు రుద్ర మంత్ర ఉచ్చారణను స్పష్టంగా, సరిగ్గా చేస్తూ మౌనంగా మంత్రాన్ని పఠిస్తే చాలా బాగుంటుంది.
రుద్ర మంత్రం :
ఓం నమో భగవతే రుద్రాయ
నమస్తే రుద్రమన్యవ ఉత్తోత ఈశవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యాత ఇషుః శివతమా శివం బభూవ తే
ధనుః శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ
యా తే రుద్ర శివా తనూరఘోరాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవ
శివాం గిరిత్ర తాం కురు మా హింసీః పురుశం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మం సుమనా అసత్
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీః శ్చ సర్వాన్జంభయన్ సర్వాశ్చ యాతుధాన్యః
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః
యే చెమాం రుద్రా అభితో దీక్షు శృతసప్తయః
యే తీష్టంతి రోషితో ద్రాపా ఉతాహ్న్యః
యేషాం విషం మయి శిరో దదామి
అసౌ యోఅవసర్పతి నీలా గ్రీవో విలోహితః
ఉతైనం గోపా ఆదృశన్నాదృశన్నుదహార్యః
ఉతైనం విషా భూతాని స దృష్టో మృడయాతి నః
నమో అస్తు నీలా గ్రీవాయ సహస్రాక్షాయ మీఘుషే
అథో య ఇషుధి స్థస్తే భవంతు నం ఉతాదిటిః
సహస్రాణి సహస్రధా బాహువో హేతయః సమీ
రుద్ర మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు :
1. రుద్ర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించే భక్తులకు శివుని అనుగ్రహాన్ని పొందుతారు. మంచి ఆరోగ్యంతో పాటు జీవితం సుఖమయంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా మీకు సహాయజడుతుంది.
2. అనేక అనారోగ్యాలు, వ్యాధుల నుండి రక్షణ, ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. మీరు రుద్ర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే, మీరు ఆధ్యాత్మిక ఉద్ధరణను పొందుతారు. అంతేకాకుండా, మీరు మీ జీవితంలో ఏదైనా గందరగోళాన్ని, అనిశ్చితిని ఎదుర్కొంటే, మీరు రోజూ రుద్ర మంత్రాన్ని పఠించడం ద్వారా దాని నుండి దూరంగా ఉంటారు.
3. రుద్ర మంత్రాన్ని పఠిస్తే అసౌకర్యం, మానసిక ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
మీరు రుద్ర మంత్రాన్ని సరిగ్గా పఠించినప్పుడు మొత్తం మీద ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యం, భయాలు, కష్టాలు లేని జీవితాన్ని కలిగి ఉంటారు.
4. రుద్ర మంత్రాలు పఠించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మనలో దైవ శక్తిని ప్రభోధిస్తుంది. ఈ మంత్రాల సాధన ద్వారా మన ఆత్మశాంతి, దైవానుభూతి పొందగలమని భక్తుల, పండితుల విశ్వాసం.
5. రుద్ర మంత్రాలు పఠించడం వలన మన జీవితంలో సకల శుభాలు వస్తాయి. మనకు ధనం, ఆరోగ్యం, సంతోషం, శాంతి లభిస్తాయి. ఈ మంత్రాలు దేవుడి కృపను పొందడానికి, మన జీవితంలో సకల శుభాలను పొందడానికి ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications











