Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
అప్పుల బాధలోంచి తొందరగా బయటపడాలంటే.. ఈ పరిహారం చేయండి..!
అప్పు చేసి పప్పు కూడా సామెత మనకు తెలిసిందే. అప్పులు చేసి విపరీతమైన కష్టాలను పడుతుంటారు. అప్పు తీర్చలేక అష్టకష్టాలు పడుతుంటారు. అప్పు తీర్చడానికి ఇంట్లో వున్న బంగారాన్ని తాకట్టుపెడుతుంటారు. వాటిని విడిపించుకోలేక మరింత అప్పుల ఊబిలో ఇరుక్కు పోతుంటారు. హిందూ శాస్త్రంలో అన్ని సమస్యలకూ పరిష్కారం వుంది. ఈ అప్పుల బాధ పోవాలంటే కూడా పండితులు పరిహారం చెప్పారు. ఈ అప్పులు తీరాలంటే పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం.
రుణవిమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయ్. మంగళవారం రోజు మాత్రమే ఈ రుణవిమోచన అంగారక స్త్రోత్రాన్ని పారాయణం చేస్తే. మంగళవారమంటే అంగారకుడికి చాలా ఇష్టం. సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఈ స్త్రోత్రాన్ని పారాయణం చేయాలి. స్నానం చేసే నీళ్లల్లో ఎర్రని కుంకుమను, ఎర్రను కందులు కలుపుకోవాలి. ఈ నీళ్లతో స్నానం చేయాలి.

తరువాత ఎర్రని వస్త్రాలు ధరించాలి. అంగారకుడికి ఎరుపు వస్త్రాలంటే చాలా ఇష్టం. ఎర్రని కుంకుమని నుదుటన ధరించాలి. దక్షిణంవైపు తిరిగి అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఎర్రని గిన్నెలో కందులు వేసుకోవాలి. దానిపై ఎర్రని పుష్పాన్ని పెట్టి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
ముందుగా "శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే" అనే మంత్రాన్ని పఠించాలి. అని మంత్రాన్ని పఠించి గణపతికి నమస్కారం చేసుకోవాలి. తరువాత దీపాన్ని వెలుగించుకొని, అగరబత్తులు వెలిగించుకొని పూజ చేయాలి. బెల్లం పానకాన్ని నైవేద్యంగా పెట్టాలి.

నైవేద్యం పెట్టిన తరువాత కింద వున్న ఈ అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయాలి.
స్కంద ఉవాచ
రుణగ్రస్త నరాణాంతు రుణముక్తిః కథం భవేత్ |
బ్రహ్మొవాచ
వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |
అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ రుషిః అను ష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ రుణ విమోచనార్థే జపే వినియోగః |
ధ్యానమ్
రక్తమాల్యాంబరధరః శూలశక్తి గదాధరః |
చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః ||
మంగళో భూమిపుత్రశ్చ రుణహర్తా ధనప్రదః |
స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రధః ||
లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |
ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః ||
అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |
సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః ||
ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పరేత్ |
రుణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం||
అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |
నమోస్తుతే మమాశేష రుణమాశు వినాశయ ||
రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపధీపైర్గుడోదకైః |
మంగళం పూజయిత్వా టు మంగళాహనీ సర్వదా ||
ఏకవింశతి నామాని పఠిత్వాతు తదండకె |
రుణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః ||
తాశ్చ ప్రమార్జాయేత్పశ్చత్ వామపాదేన సంస్పృశత్ |
మూలమంత్రః |
అంగారక మహీపుత్ర భగవాన్ భక్తవత్సల |
నమోస్తుతే మహాశేషరుణమాశు విమోచయ ||
ఏవం కృతే న సందేహూ రుణం హిత్వా ధనీ భవేత్ ||
మహతీం శ్రియమాప్నోటి హ్యపరో ధనదో యథా |
అర్ఘ్యం
అంగారక మహీపుత్ర భగవన్ భక్త వత్సల |
నమోస్తుతే మమాశేరుణమాశు విమోచయ ||
భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |
రుణార్తస్త్వాం ప్రపన్నోస్మి గ్రహాణార్ఘ్యం నమోస్తుతే ||
పైన వున్న ఈ స్తోత్రాన్ని మొత్తం 21 సార్లు పారాయణం చేయాలి. 21 పూలను తీసుకొని ఒక్కో పువ్వును సమర్పిస్తూ అంగారకుడికి సమర్పించాలి. పువ్వులను సమర్పిస్తున్నప్పుడు 21 అంగారక నామాలను పఠించాలి. ఓం మంగళాయ నమ:, ఓం భూమి పుత్రాయ నమ:, ఓం రుణ హస్త్రే నమ:, ఓం ధన ప్రదాయ నమ:, ఓం స్థిరాసనాయ నమ:, ఓం మహాకాయాయ నమ:, ఓం సర్వకామ ఫల ప్రదాయ నమ:, ఓం లోహితాయ నమ:, ఓం లోహితాక్షాయ నమ:, ఓం సామగాన కృపాకరాయ నమ:, ఓం ధరాత్మజాయ నమ:, ఓం కుజాయ నమ:, ఓం భౌమాయ నమ:, ఓం భూమిజాయా నమ:, ఓం భూమినందనాయ నమ:, ఓం అంగారకాయ నమ:, ఓం అంగారకాయ నమ:, ఓం యమాయ నమ:, ఓం సర్వరోగాయపహారకాయ నమ:, ఓం స్రష్టే నమ:, ఓం కర్తృే నమ:, ఓం హర్త్రే నమ:, ఓం సర్వదేవ పూజితాయ నమ:
ఈ 21 నామాలను చదివి పూలను సమర్పన చేసుకోవాలి. తరువాత బెల్లం పానకాన్ని ప్రసాదంగా తీసుకుంటే పరిహారం పూర్తయినట్టే. అయితే 21 రోజుల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్య నుంచి బయటపడతారు. ఒక వేళ పడకపోతే 41 రోజుల పాటు ఈ పరిహారం చేస్తే తప్పక ఫలితం వుంటుంది.



Click it and Unblock the Notifications











