Latest Updates
-
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది? -
కిచెన్లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
Chaitra Navaratri 2022: ఈ ఏడాది దుర్గాదేవి ఏ వాహనంలో వస్తోందో తెలుసా?
చైత్ర నవరాత్రి 2022 సందర్భంగా శుభముహుర్తం, పూజ సమయం మరియు చైత్ర నవరాత్రుల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు ఎంతో పవిత్రమైనవి. ఈ సమయంలో దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు.

ఈ నవరాత్రులను ఉత్తర భారతంలో పెద్ద వేడుకలా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ, యుపీ సీఎం ఆదిత్యనాథ్ లతో ఎందరో ప్రముఖులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. చైత్ర నవరాత్రులను వసంత నవరాత్రి అని కూడా అంటారు. ఈ ఛైత్ర నవరాత్రులు ఛైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతాయి.

ఇవి శ్రీరాముడు జన్మించిన ఛైత్ర శుద్ధ నవమి వరకు కొనసాగుతాయి. అందుకే నవమి రోజున శ్రీరామ నవమి జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 2022లో ఛైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, శుభ ముహుర్తం ఎప్పుడు.. ఈ ఏడాది దుర్గాదేవి ఏ వాహనం మీద వచ్చారు.. పూజా పద్ధతులేంటి? కలశ స్థాపన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఛైత్ర నవరాత్రులు ఎప్పుడు?
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజు నుండి ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి అంటే శనివారం నుండి ప్రారంభమవుతాయి. 11వ తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేస్తారు. నవరాత్రుల్లో తొలిరోజున కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజుల్లో అమ్మవారు వచ్చే ప్రత్యేక వాహనాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.

ఈ ఏడాది ఏ వాహనంలో..
ఛైత్ర నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారు ప్రతి రాత్రి వివిధ రకాల వాహనాలపై విహరిస్తారు. పురాణాల ప్రకారం, అమ్మవారి వాహనం రాక కొన్ని సంఘటనలను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దుర్గాదేవి గుర్రం యొక్క రథంపై స్వారీ చేస్తూ వస్తుందట. సాధారణంగా నవరాత్రులు ఆదివారం లేదా సోమవారం ప్రారంభమైతే, దుర్గామాత ఏనుగుపై వస్తుంది. నవరాత్రులు మంగళవారం లేదా శనివారం ప్రారంభమైతే, అమ్మవారు గుర్రంపై స్వారీ చేస్తారు. అదే సమయంలో గురువారం లేదా శుక్రవారం నవరాత్రులు ప్రారంభమైతే అమ్మవారు పల్లకిలో విహరిస్తారు. ఈసారి ఛైత్ర నవరాత్రులు శనివారం రోజున ప్రారంభం అవుతున్నాయి కాబట్టి, అమ్మవారు వాహనం అశ్వం.

కలశ స్థాపన ముహుర్తం..
చైత్ర నవరాత్రులలో భాగంగా మొదటి రోజున కలశ స్థాపన చేస్తారు. ఆ తర్వాత, ప్రతి రోజూ 9 రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. కలశ స్థాపనను కళాశాల అని కూడా పిలుస్తారు. ఈసారి ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 06:10 గంటల నుండి 08:29 గంటల వరకు సంతోషకరమైన సమయం. శుభ ముహూర్తపు మొత్తం వ్యవధి 2 గంటల 18 నిమిషాలు.

