Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
భారీ శుభవార్త..కైలాస మానస సరోవర యాత్రకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం,ఎలా అప్లయ్ చేసుకోవాలో చూడండి
జీవితంలో ఒక్కసారి అయినా కైలాస మానస సరోవర యాత్ర చేయాలని చాలామంది హిందువుల కోరిక. ఒక్క హిందువులకే కాదు..బౌద్దులు, జైనులుకు కూడా ఇది అత్యంత పవిత్రమైన యాత్ర. కైలాస పర్వతం శివుడి నివాసంగా మన పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇప్పటికీ శివుడు నివసిస్తూ, ధ్యానం చేస్తుంటాడని నమ్ముతారు. ఈ పర్వతం దగ్గర బృహ్మ సృష్టించిన మానస సరోవరం అనే సరస్సులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని హిందువుల విశ్వాసం. దేవతలందరూ ఈ సరస్సులోనే స్నానం చేస్తారని నమ్ముతారు. అయితే ఈ కైలాస పర్వతం టిబెట్ దేశంలో ఉంది..టిబెట్ చైనా ఆధీనంలో ఉన్నందున ఈ యాత్రకు వెళ్లాలనుకుంటే చైనా అనుమతి అవసరం.
గత 5 ఏళ్లుగా మానస సరోవర యాత్ర నిలిపివేయబడిన విషయం తెలిసిందే. కరోనా,చైనా భారత్ మధ్య ఉద్రిక్తతల కారణంగా 5 ఏళ్లుగా నిలిచిపోయిన మానస సరోవర్ యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభం కానుందని భారత విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. జూన్-ఆగస్టు మధ్యలో నిర్వహించే ఈ యాత్రకు వెళ్లాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. యాత్ర కోసం అప్లయ్ చేసుకోడానికి చివరి తేదీ మే 13,2025.

ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి
Step 1: ముందుగా కైలాస మానస సరోవర్ యాత్ర అధికారిక వెబ్ సైట్ kmy.gov.in ఓపెన్ చెయ్యండి.
Step 2: ఈ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్న ఆన్ లైన్ అప్లికేషన్ ఫారమ్ ని ఖచ్చితమైన వివరాలతో నింపాలి. మీ పేరు, పుట్టిన తేదీ, పాస్ పోర్ట్ లో ఉన్న ఇతర వివరాలతో కరెక్ట్ గా నమోదు చేయాలి.
Step 4: తర్వాత అక్కడ అడినట్లుగా అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఏయే డాక్యుమెంట్లు కావాలంటే..1.లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజు ఫొటో యొక్క స్కాన్ చేసిన కాపీ(JPG ఫార్మాట్ లో ఉండాలి, 300KB మించకూడదు). 2. భారతీయ పాస్ పోర్ట్ స్కాన్ చేసిన కాపీ(ఫొటో,వ్యక్తిగత వివరాలు ఉన్న పేజీ, చివరి పేజీ PDF ఫార్మాట్ లో 500KB మించకూడదు). 3. మెడికల్ ఫిట్ నెస్ సర్టిపికెట్ ను సమర్పించాలి.
Step 5: ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. వెబ్సైట్లో ఫీజు వివరాలు అందుబాటులో ఉంటాయి.
Step 6: ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. వెబ్ సైట్ లో ఫీజు వివరాలు అందుబాటులో ఉంటాయి.
Step 7: తర్వాత submit అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మెసేజ్,ఈమెయిల్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం మీరు సమర్పించిన అప్లికేషన్ ఫారమ్ ప్రింట్ అవుట్ తీసుకోండి.
అర్హతలు
-దరఖాస్తు చేసుకునే వ్యక్తి 2025 జనవరి 1 నాటికి 18-70 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి
-చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ ఉండాలి. మీ పాస్ పోర్ట్ వ్యాలిడిటీ సెప్టెంబర్ 1,2025 నాటికి కనీసం 6 నెలలు ఉండాలి.
-అధిక ఎత్తులో ప్రయాణించడానికి శారీరకంగా,వైద్య పరంగా ధృఢంగా ఉండాలి. బాడీ మాస్ ఇండెక్స్(BMI)25 దాటకూడదు.
ఇలా వెళ్తారు
ఈ ఏడాది ఒక్కొక్కటి 50మంది భక్తులతో కూడిన 5 గ్రూపులు ఉత్తరాఖండ్ లోని లిపులేఖ్ పాస్ ద్వారా కైలాస మానస సరోవర యాత్రకు వెళ్తారు..ఒక్కొక్కటి 50మంది ప్రయాణికులతో కూడా 10 గ్రూపులు సిక్కింలోని నాథులా పాస్ గుండా కైలాస మాన సరోవరానికి చేరుకుంటారు.



Click it and Unblock the Notifications