Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
Hanuman Jayanti 2025: ఈ మంత్రం 11సార్లు జపిస్తే ఏడాదంతా మీపై ఆంజనేయస్వామి అనుగ్రం
దేశవ్యాప్తంగా ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆంజనేయస్వామి ఆలయాలకు పోటెత్తారు. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడిని నిజమైన హృదయంతో పూజించేవారి జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు. హిందూమతంలో అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటైన హనుమాన్ జయంతి నాడు ఆంజనేయస్వామిని ఏ విధంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి,పూజా విధానం, శుభసమయం వంటి వివరాలను ఇప్పుడు చూద్దాం.
శుభ సమయం
ఆంజనేయస్వామి పూజకు పవిత్రమైన సమయం ఏప్రిల్ 12న అంటే శనివారం ఉదయం 4:30 నుంచి 5: 59 వరకు ఉంటుంది. సాయంత్రం పూట 6: 45 నుండి రాత్రి 8: 09 వరకు ఉంటుంది.

హనుమాన్ జయంతి పూజ సమాగ్రి
హనుమాన్ విగ్రహం, తేనె, గంధపు చెక్క, పువ్వులు, దీపం, కర్పూరం, ధూపం కర్రలు, ధూపం, సింధూరం, చరణ్ పాదుక, పూలమాల, పండ్లు, స్వీట్లు, ఎర్రటి వస్త్రం, గంగా జలం, పాలు, నెయ్యి, తమలపాకు, తమలపాకు, ఎరుపు రంగు వస్త్రం మొదలైనవి.
పూజా విధానం
ముందుగా ఆంజనేయ స్వామి ఫొటోని లేదా విగ్రహాన్ని గంగా జలం, తేనె,గంధం,పాలు,పెరుగుతో స్నానం చేయించండి. తర్వాత ఎర్రటి వస్త్రం ధరించండి, తర్వాత దేవుడి ఫొటోని పీఠపై ఉంచి దేవుడి ముందు దీపం వెలిగించాలి, తర్వాత హనుమాన్ చాలీసా, మంత్రాలు, మనుమంతుడి వివిధ పేర్లను జపించండి. దేవుడి నుదిటిపై సింధూరం ఉంచి,పూలమాలతో అలంకరించాలి. తర్వాత స్వామికి ఇష్టైన ఆహారపదార్థాలు నైవేధ్యంగా ససమర్పించాలి. ఇవాళ రామచరితమానస్ పఠించడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇవాళ రాముడు సీతను పూజించడం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు.
చదవాల్సిన మంత్రాలు
ఓం హం హనుమతే నమః : ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించడం ద్వారా ఆంజనేయస్వామి అనుగ్రహంతో శుభ ఫలితాలు పొందవచ్చు. కనీసం 21సార్లు ఈ మంత్రాన్ని చదువుతూ స్వామివారిని పూజిస్తే మారుతి విశేషమైన అనుగ్రహం మీకు లభిస్తుందని పండితులు తెలిపారు.
ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్: ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఇది శని అనుగ్రహం పొందటానికి కూడా సహాయపడుతుంది.
మర్కటేశ మహోత్సాహా సర్వ శోక వినాశన శత్రు సంహార మాం రక్ష శ్రియం దాపమయే ప్రభో : ఈ ధ్యాన శ్లోకాన్ని 11 సార్లు చదివినా హనుమంతుని అనుగ్రహం సంవత్సరం మెత్తం మీపై ఉంటుంది.
ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వ శత్రు సంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశికరణాయ రామదూతాయ స్వాహా!
ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహా
ఈ మంత్రాలతో పాటు, హనుమాన్ చాలీసా, సుందరకాండం పారాయణం చేయడం కూడా చాలా మంచిది.



Click it and Unblock the Notifications











