Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
గంగాజలం ఎందుకంత ప్రాధాన్యత సంతరించుకుంది ?
భారతదేశంలో గంగాజలానికి చాలా ప్రాధాన్యత ఉంది. గంగాజలం చాలా పవిత్రమైనది, శక్తివంతమైనదని మన భారతీయులు నమ్ముతారు. అందుకే ఏ ఒక్క పూజ గంగాజలం లేకుండా పూర్తికాదు. గంగాజలంలో మునిగినా, గంగా జలం సేవించినా.. ఎంతో పుణ్యమని విశ్వసిస్తారు. గంగాజలం ఇంతటి ప్రాధాన్యత పొందడానికి కారణమేంటి ? గంగాజలం ఎందుకు అంత పవిత్రమైనది ?
గంగాజలంలో శుద్ధిచేసే తత్వం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. పూజాకార్యక్రమాల్లో గంగాజలం ఉపయోగిస్తే.. ఎలాంటి దోషం ఉన్నా తొలగిపోతుందని భక్తుల నమ్మకం. పరమ పవిత్రమైన గంగానదిలో మునిగితే.. స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చాలామంది చెబుతూ ఉంటారు. అందుకే గంగానదిపై అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఈ అధ్యయనాలు గంగాజలం గురించి ఏం చెబుతున్నాయి.

స్వర్గానికి సంబంధించిన
మన పాపాలన్నీ కడగడానికి స్వర్గలోకం నుంచి వచ్చిన జలముగా గంగాజలానికి ప్రత్యేకత ఉంది.

గంగానదిగా పేరు
భగీరథుడు గంగాజలాన్ని భూమ్మీదకు తీసుకొచ్చాడని పౌరాణిక కథలు వివరిస్తున్నాయి. హిమాలయాల్లోని గౌముఖ్ దగ్గర గంగా నది ముందుగా భగీరథగా ఉద్భవించింది. తర్వాత 75 చదరపు మైళ్లు ఇది ప్రవహించి.. దేవప్రయాగలోని అలకనందలో కలిసిపోతుంది. ఇలా కలవడం వల్ల ఈ నదికి గంగానదిగా పేరు వచ్చింది.

ఉపనదులు
గంగానదుల్లోకి కలిసే మరో పెద్ద నది.. కైలాస పర్వతానికి అతి దగ్గరగా ఉన్న ఘాగరా నది గంగానదిలో కలుస్తుంది. అలాగే కాట్మాండుకి దగ్గరలోని ఘాంటాక్ అనేది పవిత్ర నది. ఈ రెండు నదుల పవిత్ర జలం గంగానదిలో కలవడం వల్ల.. ఈ నీళ్లు చాలా పవిత్రమయ్యాయని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతారు.

త్రిమూర్తులు 1
గంగాజలం హిందువులు విశ్వసించే బ్రహ్మ, విష్ణు, శివులతో కలిసినదిగా చెబుతారు. బ్రహ్మ గంగాజలాన్ని త్రివిక్రముని అవతారంలో మహావిష్ణువు పాదాలు కడగడానికి ఉపయోగించారట.

త్రిమూర్తులు 2
భూమ్మీద ప్రశాంతత కల్పించడానికి తన తల నుంచి గంగాజలాన్ని భూమ్మీదకు పంపడానికి శివుడు అంగీకరించాడు. అందుకే శివుడికి గంగాధరుడు అనే పేరు ఉంది.

గంగాజలం ప్రత్యేకత
మహర్షి వేదవ్యాసుడు గంగా జలాన్ని దుష్టశక్తుల నిర్మూలను ఉపయోగించారట. గంగానదిలో మునగడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి. గంగానదిలో చనిపోయిన వాళ్ల అస్థికలు కలపడం వల్ల వాళ్లకు విముక్తి లభిస్తుంది.

పరిశుభ్రమైనది
గంగాజలంలో అనేక గుణాలున్నాయి. ఇందులో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండటం వల్ల పూజలకు ఉపయోగిస్తారు.

యాంటీ బ్యాక్టీరియల్
గంగాజలంపై జరిగిన అధ్యయనాల్లో అత్యంత ఆసక్తికర విషయం తేలింది. గంగాజలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నయని సైంటిఫిక్ గా నిరూపించబడింది. అందుకే ఈ నీటిని సేవించడం వల్ల శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications