Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
శివుడి పుట్టుక ఒక్కో పురాణంలో ఒక్కోలా ఉంది.. అసలెలా పుట్టాడు ఆ మహాదేవుడు..?
శివుడి పుట్టుకపై ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతున్నాయ్. ఈ విశ్వం ఆది అంతం తెలిసిన శివుడు అసలు ఎలా పుట్టాడు. శివుడికి తల్లిదండ్రి లేరంటారు. మరి ఆయన ఎలా జన్మించారు. జగత్తుకు మొత్తం తండ్రిగా భావించే శివుడికి తండ్రి ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు శివుడి పుట్టకపై వస్తున్నాయ్. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడిని స్వయంభువు అని అంటారు. స్వయంభు అంటే తనంతట తానే పుట్టినవాడు. ఇది కాకుండా శివుడి పుట్టుకపై శివ పురాణంలో ఒకలా, విష్ణు పురాణంలో మరోలా వుంది. శివ పురాణంలో శివుడి కాళ్లు మర్ధన చేసుకుంటుంటే ఆ మురికి నుంచి విష్ణువు పుట్టాడని ఉంది. ఇక విష్ణువు పురాణంలో విష్ణువు నుదుటన కిరణాల నుంచి శివుడు పుట్టాడని ఉంది. ఇలా ఈ రెండు పురాణాల్లోనే వైరుద్యం కనిపిస్తోంది. ఏది పరిగణనలోకి తెలుసుకోవాలో పండితుల మధ్యే పెద్ద చర్చ జరుగుతోంది.
పై రెండూ కథలు కాకుండా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. విష్ణువు, బ్రహ్మ మద్య ఎవరు గొప్ప అని తీవ్ర చర్చ జరుగుతుండగా వారి మధ్యలో ఒక పెద్ద కాంతి స్థంభం ఏర్పడింది. ఆ కాంతి స్థంభం అంతం ఆది తెలుసుకున్నవారే గొప్పవారు అని ఇద్దరు అనుకొని దాని గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈ ప్రయత్నంలో ఇద్దరూ విఫలం చెందుతారు. ఆ స్థంభం నుంచి శివుడు ప్రత్యక్షం కావడంతో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ నిర్దారణకు వస్తారు.
శ్రీ మహాదేవీ పురాణంలో శివుడి పుట్టక గురించి మరోలా ఉంది. ఒక సందర్భంలో నారదుడు బ్రహ్మదేవుడిని.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి తల్లిదండ్రి ఎవరు అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ...దుర్గాదేవి, శివస్వరూపుడు బ్రహ్మ ద్వారా ముగ్గురి పుట్టుక జరిగిందని అంటాడు. శివుడు, దుర్గాదేవే ముగ్గురికీ తల్లీదండ్రీ అని అంటాడు.
శివుడు తనకున్న జ్ఞానన్ని 7గురు రుషులకు మాత్రమే చెబుతాడు. ఆ ఏడు రుషులే మనము సప్త రుషులుగా భావిస్తాం. లోకానికి చెందిన ఎన్నో రహస్యాలను, వేదాలను, ఆయుర్వేదం, పురుణాల్లో చెప్పిన బడిన శాస్త్రాలు ఇలా చాలా విషయాలు ఈ సప్త రుషుల ద్వారానే తెలిసాయని పండితుల చెబుతున్నారు.



Click it and Unblock the Notifications