Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
అయోధ్య vs కాశీ..ఏ ఆలయ పూజారికి ఎక్కువ జీతం వస్తుందో తెలుసా?
కోట్లాది మంది హిందువులు దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో భవ్యమైన,దివ్యమైన రామమందిరం నిర్మించడింది. 2024లో అయోధ్య రామాలయాన్ని భక్తుల దర్శనం కోసం ప్రారంభించబడింది. ఆలయ ప్రధాన పూజారిగా ఆచార్య సత్యేంద్ర దాస్ నియమించబడ్డారు. అయితే ఇటీవల సత్యేంద్ర దాస్ కన్నుమూశారు. 85 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఫిబ్రవరి 12,2025న లక్నోలోని ఓ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. సత్యేంద్ర దాస్ మరణం తర్వాత అయోధ్య ఆలయ ప్రధాన పూజారిగా పండిట్ మోహిత్ పాండే నియమితులయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సీతాపూర్ జిల్లాకు చెందిన మోహిత్ పాండే..ప్రస్తుతం అయోధ్య రాముడికి నిత్య పూజల దగ్గర నుంచి ఆలయ సంప్రదాయాల వ్యవహారాలు అన్నింటిని చూసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 3వేలమందికి పైగా ప్రధాన పూజారి పోస్ట్ కి పోటీ పడగా..ఇంటర్వ్యూలు,కఠినమైన ప్రక్రియ తర్వాత మోహిత్ పాండే అయోధ్య ఆలయ ప్రధాన పూజారిగా ఎంపికయ్యారు. 2024 జనవరిలో జరిగిన రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న 29 మంది పూజారులలో మోహిత్ పాండే ఒకరు.

అయితే చాలామంది మదిలో మెదిలో సాధారణ ప్రశ్నలు ఏంటంటే అసలు అయోధ్య రామ మందిర ప్రధాన పూజారికి ఎంత జీతం వస్తుంది? సహాయ అర్చకులకు ఎంత జీతం వస్తుంది? జీతంతో పాటు ప్రభుత్వం వారికి ఇంకేం సౌకర్యాలు కల్పిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు చూద్దాం.
అయోధ్య రామాలయంలో అర్చకుల జీతాలు ఎలా ఉంటాయి
మీడియా కథనాల ప్రకారం అయోధ్య రామాలయం ప్రధాన అర్చకుడైన పండిట్ మోహిత్ పాండే నెలకు రూ.32,900 జీతంగా అందుకుంటున్నారు. సహాయ అర్చకులకు నెలకు రూ.31,000 జీతం వస్తుంది. గతంలో ఈ జీతాలు కాస్త తక్కువగా ఉండేవని సమాచారం. ప్రధాన అర్చకులకు గతంలో రూ. 25,000, సహాయ అర్చకులకు రూ. 20,000 మాత్రమే ఇచ్చేవారంట.
జీతంతో పాటు ఇంకేం ఇస్తారు
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి పండిట్ మోహిత్ పాండేకు కేవలం జీతం మాత్రమే కాకుండా ఇతర మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, బస, ప్రయాణ ఖర్చులు, ఇంకా ఆయా కార్యక్రమాలకు అవసరమైన ప్రత్యేక సౌకర్యాలను కూడా ఆలయ ట్రస్ట్ అందిస్తుంది.
ప్రధాన అర్చకుడి అర్హతలేంటో తెలుసా?
సంస్కృత భాషపై మంచి పట్టు కలిగి ఉన్న మోహిత్ పాండే.. దూధేశ్వర్ వేద విద్యాలయంలో పూజారి పదవికి అవసరమైన వేద విద్యను అభ్యసించారు. సామవేదంలో వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి ఆచార్య పట్టా పొందారు. చాలా సంవత్సరాల పాటు మతం, సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు.
కాశీ ఆలయంలో ప్రధాన అర్చకుడి జీతం ఎంత
మనదేశంలో ఎన్నో దాడులకు గురై కూడా తట్టుకొన నిలబడ్డ ఆలయాల్లో కాశీ విశ్వనాథ ఆలయం ఒకటి. ఎంతమంది ఎన్నిసార్లు ఈ ఆలయంపై దాడి చేసినా కూడా ఆ ప్రయత్నాలు చేసినవాళ్లు కనుమరుగైపోయారు తప్ప ఆలయాన్ని ఏం చేయలేకపోయారు. శివుడు స్వయంగా వెలసిన కాశీ క్షేత్రాన్ని 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ధర్మకర్తల మండలి నిర్వహిస్తోంది. విశ్వనాథ ఆలయంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసే శ్రీకాంత్ మిశ్రాకి నెలకు రూ.90,000 జీతంగా అందుకుంటారు. కాశీ విశ్వనాథ ఆలయంలో జూనియర్ అర్చకులకు నెలకు రూ.80000 జీతం..సహాయ అర్చకులు నెలకు రూ.65,000 జీతం అందుకుంటున్నారు.



Click it and Unblock the Notifications