Latest Updates
-
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు
ఆ రోజు మీ సోదరి ఇంటికి వెళ్తే మీకు నరకం అనేది ఉండదు, అకాల మరణం రాదు, యముడే చెప్పాడు
ఈ పండుగను భాయ్ దూజ్, భాయి టీకా, భాయ్ తిహార్ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ రోజు సోదరులంతా వాళ్ల సోదరీమణుల ఇళ్లకు చేరుకుని వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు.మీకు నరకం అనేది ఉండదు.
యుమున నది గురించి మనకందరికీ తెలుసు. అయితే ఆమె సోదరుడు యముడు.. యమ ధర్మరాజు. యముడు నిత్యం మానవులకు శిక్షలు వేసే పనిలో బిజీగా ఉండి కనీసం తన చెల్లెలిని చూడడానికి కూడా రాలేడు. దీంతో ఒక రోజు యముడిని తన చెల్లి చూడాలని కోరుతుంది.
అన్న నువ్వు కచ్చితంగా రావాలి అని అంటుంది. సరే అని యముడు వెళ్తాడు. తన అన్న రాగానే సకల మర్యాదలు చేసింది. యముడు కడుపు నిండా చెల్లి చేతి వంట తిని ఆనందించాడు.

మా ఇంటికి రావడమే గొప్ప
తర్వాత చెల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటాడు యముడు. అప్పుడు యమునా దేవి.. అన్నా నువ్వు మా ఇంటికి రావడమే నాకు గొప్ప. ప్రతి ఏడాది నువ్వు ఇదే రోజు మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని అంటుంది. సరే అమ్మా.. అలాగే వస్తాను అని యముడు మాటిస్తాడు.

అస్సలు నరకం ఉండదు
అలాగే ఇదే రోజు ఎవరైతే చెల్లెలు లేదా అక్కల ఇళ్లలో భోజనం చేసి సోదరి బాగోగులు తెలుసుకుంటారో అలాంటి వారందరికీ అస్సలు నరకం ఉండదని చెబుతాడు యముడు. అలాగే అకాల మరణం కూడా వారికి సంభవించదు అని అంటాడు. అలాగే ఆ రోజు సోదరుడిని ఇంటికి పిలిచి అన్నం పెట్టిన సోదరి కూడా దీర్ఘ సుమంగళిగా ఉంటుందని యుముడు చెబుతాడు.

భాతృ విదియ రోజు
యముడు తన సోదరి ఇంటికి ఎప్పుడు వెళ్లాడనే కదా మీ డౌట్. భాతృ విదియ రోజు యముడు తన సోదరి యమున ఇంటికి వెళ్లాడు. దీపావళి తర్వాత రెండో రోజున ఇది వస్తుంది. ఈ రోజునే యమ ద్వితీయం అని అంటారు. నరకాసురుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడిని సుభద్ర ఇంటికి ఆహ్వానిస్తుంది. అందువల్ల భాతృ విధియను జరుపుకుంటూ ఉంటారు.

దీపావళి తర్వాత రెండో రోజు
సాధారణంగా పెళ్లి అయిన తర్వాత ఎవరి సంసారాల్లో వారు బిజీగా ఉండి సోదరీ సోదరులు అస్సలు కలుసుకోలేరు. వారి మధ్య ఉన్న ఆప్యాయతను అనురాగాన్ని గుర్తు చేసుకునేందుకు దీపావళి తర్వాత రెండో రోజు ఈ పండుగ చేసుకోవాలి.
సోదరి బాగోగులు, ఆమె కష్టసుఖాలు తెలుసుకుని ఆమె చేతి వంట తిని రావాలనే ఈ పండుగను పెట్టారు పెద్దలు. అయితే దీన్ని ఎక్కువగా ఉత్తరాదిలో చేసుకుంటూ ఉంటారు. దక్షిణాదిలో ఈ పండుగ చేసుకోవడం తక్కువ.

భాయ్ దూజ్, భాయి టీకా
ఈ పండుగను భాయ్ దూజ్, భాయి టీకా, భాయ్ తిహార్ వంటి పేర్లతో పిలుస్తారు. ఈ పండుగ రోజు సోదరులంతా వాళ్ల సోదరీమణుల ఇళ్లకు చేరుకుని వారి నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అలా చేస్తే తమ సోదరుడికి అకాల మరణం రాదని, సంతోషంగా ఉంటాడని నమ్మకం. అలాగే సోదరీమణుల చేతి వంటను సంతృప్తిగా తిని వారు చల్లగా ఉండాలని కోరుకుంటారు సోదరులంతా. సోదరులు, సోదరీమణులను దగ్గరకు చేర్చే ఈ సంప్రదాయం నిజంగా చాలా మంచిదే. ఈ పండుగను తీసుకొచ్చిన యముడ్ని కొందరు ఈ రోజు పూజిస్తారు.



Click it and Unblock the Notifications