కలశ స్థాపన నియమాలు..
* ఛైత్ర నవరాత్రుల వేళ ఉదయాన్నే నిద్ర లేచి, స్నానం చేసిన అనంతరం శుభ్రమైన బట్టలు ధరించాలి.
* తర్వాత దేవుని గదిని శుభ్రం చేసి తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించండి.
* అనంతరం మట్టి కుండ తీసుకొని దానిపై మట్టిని వేసి, ఆపై ధాన్యం గింజలను విస్తరించి, దానిపై రెండో పొర మట్టిని వేసి, దానిని అమర్చడానికి కొంచెం నీరు చల్లండి. పాత్రపై పవిత్రమైన దారాన్ని కట్టి పవిత్ర జలంతో నింపండి. సువాసన వచ్చే అగర్ బత్తీలు ఉంచండి. అలాగే అక్షం మరియు నాణేలను నీటిలో ఉంచండి. గిన్నె అంచున 5 అశోక లేదా మామిడి ఆకులను వేసి మూతతో కప్పాలి. ఎర్రటి గుడ్డను కొబ్బరికాయతో చుట్టి, తీగతో కట్టి, స్కిల్లెట్ పైన ఉంచండి. కలశ ఇప్పుడు దుర్గా దేవిని పిలవడానికి సిద్ధంగా ఉంది, దుర్గాదేవిని ఆహ్వానించండి, మీ ప్రార్థనను స్వీకరించండి మరియు రాత్రి తొమ్మిది రోజులు కలశలో నివసించమని అభ్యర్థించండి.

తొమ్మిది రూపాలివే..
తొలి రోజు : శైలపుత్రి రెండో రోజు : బ్రహ్మచారిణి మూడో రోజు : చంద్ర ఘంట నాలుగో రోజు : కుష్మాండ ఐదో రోజు : స్కంద మాత ఆరో రోజు : కాత్యాయని ఏడో రోజు : కాళీ మాత ఎనిమిదో రోజు : మహాగౌరి తొమ్మిదో రోజు : సిద్ధిదాత్రి
ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి స్తోత్రాలు, కథలతో దేవీ మయంగా భక్తి భావనతో దీక్షను చేయాలి. ఈ 9 రోజుల్లో తల్లిదండ్రుల పూజ, గురువుల పూజ, గో పూజ, కుమారీ పూజ, సువాసినీ పూజ వంటివి దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు.

ఈ పువ్వులతో..
నవరాత్రి పూజా వేళలో ఎర్రని పువ్వులు, ఎర్రని గంధం, ఎర్ర రంగులో ఉండే అక్షింతలు, ఎర్రని వస్త్రాలు దేవికి సమర్పించాలి. ఎర్రని కుంకుమతో అమ్మవారిని పూజించాలి. ఈ విధమైన పూజ అంటే అమ్మవారికి ప్రీతిపాత్రం. వసంత నవరాత్రులలో, శరన్నవరాత్రులలో పరాశక్తిని ఆరాధించి అబీష్టసిద్ధిని పొందిన వారు ఎందరో ఉన్నారని పండితులు చెబుతున్నారు.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా ఛైత్ర మాసంలోని శుక్ల పక్షం పాడ్యమి రోజు నుండి ఛైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీ నుండి అంటే శనివారం నుండి ప్రారంభమవుతాయి. 11వ తేదీ వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి. ఈ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది ప్రత్యేక రూపాల్లో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేస్తారు. నవరాత్రుల్లో తొలిరోజున కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజుల్లో అమ్మవారు వచ్చే ప్రత్యేక వాహనాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
తొలి రోజు : శైలపుత్రి రెండో రోజు : బ్రహ్మచారిణి మూడో రోజు : చంద్ర ఘంట నాలుగో రోజు : కుష్మాండ ఐదో రోజు : స్కంద మాత ఆరో రోజు : కాత్యాయని ఏడో రోజు : కాళీ మాత ఎనిమిదో రోజు : మహాగౌరి తొమ్మిదో రోజు : సిద్ధిదాత్రి. ఇలా తొమ్మిది రోజుల పాటు అమ్మవారి స్తోత్రాలు, కథలతో దేవీ మయంగా భక్తి భావనతో దీక్షను చేయాలి. ఈ 9 రోజుల్లో తల్లిదండ్రుల పూజ, గురువుల పూజ, గో పూజ, కుమారీ పూజ, సువాసినీ పూజ వంటివి దేవికి ప్రీతిపాత్రమైన విషయాలు.



Click it and Unblock the Notifications