Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
శ్రావణ శివరాత్రి: మీరు తెలుసుకోవాల్సినవి
శ్రావణ శివరాత్రి ః మీరు తెలుసుకోవాల్సినవి
హిందువులు చాలా ఉత్సాహంగా జరుపుకునే పండగల్లో శ్రావణమాసంలో వచ్చే పరమశివుని శివరాత్రి మరింత పవిత్రమైనది. శ్రావణంలో వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. ఈ శివరాత్రి ఉపవాసం చేసినవారికి పరమశివుడు అన్ని కోరికలూ నెరవేరుస్తాడని అంటారు.
శివరాత్రి పూజ లాభాలు
పెళ్ళికాని అమ్మాయిలు కోరుకున్న భర్త కోసం ఉపవాసం చేస్తే, పెళ్ళైన యువతులు తమ భర్తల దీర్ఘాయువు కోసం ఉపవాసం చేస్తారు. మగవారు తమ కుటుంబంలో సుఖశాంతుల కోసం ఉపవాసం చేస్తారు. అదేకాక వారు ఇలా చేయటం వలన కెరీర్ లో కూడా మంచి ప్రగతి ఉంటుందని అంటారు. మన పురాణాలలో శ్రావణమాసానికి, అందులో వచ్చే శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగానది నీళ్ళను శివలింగానికి అభిషేకం చేయటం వలన భక్తులకి అదృష్టం కలిసొస్తుంది.

శివరాత్రి కోసం కన్వర్ యాత్ర
శివరాత్రి రోజు ముందు గంగానది నీళ్ళకోసం ప్రజలు హరిద్వార్ కి యాత్రగా వెళ్తారు. అది 3-4 రోజుల యాత్రగా ఉంటుంది, భక్తులు శివరాత్రి రోజున నేరుగా శివాలయాలకి తిరిగొస్తారు. పరమశివుడికి ఆ నీటితో అభిషేకం చేసేవరకు ఇంటికి తిరిగెళ్ళరు. ఈ తీర్థయాత్రని కన్వర్ యాత్ర అంట్తారు. ఇలా చేస్తే శివుడు తన భక్తుల పాపాలన్నిటినీ క్షమిస్తాడని నమ్ముతారు. ఇదే కాదు, ఈరోజు పూజ చేయటం వలన కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది.
కాలసర్ప దోషం కోసం
కాలసర్ప దోషం తొలగిపోవటానికి భక్తులు శివుడికి షోడశోపచార పూజ చేయాల్సి వుంటుంది. శివలింగానికి ఉమ్మెత్త పూలతో పూజచేసి, శివుడి నామాలను 108సార్లు పఠించాలి. షోడశోపచారాలంటే పూజను 16 స్టెప్స్ లో చేయటం. మీరు జంటసర్పాల బొమ్మలను కూడా శివలింగం ముందు సమర్పించవచ్చు.
మంచి ఆరోగ్యం కోసం
ఆరోగ్య సమస్యలు,ప్రమాదాలు తొలగిపోవటానికి మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపించవచ్చు.
కుటుంబ తగాదాలు తొలగిపోవటానికి పంచముఖి రుద్రాక్షను తీసుకొని ఓం నమఃశివాయ మంత్రాన్ని శివుడి ముందు జపించండి. అది మీ కుటుంబంలో అపార్థాలు,తగాదాలు తొలగించి వేస్తుంది. అన్నిరకాల రుద్రాక్షలలో, పంచముఖి రుద్రాక్ష ఎక్కువ విశిష్టత ఉంటుంది. ఈ రుద్రాక్ష వేసుకున్నవారి అన్ని పాపాలను తొలగించేస్తుంది.
ఎందుకంటే రుద్రాక్షని గ్రహం నియంత్రిస్తుందని విశ్వాసం, అలాగే ఈ రుద్రాక్ష కూడా బృహస్పతికి ప్రతిరూపమని నమ్ముతారు. ఆయన గురు గ్రహానికి అధినేత, దేవతలకి గురువు. పంచముఖి రుద్రాక్షని పరమశివుడే తన కాలాగ్ని రుద్ర రూపంలో దీవించాడని అంటారు. ఈ రుద్రాక్షని పట్టుకుని మంత్రం జపించటం వలన కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత నెలకొని ఉంటుంది.
ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి
శివరాత్రి నాడు ప్రదోష వ్రతం
శివరాత్రి నాడు ప్రదోషవ్రతం కూడా చేస్తారు. సూర్యాస్తమయం నుండి అర్థరాత్రి 12.00 వరకూ ఉండే సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో శివుడిని,పార్వతి అమ్మవారిని పూజించటానికి పవిత్రమైనది. ప్రదోషకాలం ఆగస్టు 9న సాయంత్రం 7.01 నుండి 9.22 గంటల వరకూ ఉంటుంది. ఇది ప్రతినెలా వస్తుంది కాబట్టి దీన్ని మాస శివరాత్రి అని కూడా అంటారు. ప్రదోషవ్రతం స్త్రీలు తమ కుటుంబ సంక్షేమం కోసం ఆచరిస్తారు.



Click it and Unblock the Notifications