Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
భక్తులతో నేరుగా మాట్లాడుతున్న దేవుడు.. కోరుకున్న కోరికలు తీరిపోతున్నాయట.. ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆలయం..
సాధారణంగా ప్రతి ఒక్కరికీ దేవుడంటే అపారమైన భక్తి ఉంటుంది. ప్రతిరోజూ దేవుడిని మొక్కనిదే కొంతమంది బయటికి కూడా వెళ్లరు. దైవ భక్తిలోనే పరవశించిపోతారు. దైవ భక్తి ఎంత ఉంటుందో బాబాలను నమ్మే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి బాబాలను మనం చాలా మందిని చూశాము. సత్యసాయి బాబా కూడా అలానే దేవుడయ్యారు. అలాగే తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు రాజమాత దేవి. ఆమె ఏది చెబితే అది నిజమైపోతుందట. కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. ఇంతకీ ఆ రాజమాత దేవి స్టోరీ ఏంటి? ఎక్కడ ఆమె ఉన్నారు అనే విషయాల గురించి చర్చించుకుందాం రండి.
రాజమాత దేవి ఆలయ ఎక్కడుందంటే?
ఈ రాజమాత దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కావలి సమీపంలోని చంద్ర రావూరు గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ రాజమాత దేవి అనే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. ఆమె తన ఆత్మలోకి దేవుడు వస్తారని, తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు. మానవాళికి సేవ చేసేందుకే తన జన్మ ఉద్భవించిందని పేర్కొంటుంటారు. ఆధ్యాత్మికతను వ్యాపింపజేసేందుకు, మానవాళికి సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొంటున్నారు.

ఎవరీ రాజమాత దేవి?
శ్రీ రాజమాత దేవిని బండ్లమాంబ దేవి, బండ్లమాంబమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె ఒక ఆధ్యాత్మిక గురువు. భక్తులకు తన సూచనలు, దీవెనలు ఇస్తూ ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి రోజూ వేల కొద్దీ భక్తులు వస్తుంటారు. సాధారణంగా ఆలయంలోని ప్రాంగణంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంటారు. భక్తులు ఆమెకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. సత్య సాయి బాబా మాదిరిగా మండల దీక్షలు చేపడతారు. అలాగే ప్రతిరోజూ భక్తులకు దర్శనమిస్తూ రాజమాత దేవి పూజలు అందుకుంటారు.
రాజమాత దేవి విశేషాలు
శ్రీ రాజమాత దేవికి విశేషమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ఆమె దీవెనలు ఉంటే కచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. రాజమాత దేవిని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలిగిపోతాయని, సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. ఏదైనా సమస్యలతో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు.. దేవినే సమస్యను గుర్తించి ఆ సమస్య ఉన్న వ్యక్తిని పిలిచి, ఆ సమస్యకు పరిష్కారం చెబుతారని, భక్తులు సమస్యల్లో ఉన్నట్లు తెలిస్తే తన శక్తులు, దివ్య దృష్టితో కచ్చితంగా పరిష్కార మార్గం చూపుతారని నమ్ముతున్నారు.
ఏదైనా కోరికలు కోరుకొని అవి నెరవేరాలంటే శ్రీరాజమాత అభిషేకం చేస్తే చాలని, కోరికలు నెరవేరిపోతాయని చెబుతున్నారు. రాజమాత దేవి ప్రతిరోజూ దర్శనం కోసం అందుబాటులో ఉంటారట. ఆమె ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకునే వ్యక్తులు కూడా అన్నదానం చేయవచ్చు. మీకు కూడా దేవుళ్లపై ఆధ్యాత్మిక గురువులపై నమ్మకం ఉంటే ఓసారి ఈ ఆలయాన్ని సందర్శించండి.



Click it and Unblock the Notifications