Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
శివుడి పుట్టుక ఒక్కో పురాణంలో ఒక్కోలా ఉంది.. అసలెలా పుట్టాడు ఆ మహాదేవుడు..?
శివుడి పుట్టుకపై ఇప్పటికీ చాలా చర్చలు జరుగుతున్నాయ్. ఈ విశ్వం ఆది అంతం తెలిసిన శివుడు అసలు ఎలా పుట్టాడు. శివుడికి తల్లిదండ్రి లేరంటారు. మరి ఆయన ఎలా జన్మించారు. జగత్తుకు మొత్తం తండ్రిగా భావించే శివుడికి తండ్రి ఎవరు ? ఇలా ఎన్నో ప్రశ్నలు శివుడి పుట్టకపై వస్తున్నాయ్. ఆ విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివుడిని స్వయంభువు అని అంటారు. స్వయంభు అంటే తనంతట తానే పుట్టినవాడు. ఇది కాకుండా శివుడి పుట్టుకపై శివ పురాణంలో ఒకలా, విష్ణు పురాణంలో మరోలా వుంది. శివ పురాణంలో శివుడి కాళ్లు మర్ధన చేసుకుంటుంటే ఆ మురికి నుంచి విష్ణువు పుట్టాడని ఉంది. ఇక విష్ణువు పురాణంలో విష్ణువు నుదుటన కిరణాల నుంచి శివుడు పుట్టాడని ఉంది. ఇలా ఈ రెండు పురాణాల్లోనే వైరుద్యం కనిపిస్తోంది. ఏది పరిగణనలోకి తెలుసుకోవాలో పండితుల మధ్యే పెద్ద చర్చ జరుగుతోంది.
పై రెండూ కథలు కాకుండా మరో కథ ప్రాచుర్యంలో ఉంది. విష్ణువు, బ్రహ్మ మద్య ఎవరు గొప్ప అని తీవ్ర చర్చ జరుగుతుండగా వారి మధ్యలో ఒక పెద్ద కాంతి స్థంభం ఏర్పడింది. ఆ కాంతి స్థంభం అంతం ఆది తెలుసుకున్నవారే గొప్పవారు అని ఇద్దరు అనుకొని దాని గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఈ ప్రయత్నంలో ఇద్దరూ విఫలం చెందుతారు. ఆ స్థంభం నుంచి శివుడు ప్రత్యక్షం కావడంతో శివుడే గొప్ప అని విష్ణువు, బ్రహ్మ నిర్దారణకు వస్తారు.
శ్రీ మహాదేవీ పురాణంలో శివుడి పుట్టక గురించి మరోలా ఉంది. ఒక సందర్భంలో నారదుడు బ్రహ్మదేవుడిని.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి తల్లిదండ్రి ఎవరు అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు సమాధానం చెప్తూ...దుర్గాదేవి, శివస్వరూపుడు బ్రహ్మ ద్వారా ముగ్గురి పుట్టుక జరిగిందని అంటాడు. శివుడు, దుర్గాదేవే ముగ్గురికీ తల్లీదండ్రీ అని అంటాడు.
శివుడు తనకున్న జ్ఞానన్ని 7గురు రుషులకు మాత్రమే చెబుతాడు. ఆ ఏడు రుషులే మనము సప్త రుషులుగా భావిస్తాం. లోకానికి చెందిన ఎన్నో రహస్యాలను, వేదాలను, ఆయుర్వేదం, పురుణాల్లో చెప్పిన బడిన శాస్త్రాలు ఇలా చాలా విషయాలు ఈ సప్త రుషుల ద్వారానే తెలిసాయని పండితుల చెబుతున్నారు.



Click it and Unblock the Notifications