Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
తలుపులు లేని శక్తివంతమైన ఏకైక ఆలయం.. క్షణాల్లో కోరిన కోరికలు తీరిపోతాయి.. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పూజలు చేస్
మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నా.. కొన్ని ఆలయాలకు మాత్రం ప్రత్యేకత ఉంటుంది. స్వయంభూగా వెలవడం, ఆలయాలకు తలుపులు లేకపోవడం వంటి ప్రత్యేకతలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఏపీలోనూ ఓ ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలు ఆ ఆలయంలోని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు.
అదే సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లి దేవాలయం. నాలుగు రాష్ట్రాల ప్రజలు కొలుచుకునే ఈ తల్లి ఆలయానికి తలుపులు ఉండవు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవు, ఈ ఆలయ విశిష్టతలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆలయ చరిత్ర ఏంటంటే..
ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. కాళంగి నది ఒడ్డున ఈ ఆలయం, సుమారు 500 ఏళ్ల క్రితం.. కొంతమంది పశువుల కాపరులు కాళంగి నది ఒడ్డున పశువులు మేపుతుండగా.. నదిలో ఓ సుడిగుండంలో ఓ బాలుడు చిక్కుకున్నాడట. ఆ బాలుడికి ఓ రాయి తగలడంతో ఆ రాయిని పట్టుకొని ఆ బాలుడు ఒడ్డుకు చేరుకున్నాడు. అనంతరం తనను ఒడ్డుకు తెచ్చిన ఆ రాయిని చూడగా అది చెంగాళమ్మ పరమేశ్వరి దేవి విగ్రహం కనిపించింది.
దీంతో ఆ బాలుడు ఊర్లో ప్రజలకు సమాచారం అందించగా.. వారు వచ్చి ఆ విగ్రహాన్ని కదిపేందుకు ప్రయత్నించారు. ఎంత కదిపినా కదలకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయిన గ్రామస్థులకు.. రాత్రి కలలోకి వచ్చి తనను కాడకూడదని చెప్పడంతో అక్కడే గుడి కట్టి పూజలు చేయడం ప్రారంభించారు.
ఈ ఆలయానికి తలుపులు ఎందుకు ఉండవంటే..
ఈ ఆలయానికి ఎలాంటి తలుపులు ఉండవు. ఈ ఆలయంలోని చెంగాళమ్మ దేవి 24 గంటలు దర్శన భాగ్యం కలిగిస్తారు. అమ్మవారికి గుడి కట్టిన తరువాత తలుపులు చూపిద్దామని చెక్కలు చెక్కిస్తుండగా.. అమ్మవారు పూజారి కలలోకి వచ్చి, తన ఆలయానికి తలుపులు వద్దొని చెప్పిందంట. దీంతో ఆ చెక్కలను పక్కకు పెట్టగా.. వాటికి మొలకలు వచ్చి, మహా వృక్షంగా మారింది. ఆ వృక్షం కింద అమ్మవారు 24 గంటలకు అలసట లేకుండా భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు.
చెంగాళమ్మ తల్లి దేవాలయం ప్రాముఖ్యత
చెంగాళమ్మ దేవి ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెంగాళమ్మ తల్లికి కూడా చాలా మహిమలు ఉంటాయని భక్తులు నమ్ముతుంటారు. ఇండియన్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజషన్(ఇస్రో) ఏదైనా ఉపగ్రహాలు ప్రయోగించేటప్పుడు లేదా ఏదైనా ప్రయోగం చేసే సమయంలో ముందుగా ఉపగ్రహాల నమూనాను చెంగాళమ్మ తల్లి వద్ద పెట్టి పూజించి, ఆ తరువాత ప్రయోగం చేస్తారు.
అంతటి మహిమలు ఉన్న ఈ ఆలయంలోని అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరిక అయినా నెరవేరుతుందని నమ్ముతుంటారు. అమ్మవారికి పూజలు చేసి మనసుతో కోరికలు కోరుకుంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహం చూపుతుందని, అలాంటివే ఇక్కడ చాలా జరిగాయని చెబుతూ ఉంటారు.



Click it and Unblock the Notifications











