Latest Updates
-
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం!
భక్తులతో నేరుగా మాట్లాడుతున్న దేవుడు.. కోరుకున్న కోరికలు తీరిపోతున్నాయట.. ఆంధ్రప్రదేశ్లోనే ఈ ఆలయం..
సాధారణంగా ప్రతి ఒక్కరికీ దేవుడంటే అపారమైన భక్తి ఉంటుంది. ప్రతిరోజూ దేవుడిని మొక్కనిదే కొంతమంది బయటికి కూడా వెళ్లరు. దైవ భక్తిలోనే పరవశించిపోతారు. దైవ భక్తి ఎంత ఉంటుందో బాబాలను నమ్మే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి బాబాలను మనం చాలా మందిని చూశాము. సత్యసాయి బాబా కూడా అలానే దేవుడయ్యారు. అలాగే తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు రాజమాత దేవి. ఆమె ఏది చెబితే అది నిజమైపోతుందట. కోరికలు నెరవేరుతున్నాయని భక్తులు నమ్ముతున్నారు. ఇంతకీ ఆ రాజమాత దేవి స్టోరీ ఏంటి? ఎక్కడ ఆమె ఉన్నారు అనే విషయాల గురించి చర్చించుకుందాం రండి.
రాజమాత దేవి ఆలయ ఎక్కడుందంటే?
ఈ రాజమాత దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కావలి సమీపంలోని చంద్ర రావూరు గ్రామంలో ఉంది. ఇక్కడ శ్రీ రాజమాత దేవి అనే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. ఆమె తన ఆత్మలోకి దేవుడు వస్తారని, తాను బతికున్న దేవుడినని చెప్పుకుంటున్నారు. మానవాళికి సేవ చేసేందుకే తన జన్మ ఉద్భవించిందని పేర్కొంటుంటారు. ఆధ్యాత్మికతను వ్యాపింపజేసేందుకు, మానవాళికి సేవలు అందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొంటున్నారు.

ఎవరీ రాజమాత దేవి?
శ్రీ రాజమాత దేవిని బండ్లమాంబ దేవి, బండ్లమాంబమ్మ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఆమె ఒక ఆధ్యాత్మిక గురువు. భక్తులకు తన సూచనలు, దీవెనలు ఇస్తూ ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయానికి రోజూ వేల కొద్దీ భక్తులు వస్తుంటారు. సాధారణంగా ఆలయంలోని ప్రాంగణంలో కూర్చొని భక్తులకు దర్శనమిస్తుంటారు. భక్తులు ఆమెకు అభిషేకాలు, పూజలు చేస్తుంటారు. సత్య సాయి బాబా మాదిరిగా మండల దీక్షలు చేపడతారు. అలాగే ప్రతిరోజూ భక్తులకు దర్శనమిస్తూ రాజమాత దేవి పూజలు అందుకుంటారు.
రాజమాత దేవి విశేషాలు
శ్రీ రాజమాత దేవికి విశేషమైన శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతుంటారు. ఆమె దీవెనలు ఉంటే కచ్చితంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు. రాజమాత దేవిని దర్శించుకుంటే సమస్యలన్నీ తొలిగిపోతాయని, సుఖ సంతోషాలు నెలకొంటాయని చెబుతున్నారు. ఏదైనా సమస్యలతో ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు.. దేవినే సమస్యను గుర్తించి ఆ సమస్య ఉన్న వ్యక్తిని పిలిచి, ఆ సమస్యకు పరిష్కారం చెబుతారని, భక్తులు సమస్యల్లో ఉన్నట్లు తెలిస్తే తన శక్తులు, దివ్య దృష్టితో కచ్చితంగా పరిష్కార మార్గం చూపుతారని నమ్ముతున్నారు.
ఏదైనా కోరికలు కోరుకొని అవి నెరవేరాలంటే శ్రీరాజమాత అభిషేకం చేస్తే చాలని, కోరికలు నెరవేరిపోతాయని చెబుతున్నారు. రాజమాత దేవి ప్రతిరోజూ దర్శనం కోసం అందుబాటులో ఉంటారట. ఆమె ఆలయానికి వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేస్తున్నారు. ఎవరైనా అన్నదానం చేయాలనుకునే వ్యక్తులు కూడా అన్నదానం చేయవచ్చు. మీకు కూడా దేవుళ్లపై ఆధ్యాత్మిక గురువులపై నమ్మకం ఉంటే ఓసారి ఈ ఆలయాన్ని సందర్శించండి.



Click it and Unblock the Notifications