Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Hanuman Jayanti 2025: ఈ మంత్రం 11సార్లు జపిస్తే ఏడాదంతా మీపై ఆంజనేయస్వామి అనుగ్రం
దేశవ్యాప్తంగా ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆంజనేయస్వామి ఆలయాలకు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని నిజమైన హృదయంతో పూజించేవారి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు. హిందూమతంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హనుమాన్ జయంతి నాడు ఆంజనేయస్వామిని ఏ విధంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి,పూజా విధానం, శుభసమయం వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
శుభ సమయం
ఆంజనేయస్వామి పూజకు పవిత్రమైన సమయం ఏప్రిల్ 12న అంటే శనివారం ఉదయం 4:30 నుంచి 5: 59 వరకు ఉంటుంది. సాయంత్రం పూట 6: 45 నుండి రాత్రి 8: 09 వరకు ఉంటుంది.

హనుమాన్ జయంతి పూజ సమాగ్రి
హనుమాన్ విగ్రహం, తేనె, గంధపు చెక్క, పువ్వులు, దీపం, కర్పూరం, ధూపం కర్రలు, ధూపం, సింధూరం, చరణ్ పాదుక, పూలమాల, పండ్లు, స్వీట్లు, ఎర్రటి వస్త్రం, గంగా జలం, పాలు, నెయ్యి, తమలపాకు, తమలపాకు, ఎరుపు రంగు వస్త్రం మొదలైనవి.
పూజా విధానం
ముందుగా ఆంజనేయ స్వామి ఫొటోని లేదా విగ్రహాన్ని గంగా జలం, తేనె,గంధం,పాలు,పెరుగుతో స్నానం చేయించండి. తర్వాత ఎర్రటి వస్త్రం ధరించండి, తర్వాత దేవుడి ఫొటోని పీఠపై ఉంచి దేవుడి ముందు దీపం వెలిగించాలి, తర్వాత హనుమాన్ చాలీసా, మంత్రాలు, మనుమంతుడి వివిధ పేర్లను జపించండి. దేవుడి నుదిటిపై సింధూరం ఉంచి,పూలమాలతో అలంకరించాలి. తర్వాత స్వామికి ఇష్టైన ఆహారపదార్థాలు నైవేధ్యంగా ససమర్పించాలి. ఇవాళ రామచరితమానస్ పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇవాళ రాముడు సీతను పూజించడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు.
చదవాల్సిన మంత్రాలు
ఓం హం హనుమతే నమః : ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా ఆంజనేయస్వామి అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందవచ్చు. కనీసం 21సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తే మారుతి విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు తెలిపారు.
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్: ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇది శని అనుగ్రహం పొందటానికి కూడా సహాయపడుతుంది.
మర్కటేశ మహోత్సాహా సర్వ శోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపమయే ప్రభో : ఈ ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదివినా హనుమంతుని అనుగ్రహం సంవత్సరం మెత్తం మీపై ఉంటుంది.
ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వ శత్రు సంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా!
ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహా
ఈ మంత్రాలతో పాటు, హనుమాన్ చాలీసా, సుందరకాండం పారాయణం చేయడం కూడా చాలా మంచిది.



Click it and Unblock the Notifications