Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
Margasira Amavasya: మార్గశిర అమావాస్య..ఆ రోజున ఈ 4 దానం చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయ్!
హిందూ మతంలో అమావాస్య తేదీకి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ముఖ్యంగా మార్గశిర మాసంలో వచ్చే అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకుంటే మార్గశిర మాసం అంటే శ్రీ కృష్ణుడికి చాలా ఇష్టం. మార్గశిర మాసాన్ని మార్గశీర్ష మాసం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సమయంలో స్వయంగా శ్రీ కృష్ణుడే తనకు 12 మాసాలలో మార్గశిర మాసం అంటే చాలా ఇష్టం అని చెబుతాడు.
అలాంటి మార్గశిర మాసంలో వచ్చే అమవాస్య(Margashirsha Amavasya 2024) చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ రోజున స్నానం, దాన ధర్మాలు రెండూ ముఖ్యమైనవిగా భావిస్తారు. మార్గశిర అమావాస్య రోజున హిందువులు పవిత్ర నదుల్లో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం చాలా శుభప్రదం అని నమ్ముతారు. ఈ రోజున సుకర్మ యోగం ఉండే సమయంలో స్నానం చేసి దానధర్మాలు చేస్తే మరింత ఫలితం ఉంటుందని నమ్మకం. ఈ రోజున పూర్వీకులకు నైవేద్యాలు కూడా సమర్పిస్తారు. దీంతో పూర్వీకులకు సంతోషం కలుగుతుందని, పితృ దోషం నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

నవంబర్ 30న మార్గశిర అమావాస్య రాబోతోంది. పంచాంగం ప్రకారం ఈ అమావాస్య తిథి నవంబర్ 30 ఉదయం 10:29 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 1న ఉదయం 11:50 గంటలకు ముగుస్తుంది.
మీ జాతకంలో పితృ దోషం ఉంటే మార్గశిర అమావాస్య రోజున ఖచ్చితంగా శ్రాద్ధం, తర్పణం చేయండి. అంతే కాకుండా ఈ రోజున మీరు అవసరమైన వారికి కొన్ని వస్తువులను దానం చేస్తే మీ ఇల్లు ఎల్లప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుంది. అయితే మార్గశిర అమావాస్య రోజు వేటిని దానం చేస్తో మీ ఇళ్లు ఎప్పుడూ సిరిసంపదలతో నిండి ఉంటుందో ఇక్కడ చూడండి.
తేనె
మార్గశిర అమావాస్య రోజున తేనెను దానం చేయడం వల్ల ధన నష్టం,వ్యాపారంలో నష్టం,ఆరోగ్య సంబంధిత సమస్యలు మొదలైన వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా తేనెను దానం చేయడంతో పూర్వీకులు సంతోషించి వారి ఆశీస్సులను మీకు ప్రసాదిస్తారు.
బెల్లం
ఈ ప్రత్యేకమైన రోజున అవసరమైన వారికి బెల్లం దానం చేయాలి. ఇది మీకు శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లయితే బెల్లం దానం చేయాలి. దీంతో మీరు అన్ని రకాల వ్యాధుల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
మినపప్పు
మార్గశిర అమావాస్య రోజున మినపప్పు దానం చేయాలి. దీంతో మీరు కోరుకున్న ఫలితాలను పొందుతారు. ఇది మాత్రమే కాదు మినపప్పు దానం చేయడం ద్వారా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.గ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
ఉన్ని వస్త్రం
మార్గశీర్ష అమావాస్య రోజున ఉన్ని బట్టలు నిరుపేదలకు దానం చేస్తే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి మీపై భగవంతుని విశేష ఆశీస్సులు లభిస్తాయి.



Click it and Unblock the Notifications