Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
చేతికి కట్టుకునే నల్లదారంలో శక్తి ఎన్ని రోజులు వుంటుందో తెలుసా..?
పూజలో కొన్ని నియమాలు వుంటాయ్. వాటిని ఎలా పాటించాలో అదే పద్ధతిలో పాటించాలి. మనకు నచ్చిన విధంగా పూజచేయడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు. ప్రతీ దానికి ఒక నియమం ఉన్నట్టే, పూజా విధానానికి కూడా ఒక నియమం వుంది. ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి లాంటి ప్రశ్నలు కూడా కొందరిని వెంటాడుతూ వుంటాయ్.
పూజలో పాటించాల్సిన నియమాలు
ఇంట్లో గుడిలో వ్రతాలు పూజలు చేసేటప్పుడు చేతికి కంకణాలు, దారాలను కట్టుకుంటాం. ఆ దారానికి మూడు పక్షాలు శక్తి వుంటుందని హిందూ శాస్త్రం చెబుతోంది. 15 రోజులను ఒక పక్షమని అంటారు. నెలలో మనకు 2 పక్షాలు వస్తాయ్. ఒకటి కృష్ణ పక్షము, రెండవది శుక్ల పక్షము. అమావాస్య నుంచి పూర్ణమ రోజు వచ్చే 15 రోజులను శుక్ల పక్షము అని పిలుస్తారు. పౌర్ణమి నుంచి అమావాస్య వచ్చే దాన్ని కృష్ణ పక్షము అని పిలుస్తారు. 45 రోజుల తరువాత ఈ దారానికి శక్తి వుండదు. తరువాత ఆ దారాన్ని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పారవేయాలి. లేదంటే ఏదైనా చెట్టుపైన వేసేయాలి.

దృష్టి తగలకుండా స్త్రీలు, పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు. పురుషులు కుడి కాలికి, ఆడవాళ్లు ఎడమ కాలికి కుంటారు. అమావాస్య నుంచి అమావాస్యకు ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇంట్లో పూర్వీకులు తెచ్చిపెట్టిన వెండివిగ్రహాలను అమ్మేసి వేరే విగ్రహాలను తెచ్చుకోవద్దు. ఎందుకంటే అది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి. ఆ విగ్రహానికి సంబంధించి చేయి విరగడం, పాడవడం లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు దాన్ని షాపులో ఇచ్చి వేరే విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు.
పూజ చేసేటప్పుడు ఎన్ని అగరబత్తీలు వెలిగించాలనే ప్రశ్న మనకు పూజ చేసే సమయంలో చాలా సార్లు వచ్చి వుంటుంది. అగరబత్తీ అంటే ధూపం. ధూపాన్ని ఎంత వెలిగించాలనే విషయాన్ని శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. అగరబత్తీలు వెలిగిస్తే రెండు వెలిగించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఒక వేల ధూప్ స్టిక్ అయితే ఒకటి వెలిగించమని చెబుతున్నారు. కెమికల్స్తో తయారు చేసిన అగరబత్తీలను పూజలో వాడవద్దు. వాటిని పీల్చడం వల్ల చాలా అనారోగ్యాలకు గురౌతాము. తిరుపతి, ఇస్కాన్ టెంపుల్ పరిసరాల్లో కెమికల్స్ లేని అగరబత్తీలను అమ్ముతుంటారు. వాటిని తెచ్చుకొని వెలిగించడం చాలా ఉత్తమం.

ఉదయం రెండు అగరబత్తీలు, సాయంత్రం రెండు అగరబత్తీలు వెలిగించుకోవచ్చు. సాయంత్ర సమయంలో పూజ చేసేటప్పుడు గంట మోగించవచ్చా లేదా అనే ప్రశ్న కూడా కొంతమందికి వస్తుంది. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. సాయత్రం పూజ చేసేటప్పుడు కచ్ఛితంగా గంట మోగించవచ్చు. సాయంత్రం లక్ష్మీ దేవీ ఇంటికి వచ్చే సమయం.గంట వాయించినప్పుడు దేవతలు అక్కడికి వస్తారని శాస్త్రంలో వుంది. దుష్ట శక్తులు ఇంటి ముందు వుంటే ఈ గంట శబ్దం విని పారిపోతయ్.
సాయంత్రం పూజలో శంఖానాదాన్ని కూడా చేయవచ్చు. లక్ష్మీ దేవికి శంఖానాదమంటే చాలా ఇష్టమని పండితులు చెబుతున్నారు. ఏ ఇంట్లో అయితే శంఖానాదం చేస్తారో, ఆ ఇంట్లో లక్ష్మీ దేవీ స్థిర నివాసం వుంటుంది. పూజ మధ్యలో గంట మోగించవచ్చు కానీ పూజ మొత్తం పూర్తయిన తరువాత గంట మోగించవద్దని శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications