Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
శివుడి ఈ రుద్ర మంత్రాన్ని పఠిస్తే.. ఎన్నో అద్భుతాలు..!!
శివుడికి రుద్ర మంత్రమంటే చాలా ఇష్టం. ఈ రుద్ర మంత్రాన్ని రుద్రాభిషేకం సమయంలో పఠిస్తారు. రుద్ర మంత్రాలు యజుర్వేదంలో ఉంటాయ్. వీటిని రెండు భాగాలుగా విభజించారు. ఒకటి నమకం, రెండు చమకం. ఈ రుద్ర మంత్రాలు శివుడి ఉగ్ర రూపాన్ని ప్రశాంతపరచడానికి, శక్తిని పిలిచే ఒక విధమైన మంత్రాలుగా చెప్పబడింది.

శివుడి రుద్ర మంత్రాన్ని ఎప్పుడు పఠించాలి ?
1. వేద జ్యోతిషశాస్త్రంలో సోమవారం ఈ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాలి, ఎందుకంటే ఈ రోజు శివునికి అంకితం చేయబడింది
2. ఉదయాన్నే స్నానం చేసుకొని శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకొని తూర్పు దిశలో శివలింగానికి ఎదురుగా కూర్చోవాలి. శివలింగంపై గంగాజలం సమర్పించడం ప్రారంభించి, బిల్వ పత్రాలు, పండ్లు, పువ్వులు, గంధం, ధాతురా మొదలైన వాటిని సమర్పించి, రుద్ర మంత్రాన్ని భక్తితో పఠిస్తానని ప్రతిజ్ఞ చేయాలి.
3. మీరు రుద్ర మంత్రాన్ని 108, 121, 133, లేదా 14611 సార్లు పఠించవచ్చు. మీరు రుద్ర మంత్ర ఉచ్చారణను స్పష్టంగా, సరిగ్గా చేస్తూ మౌనంగా మంత్రాన్ని పఠిస్తే చాలా బాగుంటుంది.
రుద్ర మంత్రం :
ఓం నమో భగవతే రుద్రాయ
నమస్తే రుద్రమన్యవ ఉత్తోత ఈశవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యాత ఇషుః శివతమా శివం బభూవ తే
ధనుః శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ
యా తే రుద్ర శివా తనూరఘోరాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవ
శివాం గిరిత్ర తాం కురు మా హింసీః పురుశం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మం సుమనా అసత్
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీః శ్చ సర్వాన్జంభయన్ సర్వాశ్చ యాతుధాన్యః
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః
యే చెమాం రుద్రా అభితో దీక్షు శృతసప్తయః
యే తీష్టంతి రోషితో ద్రాపా ఉతాహ్న్యః
యేషాం విషం మయి శిరో దదామి
అసౌ యోఅవసర్పతి నీలా గ్రీవో విలోహితః
ఉతైనం గోపా ఆదృశన్నాదృశన్నుదహార్యః
ఉతైనం విషా భూతాని స దృష్టో మృడయాతి నః
నమో అస్తు నీలా గ్రీవాయ సహస్రాక్షాయ మీఘుషే
అథో య ఇషుధి స్థస్తే భవంతు నం ఉతాదిటిః
సహస్రాణి సహస్రధా బాహువో హేతయః సమీ
రుద్ర మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే లాభాలు :
1. రుద్ర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించే భక్తులకు శివుని అనుగ్రహాన్ని పొందుతారు. మంచి ఆరోగ్యంతో పాటు జీవితం సుఖమయంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కూడా మీకు సహాయజడుతుంది.
2. అనేక అనారోగ్యాలు, వ్యాధుల నుండి రక్షణ, ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది. మీరు రుద్ర మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే, మీరు ఆధ్యాత్మిక ఉద్ధరణను పొందుతారు. అంతేకాకుండా, మీరు మీ జీవితంలో ఏదైనా గందరగోళాన్ని, అనిశ్చితిని ఎదుర్కొంటే, మీరు రోజూ రుద్ర మంత్రాన్ని పఠించడం ద్వారా దాని నుండి దూరంగా ఉంటారు.
3. రుద్ర మంత్రాన్ని పఠిస్తే అసౌకర్యం, మానసిక ఒత్తిడి, అశాంతి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
మీరు రుద్ర మంత్రాన్ని సరిగ్గా పఠించినప్పుడు మొత్తం మీద ప్రశాంతమైన మనస్సు, ఆరోగ్యం, భయాలు, కష్టాలు లేని జీవితాన్ని కలిగి ఉంటారు.
4. రుద్ర మంత్రాలు పఠించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మనలో దైవ శక్తిని ప్రభోధిస్తుంది. ఈ మంత్రాల సాధన ద్వారా మన ఆత్మశాంతి, దైవానుభూతి పొందగలమని భక్తుల, పండితుల విశ్వాసం.
5. రుద్ర మంత్రాలు పఠించడం వలన మన జీవితంలో సకల శుభాలు వస్తాయి. మనకు ధనం, ఆరోగ్యం, సంతోషం, శాంతి లభిస్తాయి. ఈ మంత్రాలు దేవుడి కృపను పొందడానికి, మన జీవితంలో సకల శుభాలను పొందడానికి ఉపయోగపడతాయి.



Click it and Unblock the Notifications











