Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
Navratri:రాహు కేతువులతో ఉల్లి-వెల్లుల్లి సంబంధం ఏంటి?నవరాత్రులలో ఉల్లి వెల్లుల్లి ఎందుకు తినకూడదు?
Navratri: ప్రస్తుతం శారదీయ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ నవరాత్రులు 15 అక్టోబర్ 2023 నుండి అక్టోబర్ 23 వరకు నిర్వహించబడుతాయి, ఆపై ఈ పండుగ అక్టోబర్ 24 న విజయదశమితో ముగుస్తుంది.
ఈ సమయంలో, దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజిస్తారు. భక్తులు వ్రతం పాటిస్తారు మరియు ఉపవాసం ఉంటారు. పండ్లు పానీయాలతో ఉపవాస ధీక్షలు చేస్తారు. ధర్మబద్ధమైన జీవనశైలిని అవలంబిస్తారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 9 రోజులలో ఉల్లిపాయలు మరియు వెల్లుల్లి తినకూడదు అనే నియమం కూడా ఉంది. పురాణాల ప్రకారం వెల్లుల్లి, ఉల్లిపాయలు రాహువు మరియు కేతువులకు సంబంధించినవని మీకు తెలుసా? తెలియదు అన్నట్టైతే వెంటనే ఈ కథను మీరు తెలుసుకోవాలి.

రాహుకేతువుతో వెల్లుల్లి మరియు ఉల్లిపాయల సంబంధాన్ని తెలుసుకోండి
సముద్ర మంథనం సమయంలో ఒకవైపు దేవతలు, మరోవైపు రాక్షసులు ఉండేవారు. ఇద్దరూ కలిసి సముద్రాన్ని మథనం చేశారు. ఈ సమయంలో అమృతపాత్ర బయటకు వచ్చింది. ఎవరైతే ఈ అమృతాన్ని సేవిస్తారో వారు అమరులవుతారు. ఆ అమృతాన్ని రాక్షసులు తాగితే చాలా కీడు జరుగుతుందని విష్ణువు అనుకున్నాడు. అందుకే మోహినీ రూపాన్ని ధరించి దేవతలందరికీ అమృతాన్ని ఇవ్వడం ప్రారంభించింది మరియు రాక్షసులకు ఇవ్వలేదు.
కానీ ఒక రాక్షసుడు విషయం అర్థం చేసుకుని, చాకచక్యంగా ఉపాయంతో వెళ్లి దేవతల వరుసలో కూర్చున్నాడు. అమృతాన్ని సేవించిన వెంటనే విష్ణువుకు విషయం తెలియడంతో వెంటనే సుదర్శనంతో రెండు ముక్కలుగా చేశాడు. ఈ ముక్కలు రాహువు మరియు కేతువు. ఇవి చిరంజీవులు మరియు నేటికీ అవి జాతకంలో స్తితి చెంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

విష్ణువు వాటిని ముక్కలు చేయగా, రెండు రక్తపు చుక్కలు భూమిపై పడ్డాయి. ఈ రెండు చుక్కలు వెల్లుల్లి మరియు ఉల్లిపాయల రూపంలో పెరిగాయి. వీటిని తీసుకోవడం వల్ల ప్రతీకార కోరికలు పెరుగుతాయి. కామం యొక్క ధోరణి కూడా పెరుగుతుంది. ఏకాగ్రత తగ్గుతుంది మరియు వ్యక్తి హింసాత్మకంగా మారడం ప్రారంభిస్తాడు. కావున నవరాత్రులలో మాత్రమే కాకుండా ఏ ఉపవాస సమయంలోనూ వెల్లుల్లి, ఉల్లి తీసుకోవడం నిషేధించబడింది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన ఏ ఇన్పుట్ లేదా సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు అంచనాలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణుల సలహాను పొందండి.



Click it and Unblock the Notifications