Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
somwati amavasya 2024: సోమవతి అమావాస్య నాడు ఇలా చేస్తే కాలసర్ప దోషం,పిత్ర దోషాల నుండి విముక్తి
సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. అమావాస్య హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది. ఈసారి సోమవతి అమావాస్య డిసెంబర్ 30వ తేదీ సోమవారం జరుపుకుంటాం. సోమవతి అమావాస్య సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం ద్వారా శాశ్వతమైన ఫలితాలను పొందుతారు. కాలసర్ప దోషం,పిత్ర దోషాల నుండి కూడా విముక్తి పొందుతారు. సోమవతి అమావాస్య రోజున పార్వతీ దేవిని,శివుడిని పూజించే సంప్రదాయం ఉంది,రావి చెట్టును కూడా పూజిస్తారు.
సోమవతి అమావాస్య స్నానం
హిందూ క్యాలెండర్ ప్రకారం సోమవతి అమావాస్య తేదీ డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుగుస్తుంది. ఈ రోజున ఉదయం 5.24 గంటల నుండి 6.19 గంటల వరకు స్నానమాచరించి దానం చేయడం శుభప్రదం.

సోమవతి అమావాస్య శుభ యోగం
సంవత్సరంలో చివరి అమావాస్య అంటే సోమవతి అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈసారి సోమవతి అమావాస్య నాడు వృద్ధి యోగం,ధృవ యోగం,శివ్వాస యోగం,నక్షత్ర యోగం కలగబోతున్నాయి.
సోమవతి అమావాస్య పూజ విధి
సోమవతి అమావాస్య రోజున పూజ చేయడానికి ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. ఈ రోజున గంగాస్నానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది..అందుకే గంగా స్నానం చేసి ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున పరమశివుడిని,పార్వతీదేవిని పూజించి పూజానంతరం తమ శక్తి మేరకు దానధర్మాలు చేయడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది.
సోమవతి అమావాస్య కథ
పురాణాల ప్రకారం ఒక రాజ్యంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. డబ్బు లేకపోవడంతో కూతురు పెళ్లి కుదరలేదు. ఒకరోజు తమ పేదరికం కష్టాలను ఓ సాధువుకి చెప్పి బ్రాహ్మణ దంపతులను పరిష్కారం కోసం అడిగారు. దానికి సాధువు సమీపంలోని గ్రామంలో ఒక చాకలి తన కొడుకు, కోడలుతో నివసిస్తున్నారని..మీ కుమార్తె ఆ చాకలికి సేవ చేస్తే అప్పుడు చాకలి సంతోషించిమీ కుమార్తెకు కుంకుమ ఇస్తాడని.. అది అమ్మాయి వివాహాన్ని నిర్ణయిస్తుందని బ్రాహ్మణ దంపతులకు చెప్తాడు. అది విని ఆ అమ్మాయి చాకలి ఇంటికి వెళ్లి అన్ని పనులు చేయడం ప్రారంభించింది. ఆ విషయం చాకలికి అతని కోడలికి తెలియదు. ఒకరోజు తెల్లవారుజామున చాకలి నిద్రలేచి చూసేసరికి ఒక అమ్మాయి నిశ్శబ్దంగా ఇంటి పనులన్నీ చేస్తూ ఉండడం చూసింది. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. ఒకరోజు చాకలి ఆ అమ్మాయిని కారణం అడిగగా.. సాధువు చెప్పినదంతా ఆ అమ్మాయి చాకలికి చెప్పింది. అతని మాట విని చాకలి ఆమె అడిగిన కుంకుమ ఇవ్వగా.. అదే సమయంలో చాకలి భర్త మరణించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకు వెళ్లి రావి చెట్టు దగ్గరకు చేరుకుని 108 ఇటుక ముక్కలను తీసుకుని 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఒక్కొక్కటిగా విసరడం ప్రారంభించింది. అమ్మాయి ఇలా చేయడం వల్ల చాకలి భర్త మళ్లీ బ్రతికాడు. ఆ అమ్మాయి రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందింది.



Click it and Unblock the Notifications