Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
Diwali 2024: దీపావళి రోజు ఆ దేవుళ్లను పూజిస్తే.. వారికి అదృష్టం తలుపుతట్టినట్లే!
దీపావళి రోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం సాధారణమే. అయితే పలు రాశుల వారు లక్ష్మీదేవితో పాటు మరికొన్ని దేవుళ్లను పూజిస్తే కచ్చితంగా కార్యసిద్ధి, కోరికలు నెరవేరడం, అనుకున్న కార్యక్రమాలు పూర్తవడం, డబ్బులు రావడం, అదృష్ట యోగం పట్టనుందట. అయితే ఎలాంటి రాశుల వారు ఏ దేవుడిని పూజించాలి, ఎలాంటి పరిహారం చెల్లించాలి అనేది ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ రాశి వారు ఏ దేవుడిని పూజించాలంటే..
మేషం, వృశ్చికం: ఈ రెండు రాశుల వారికి అధిపతిగా కుజుడు ఉన్నాడు. దీని కారణంగా ఈ రెండు రాశుల వారు దీపావళి తరువాత భాగ్యవంతులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే వీరు భాగ్యవంతులు కావాలంటే దీపావళి రోజు లక్ష్మీదేవితో పాటు సుభ్రమణ్యస్వామిని కూడా పూజించాలి. దీని కారణంగా లక్ష్మీదేవితో పాటు సుబ్రమణ్యస్వామి ఆశీస్సులు కూడా ఈ రాశుల వారిపై ఉండనున్నాయి.

ఈ విధమైన పూజలు చేస్తే ఈ రెండు రాశుల వారికి ఆర్ధిక లాభం కలగనుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. చేపట్టిన ఏ పని అయినా విజయవంతమవుతుంది. మనసులోని కోరికలు నెరవేరడంతో పాటు సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరగడంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది.
వృషభం, తుల: ఈ రెండు రాశుల వారికి శుక్రుడు అధిపతిగా ఉన్నారు. దీని కారణంగా ఈ రాశుల వారు దీపావళి రోజున దుర్గాదేవిని పూజించాలి. దుర్గాదేవిని పూజించడం వల్ల వారి జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయి. ధైర్యం చేకూరుతుంది. ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన లాభాలను గడిస్తారు. ఉద్యోగాల్లో జీతం పెరిగే ఛాన్సుంది.
అలాగే ప్రమోషన్స్ లభించడం, విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడం వంటివి జరగనున్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి అదృష్టయోగం పట్టనుంది. పోటీదారులు, శత్రువులపై విజయం సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగి, అభివృద్ధి దిశగా ప్రయాణం సాగిస్తారు.
మిథునం, కన్య: ఈ రెండు రాశుల వారి జీవితాలు దీపావళి తరువాత అద్భుతంగా తయారవనున్నాయి. ఈ రెండు రాశులకు బుధుడు అధిపతిగా ఉండడంతో.. ఈ రాశుల వారు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించాలి. దీని కారణంగా ఈ రాశుల వారి చేపట్టే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా అవి తొలిగిపోయి, పనులు విజయవంతమవుతుంది.
అధిక ఆదాయ ప్రయత్నాలు పెరగడంతో పాటు, పెళ్లిళ్లు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయవంతమవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగంతో పాటు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుటపడడంతో పాటు ఉన్నత కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.
ధనుస్సు, మీనం: ఈ రెండు రాశుల వారికి ఈ సంవత్సరమంతా అనుకూలంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండు రాశుల వారికి గురుడు అధిపతిగా ఉండడం వల్ల ఈ రాశి వారు దీపావళి రోజున లక్ష్మీ దేవితో పాటు నరసింహస్వామిని లేదా దత్తాత్రేయ స్వామిని పూజించాలి. దీని వల్ల ముఖ్యమైన పనులు పూర్తవడంతో పాటు మనసులో ఎప్పటి నుంచో అలానే ఉండిపోయిన కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక సమస్యలన్నీ తొలిగిపోతాయి.
నిరుద్యోగులకు అద్భుతమైన, అరుదైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పెళ్లిళ్లు కుదరడంతో పాటు వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో అద్భుతమైన లాభాలను గడించే అవకాశముంది. అలాగే ఆకస్మిక ధనలాభం పొందే ఛాన్సుంది.



Click it and Unblock the Notifications











