For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మాండూక మందిరం దర్శిస్తే ఒక్క సంతామనం మాత్రమే కాదు, సంపందలు కూడా పొందుతారు..

|

హిందూ పురాణాలలో జంతువులకి ప్రత్యేక స్థానం ఉంది మరియు ఉత్తరప్రదేశ్ లో ఈ ఆలయం లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఉంది. ఇక్కడ ఒక కప్పను దీపావళి మరియు ఇతర సందర్భాలలో ఎంతో శ్రద్ధగా పూజిస్తారు. ఇక్కడ నమ్మకం ఏంటంటే ఒక కప్ప రాజపుత్ రాజు భక్త్ సింగ్ జీవితాన్నే మార్చేసిందని.

భారతదేశంలో ఏకైక కప్ప ఆలయం ఇది మరియు ఇక్కడ దేవుడైన కప్ప రాజుని అన్ని సంపదలు, ఆరోగ్యకరమైన పిల్లలతో వరాలిచ్చి అతని జీవితం మార్చేసాడు.

<strong>ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు, మనుషులు శిలలుగా మారుతారు!</strong>ఆ దేవాలయంలో ఒక రాత్రి ఉంటే చాలు, మనుషులు శిలలుగా మారుతారు!

మండూక్ మందిర్ అని పిలవబడే ఈ గుడిలోని గర్భగుడి తంత్ర విద్య ప్రకారం కప్ప విగ్రహం వెనక ఉన్న యంత్రంపైన కట్టబడి ఉంది.స్థానికులు ఈ 200ఏళ్ల క్రితం గుడిని దర్శిస్తే చాలు అన్ని సమృద్ధులు కలుగుతాయని భావిస్తారు. మహాశివరాత్రి మరియు శ్రావణసోమవారాలతో పాటు దీపావళి కూడా ఇక్కడ ప్రముఖంగా జరుపుకుంటారు.

Manduk Mandir

నీమ్రాన వంశానికి చెందిన రాజా హర్దేవ్ సింగ్ కొడుకైన రాజా భక్త్ సింగ్ తర్వాత ఏడో తరానికి చెందిన ప్రద్యుమ్న్ నారాయణ్ దత్తాసింగ్ మాట్లాడుతూ,” ఈ ఆలయం తన నిర్మాణం,ఆత్మ ప్రకారం తంత్రంపై ఆధారపడి మంచి అదృష్టాలను తెస్తుంది.
Manduk Mandir

తరతరాలుగా మేము దీని దీవెనల వలన హాయిగా జీవిస్తున్నాం.’ అని అన్నారు.

“కప్ప సంతానసాఫల్యానికి గుర్తు. అందుకని ప్రజలు ఈ గుడిని దర్శించాక సంతానాన్ని, మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కప్పలు సంపదలను కూడా తెస్తాయి.”అని జతచేసారు.

Manduk Mandir

ఈ ప్రత్యేక కప్ప గుడి ఓయెల్ పట్టణం, లఖీంపూర్ నుంచి సీతాపూర్ కి వెళ్ళే దారిలో లఖింపూర్ నుండి 11 కిమీల దూరంలో ఉంది. భారతదేశంలో మండూక తంత్రం ప్రకారం వెలిసిన ఏకైక ఆలయం ఇది.ఓయెల్ రాజ్య (లఖీంపూర్ ఖేరి జిల్లా) పూర్వ మహారాజు 1860 నుంచి 1870 మధ్య దీన్ని నిర్మించాడు. ఇది పరమశివునికి అంకితం చేసారు.

ఈ ఆలయాన్ని పెద్ద కప్ప విగ్రహం వెనకగా కట్టారు. అష్టాదళపద్మంలో మొత్తం ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని బానాసుర్ నర్మదేశ్వర్ నర్మదాకుండ్ దగ్గర నుంచి తెచ్చారు.ఆలయం ప్రధాన గేటు తూర్పున ఉంటుంది మరియు మరో గేటు దక్షిణంలో ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం తంత్రవిద్య ఆధారంగా జరిగింది.

Manduk Mandir

తాంత్రిక సంప్రదాయం అంటే ఏమిటి?

ప్రాచీన భారతదేశానికి చెందిన తాంత్రిక సంప్రదాయం హిందూ మరియు బౌద్ధమతాలపై పెద్ద ప్రభావం చూపింది.వేదకాలం ముందు సమయానికి చెందిన ఈ సంప్రదాయం స్త్రీశక్తికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది( అమ్మవార్లకి అధిక ప్రాముఖ్యత ఉండేది). శక్తి(దేవి), ముఖ్యంగా కోపిష్టి రూపంలో ఈ సంప్రదాయంలో ఎక్కువ పూజించబడేవారు. అనేక ఆచారాలు కూడా దీనికోసం ఏర్పడ్డాయి. మండూక మందిరం లేదా కప్ప గుడి కూడా ఇదే తాంత్రిక సంప్రదాయాన్ని పాటిస్తుంది.

<strong>పద్మనాభస్వామి ఆలయంలోని చివరి గది వెనుక దాగి ఉన్న అసలు రహస్యం</strong>పద్మనాభస్వామి ఆలయంలోని చివరి గది వెనుక దాగి ఉన్న అసలు రహస్యం

Manduk Mandir

ఈ గుడికి ఎవరు వెళ్తారు?

సందేహమే లేదు, మండూక మందిరం భారతదేశంలో ప్రత్యేకమైన గుడి. కానీ మతపరంగా కూడా ఇది ప్రసిద్ధి చెందినది. కప్ప అదృష్టానికి, సంతానోత్పత్తికి సంకేతం. ఇక్కడికి వచ్చే జంటలకి ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు.చుట్టుపక్కల ఊళ్ళ నుంచి భక్తులు చాలామంది ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. నర్మదేశ్వర్ ఆలయం శివరాత్రి, దీపావళి పండగల సమయంలో ఎక్కువ రష్ గా ఉంటుంది. అసాధారణ నిర్మాణంతో ఉన్న ఈ కప్ప ఆలయం, ఉత్తరప్రదేశ్ లో ప్రాచీన ఆలయాలలో ఒకటిగా ఉంది.ఈ గుడి చుట్టూ ఉన్న ధార్మికత,అద్భుతమైన నిర్మాణం యాత్రికులను అబ్బురపరుస్తుంది.

ఈ ప్రాంతాన్ని అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో మంచి వాతావరణంలో దర్శించుకోవచ్చు. లక్నోకి వెళ్ళి అక్కడనుండి రైలులో వెళ్ళవచ్చు. లక్నో నుంచి లఖీంపూర్ 135 కిమీల దూరంలో ఉంది. ఢిల్లీ నుండి ఖేరికి 425 కిమీల దూరం ఉంది.

All Images Credit

English summary

Manduk Mandir: India's only frog temple

Manduk Mandir: India's only frog temple. Read to know more about it..
Desktop Bottom Promotion