Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
Navratri:రాహు కేతువులతో ఉల్లి-వెల్లుల్లి సంబంధం ఏంటి?నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు?
Navratri: ప్రస్తుతం శారదీయ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు 15 అక్టోబర్ 2023 నుండి అక్టోబర్ 23 వరకు నిర్వహించబడుతాయి, ఆపై ఈ పండుగ అక్టోబర్ 24 న విజయదశమితో ముగుస్తుంది.
ఈ సమయంలో, దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. భక్తులు వ్రతం పాటిస్తారు మరియు ఉపవాసం ఉంటారు. పండ్లు పానీయాలతో ఉపవాస ధీక్షలు చేస్తారు. ధర్మబద్ధమైన జీవనశైలిని అవలంబిస్తారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 9 రోజులలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినకూడదు అనే నియమం కూడా ఉంది. పురాణాల ప్రకారం వెల్లుల్లి, ఉల్లిపాయలు రాహువు మరియు కేతువులకు సంబంధించినవని మీకు తెలుసా? తెలియదు అన్నట్టైతే వెంటనే ఈ కథను మీరు తెలుసుకోవాలి.

రాహుకేతువుతో వెల్లుల్లి మరియు ఉల్లిపాయల సంబంధాన్ని తెలుసుకోండి
సముద్ర మంథనం సమయంలో ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు ఉండేవారు. ఇద్దరూ కలిసి సముద్రాన్ని మథనం చేశారు. ఈ సమయంలో అమృతపాత్ర బయటకు వచ్చింది. ఎవరైతే ఈ అమృతాన్ని సేవిస్తారో వారు అమరులవుతారు. ఆ అమృతాన్ని రాక్షసులు తాగితే చాలా కీడు జరుగుతుందని విష్ణువు అనుకున్నాడు. అందుకే మోహినీ రూపాన్ని ధరించి దేవతలందరికీ అమృతాన్ని ఇవ్వడం ప్రారంభించింది మరియు రాక్షసులకు ఇవ్వలేదు.
కానీ ఒక రాక్షసుడు విషయం అర్థం చేసుకుని, చాకచక్యంగా ఉపాయంతో వెళ్లి దేవతల వరుసలో కూర్చున్నాడు. అమృతాన్ని సేవించిన వెంటనే విష్ణువుకు విషయం తెలియడంతో వెంటనే సుదర్శనంతో రెండు ముక్కలుగా చేశాడు. ఈ ముక్కలు రాహువు మరియు కేతువు. ఇవి చిరంజీవులు మరియు నేటికీ అవి జాతకంలో స్తితి చెంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

విష్ణువు వాటిని ముక్కలు చేయగా, రెండు రక్తపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ రెండు చుక్కలు వెల్లుల్లి మరియు ఉల్లిపాయల రూపంలో పెరిగాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రతీకార కోరికలు పెరుగుతాయి. కామం యొక్క ధోరణి కూడా పెరుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది మరియు వ్యక్తి హింసాత్మకంగా మారడం ప్రారంభిస్తాడు. కావున నవరాత్రులలో మాత్రమే కాకుండా ఏ ఉపవాస సమయంలోనూ వెల్లుల్లి, ఉల్లి తీసుకోవడం నిషేధించబడింది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన ఏ ఇన్పుట్ లేదా సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు అంచనాలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణుల సలహాను పొందండి.



Click it and Unblock the Notifications