Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
తలుపులు లేని శక్తివంతమైన ఏకైక ఆలయం.. క్షణాల్లో కోరిన కోరికలు తీరిపోతాయి.. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పూజలు చేస్
మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా.. కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేకత ఉంటుంది. స్వయంభూగా వెలవడం, ఆలయాలకు తలుపులు లేకపోవడం వంటి ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏపీలోనూ ఓ ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు ఆ ఆలయంలోని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.
అదే సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లి దేవాలయం. నాలుగు రాష్ట్రాల ప్రజలు కొలుచుకునే ఈ తల్లి ఆలయానికి తలుపులు ఉండవు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవు, ఈ ఆలయ విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆలయ చరిత్ర ఏంటంటే..
ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. కాళంగి నది ఒడ్డున ఈ ఆలయం, సుమారు 500 ఏళ్ల క్రితం.. కొంతమంది పశువుల కాపరులు కాళంగి నది ఒడ్డున పశువులు మేపుతుండగా.. నదిలో ఓ సుడిగుండంలో ఓ బాలుడు చిక్కుకున్నాడట. ఆ బాలుడికి ఓ రాయి తగలడంతో ఆ రాయిని పట్టుకొని ఆ బాలుడు ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం తనను ఒడ్డుకు తెచ్చిన ఆ రాయిని చూడగా అది చెంగాళమ్మ పరమేశ్వరి దేవి విగ్రహం కనిపించింది.
దీంతో ఆ బాలుడు ఊర్లో ప్రజలకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆ విగ్రహాన్ని కదిపేందుకు ప్రయత్నించారు. ఎంత కదిపినా కదలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయిన గ్రామస్థులకు.. రాత్రి కలలోకి వచ్చి తనను కాడకూడదని చెప్పడంతో అక్కడే గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారు.
ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవంటే..
ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. ఈ ఆలయంలోని చెంగాళమ్మ దేవి 24 గంటలు దర్శన భాగ్యం కలిగిస్తారు. అమ్మవారికి గుడి కట్టిన తరువాత తలుపులు చూపిద్దామని చెక్కలు చెక్కిస్తుండగా.. అమ్మవారు పూజారి కలలోకి వచ్చి, తన ఆలయానికి తలుపులు వద్దొని చెప్పిందంట. దీంతో ఆ చెక్కలను పక్కకు పెట్టగా.. వాటికి మొలకలు వచ్చి, మహా వృక్షంగా మారింది. ఆ వృక్షం కింద అమ్మవారు 24 గంటలకు అలసట లేకుండా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు.
చెంగాళమ్మ తల్లి దేవాలయం ప్రాముఖ్యత
చెంగాళమ్మ దేవి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెంగాళమ్మ తల్లికి కూడా చాలా మహిమలు ఉంటాయని భక్తులు నమ్ముతుంటారు. ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజషన్(ఇస్రో) ఏదైనా ఉపగ్రహాలు ప్రయోగించేటప్పుడు లేదా ఏదైనా ప్రయోగం చేసే సమయంలో ముందుగా ఉపగ్రహాల నమూనాను చెంగాళమ్మ తల్లి వద్ద పెట్టి పూజించి, ఆ తరువాత ప్రయోగం చేస్తారు.
అంతటి మహిమలు ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్ముతుంటారు. అమ్మవారికి పూజలు చేసి మనసుతో కోరికలు కోరుకుంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహం చూపుతుందని, అలాంటివే ఇక్కడ చాలా జరిగాయని చెబుతూ ఉంటారు.



Click it and Unblock the Notifications











