Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Sabarimala devotees: అయ్యప్ప భక్తులకు అలర్ట్..శబరిమల వెళ్లేటప్పుడు ఇలా చేస్తే జైలు శిక్ష
మనదేశంలోని మగతా ప్రాంతాలతో పోలిస్తే ఏపీ,తెలంగాణ,తమిళనాడు, కేరళలోనే అయ్యప్పస్వామి మాలలు(ayyappa mala) వేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అక్టోబర్, నవంబర్ లో ఎక్కువగా అయ్యప్ప దీక్ష చేపడతారు. 41 రోజుల పాటు ఎంతో నియమ నిష్ఠలతో దీక్ష పూర్తి చేసుకొని శబరిమల(sabarimala) వెళ్లి 18 మెట్లు ఎక్కి ఇరుముడి సమర్పిస్తారు. కొంతమంది అక్కడే మాల తీస్తారు..కొందరు అయితే ఇంటికొచ్చిన తర్వాత తీస్తారు. అయితే ప్రస్తుతం శబరిమల ఆలయానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది.
మన తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో శబరిమలకు వెళ్తున్నారు. యాత్రికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కూడా ఏపీ,తెలంగాణ నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు(sabarimala special trains) నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లు వైజాగ్, శ్రీకాకులం రోడ్,సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ,కాకినాడ,తిరుపతి తదితర స్టేషన్ల నుంచి బయలుదేరతాయి.

అయితే రైళ్లల్లో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు(ayyappa devotees) సౌత్ సెంట్రల్ రైల్వే తాజాగా కీలక సూచన చేసింది. అయ్యప్ప భక్తులు రైళ్లల్లో ప్రయాణిస్తున్న సమయంలో పూజా విధానంలో భాగంగా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం, అగరబత్తులు వెలిగించడం వంటివి చేస్తుండటం తమ దృష్టికి వచ్చిందని..అయితే అలా చేయడం పూర్తిగా నిషేధం అని,దీని వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే(south central railway) సూచించింది. రైళ్లలో ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. మండే స్వభావం కలిగిన పదార్థాలు అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయని తద్వారా భారీగా ప్రాణ,ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నాయని తెలిపింది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది.
మరోవైపు, కేరళలో ఇడుక్కి, పథనంథిట్ట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో శబరిమల వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచనలు చేశారు. సాథ్రం నుంచి శబరిమలకు వెళ్లే అటమీ మార్గాన్ని మూసివేస్తున్నట్లు..అలాగే నదిలోకి, స్నానపు ఘాట్ లోకి ప్రవేశాలను నిలిపివేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. వర్షాలు తగ్గే వరకు ఈ రూల్స్ అయల్లో ఉంటాయని తెలిపారు.



Click it and Unblock the Notifications