Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రోజూ ఇలా చేస్తే ధనలాభం పొందుతారు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది
ప్రజలు ప్రతిరోజూ పని చేసేది డబ్బులు సంపాధించుకొని హాయిగా జీవించడానికే. ఎన్ని సమస్యలు ఉన్నా డబ్బులు సంపాధించడాన్ని మాత్రం అస్సలే ఆపరు. డబ్బుకోసం ప్రతిరోజూ చాలా కష్టపడి పని చేస్తుంటారు. కానీ 24 గంటలూ కష్టపడి పని చేసినా కొందరి చేతుల్లో మాత్రం డబ్బు నిలవదు. నీవు చేసే పనికి ప్రతిఫలం లభించదు. దీనంతటికీ కారణం వారి చుట్టూ ఉండే ప్రతికూల శక్తే. అయితే ఈ ప్రతికూల శక్తిని పారద్రోలి.. లక్ష్మీ దేవిని ఆహ్వానించాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే.
ఒక వ్యక్తి ఇంట్లో ప్రతికూల శక్తి చేరితే.. లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి పెట్టి వెళ్లిపోతుంది. అలాగే జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము చెప్పబోయే చిట్కాలు కనుక పాటిస్తే.. ఆ ఇంట్లో అనుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీ దేవి మళ్లీ ఇంటికి చేరుతుంది. దీనివల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా.. అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు.

1. ఆవనూనె దీపం వెలిగించండి:
రోజూ సాయంత్రం ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేయండి. మరియు ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా రోజూ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పూర్వీకుల ఆశీస్సులు తప్పుకుండా లభిస్తాయి.
2. కర్పూరం, లవంగాలు వెలిగించాలి:
కర్పూరం మంచి వాసనతో కూడిన శుభకరమైన పదార్థం. దేవారాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఈ కర్పూరం.. వాస్తు శాస్త్రంలో కూడా ముఖ్యమైన పదార్థంగా వెలుగొందింది. కర్పూరం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడంలో ఎప్పుడూ ముందుంటుంది. అలాగే వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించి అందులో 2 లవంగాలు రాసుకుంటే ఆ ఇంట్లో మంచి వాసన రావడంతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో స్థిరపడి ఐశ్వర్యాన్ని పెంచుతుంది.
3. గోమాతకు ఆహారం తినిపించండి:
ముక్కోటి దేవతలందరూ నివసించే జంతువుగా ఆవు పరిగణించబడుతుంది. ఈ గోమాతకు రోజూ ఆహారం తినిపిస్తే చాలా మంచిది. ఒక్క ఆవుకు ఆహారం పెట్టడం వల్ల గోమాతలో ఉన్న అన్ని దేవుళ్లు సంతృప్తి చెంది చల్లగా చూస్తాయి. జీవితంలో ఎదుర్కొనే సమస్యల నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
4. పక్షులకు ఆహారం ఇవ్వండి:
ప్రతిరోజూ పక్షులకు ఆహారం ఇవ్వడం చాలా మంచిదని భావిస్తారు. అలాగే ప్రతిరోజూ పక్షులకు ధాన్యాలు తినిపిస్తే, జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి మరియు శ్రేయస్సు ఉంటుంది.
5. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చకూడదు:
సాయంత్రం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఇంటిని ఊడ్వడం మానుకోవాలి. లేకుంటే సంపదలకు అధిపతి అయిన లక్ష్మీదేవిని అవమానించినట్లే. దీని వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావచ్చు. ఫలితంగా ఇంట్లో పేదరికం పెరుగుతుంది. కాబట్టి ఏ కారణం చేతనూ ఈ పని చేయకండి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications