Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Good Friday 2022: గుడ్ ఫ్రైడే రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదంట...!
గుడ్ ఫ్రైడే రోజున చేయకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రైస్తవుల సంవత్సరంలో ముఖ్యమైన రోజులలో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రిస్ మస్ తర్వాత ఈ పవిత్రమైన రోజుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఈరోజున ఏసుక్రీస్తుకు శిలువ వేయడాన్ని సూచిస్తుంది. ఈ శిలువ వేసినప్పటికీ ఏసు మూడు రోజుల వరకు ప్రాణాలతో ఉన్నాడని.. చాలా మంది నమ్ముతారు.

తమ ప్రభువు ఏసు మానవత్వం యొక్క మంచి, రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని భావిస్తారు. ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు. ఈ ఏడాది 2022లో ఏప్రిల్ 15వ తేదీన శుక్రవారం నాడు గు డ్ ఫ్రైడే వచ్చింది. ఈ సందర్భంగా ఈ పవిత్రమైన రోజున కొన్ని పనులను చేయకూడదంట.. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

నిశ్శబ్దం పాటించాలి..
ఈరోజు ఏసు క్రీస్తు మరణాన్ని స్మరించుకునే రోజు. కాబట్టి ఈరోజున ఏ చర్చిలోనూ గంటలు మోగనివ్వరు. ఈ పవిత్రమైన నిశ్శబ్దం మరియు కఠినమైన ఉపవాసం పాటిస్తారు. ఈరోజున కలర్ ఫుల్ డ్రస్సులు కూడా ధరించకూడదట. ఎందుకంటే ఈరోజున ఏసుక్రీస్తు మరణానికి సంతాపం వ్యక్తం చేసే రోజు. కాబట్టి చాలా మంది నల్లని వస్త్రాలు ధరించేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

కొవ్వొత్తులు వెలిగించరు..
గుడ్ ఫ్రైడే రోజున అద్దాలను మూసేస్తారు. ఒక అద్దం కూడా బయటపడకుండా ఉండాలని భావిస్తారట. అలాగే ఏసు మరణించిన వారి చిహ్నాల ముందు కొవ్వొత్తులు మరియు దీపాలను వెలిగించకూడదట.

మధ్యాహ్నం సమయంలో..
ఈరోజున మీరు ఎలాంటి పొరపాట్లు పనులు చేయకూడదు. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం వేళ ఏసు శిలువ వేయబడ్డాడు కాబట్టి ఈ సమయాన్ని పూజలు చేసేందుకు గడపాలి.

ఎక్కడికి వెళ్లకూడదు..
ఏసు శిలువ వేయబడిన సమయంలో మీరు రేడియో, టెలివిజన్ మరియు గ్యాడ్జెట్లను ఉపయోగించకూడదట. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో కర్టెన్లు తెరవకూడదు. తెరవనివ్వకూడదు. బయటకు అంటే ఏదైనా సినిమాకు లేదా క్రీడా కార్యక్రమాలు లేదా ఇతర వినోద కార్యక్రమాలను చూడటానికి కూడా వెళ్లకూడదంట.

కలయికలో పాల్గొనకూడదు..
ఈ పవిత్రమైన రోజున జంటలు కలయికలో పాల్గొనకూడదట. అలాగే ఎలాంటి రెస్టారెంట్ వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించాలట. ఈ రోజున ఆటలను కూడా ఆడకూడదట.

దురలవాట్లకు దూరంగా..
యేసు శిలువ వేయబడిన ఈరోజున అనవసరంగా మాట్లాడటం మానుకోవాలి. ఎందుకంటే వీలైనంత మేరకు ప్రతి ఒక్కరూ నిశ్శబ్దాన్ని పాటించాలి లేదంటే ఏసు ఆరాధనలో పాల్గొనాలి. అలాగే ఈరోజు మద్యం సేవించడం, పొగతాగడం వంటివి చేయకూడదట. లాటరీ టికెట్లు కొనడం, అమ్మడం వంటివి చేయరాదు. పేకాట వంటివి కూడా బంద్ చేయాలంట.
క్రైస్తవ మతాన్ని విశ్వసించే వారికి గుడ్ ఫ్రైడే అనేది ఒక ప్రత్యేకమైన రోజు. తాము దేవుడిగా భావించిన యేసు సిలువ వేయబడిన రోజు ఈరోజున. ఆ సిలువ వేసిన తర్వాత కూడా యేసు మూడు రోజుల తర్వాత కూడా ఇంకా జీవించి ఉండటం చూసి చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.తమ ప్రభువు అయిన యేసు మానవత్వం యొక్క మంచి మరియు రక్షణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడని నమ్ముతారు. ఈ సంవత్సరం 2022లో ఏప్రిల్ 15వ తేదీన శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడ్ పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications