Just In
- 3 hrs ago ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- 4 hrs ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 7 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 8 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
పార్వతికి శివుడు వివరించిన ఐదు నగ్నసత్యాలు!
పార్వతికి శివుడు వివరించిన ఐదు నగ్నసత్యాలు!
సతీదేవి, తన రెండవ జన్మలో పార్వతీ దేవిగా జన్మించింది. పార్వతి, పర్వత రాజైన హిమవంతుడు, రాణి మైనాల తనయ. శివుని వివాహం చేసుకోవడం బాల్యం నుండి ఆమె కల. నారద మహాముని కూడా ఆమె శివుడిని భవిష్యత్తులో పరిణయమాడబోతుందని చెప్పారు.
వయస్సు పెరిగే కొద్దీ శివునిపై ఆమె ప్రేమ కూడా పెరుగుతూ వచ్చింది. ఎంతో తపస్సు చేసి, ఎన్నో శ్రమలకు ఓర్చి, ఆమె శివుని కళ్యాణమాడింది.
శివుడు అపార మేధస్సు మరియు ఎంతో జ్ఞానం సముపార్జించిన యోగి. ఆయన తన జ్ఞానాన్ని, అనుభవాలను పార్వతితో పంచుకునేవారు. ఆమెకు అతను సృష్టి రహస్యాలను, ప్రజల కష్టనష్టాల వెనుక ఉన్న కారణాలను విడమర్చి చెప్పేవారు. అలా శివుడు పార్వతితో పంచుకున్న ఐదు ముఖ్య విషయాలను ఇప్పుడు మేము మీకు వివరించబోతున్నాం. చదవండిక!
1. అతి పెద్ద కీడు మరియు అతి పెద్ద మేలు:
శివుడు పార్వతితో ఈ విధంగా చెప్పాడు. నిజమైన మంచితనం ఎప్పుడు సత్యంతో ముడిపడి ఉంటుంది. ఎప్పుడు సత్యాన్ని పలకాలి. ఎప్పటికైనా సత్యమే నిలిచి ఉంటుంది. దీనిపైనే విశ్వమంతా ఆధారపడి ఉంటుంది.
అదేవిధంగా ప్రతిఒక్కరు అబద్దానికి దూరంగా ఉండాలి. అబద్దమాడటం అనేది ప్రతి మనిషి జీవితంలో అతి ఘోరమైన పాపం. ఒక అబద్ధం భవిష్యత్తులో మరిన్ని అబద్దాలకు తావిస్తుంది. ఈ చట్రంలో ఇరుక్కున్న మానవుడుపాపిగా మారతాడు.
అబద్దమాడరాదని నిశ్చయించుకున్న మనిషి, దానికి దారితీసే పరిస్థితుల నుండి దూరంగా ఉండటం మొదలు పెడతాడు. తప్పులు చేయడం లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటాడు. దీనివలన ఒకదాని తరువాత ఒక అబద్దం ఆడవలసిన పరిస్థితి నివారింపబడుతుంది.
2. నీ కర్మలకు నువ్వే సాక్షివి:
మానవుడు తనను ఎవరూ గమనించడం లేదనుకుని పాపాలు చేస్తాడు. ఇదంతా తన భ్రమ అని మరచిపోతాడు. ప్రతిమనిషి తన కర్మలకు తానే సాక్షి అని మరచిపోతాడు. తన దేహం చేసే తప్పుడు పనిని, తన ఆత్మ గమనిస్తుందని అంగీకారానికి వచ్చినప్పుడు, అతను తప్పు చేయడానికి వెరుస్తాడు. ఎవరూ తమ ఆత్మ నుండి తప్పించుకోలేరు. ఆత్మకు భయపడేవాడు తప్పు చేయడు.
3. ఈ మూడు పనులను ఎన్నడూ చేయరాదు:
పాపం చేయడానికి మూడు మార్గాలుంటాయి. అవే మనస్సు, వాక్కు మరియు కర్మ. ఈ మూడింటిని నియంత్రణలో ఉంచకపోతే, పాపాలు జరుగుతాయి
పరమశివుడు, అన్ని శాస్త్రాలలో , పాపం చేయాలనే ఆలోచనను మనస్సులో చేయడం కూడా నిషేధింపబడిందని తెలిపారు. ఇతరుల మనస్సును మన మాటలతోనైనా కూడా గాయపరచరాదు. అటువంటి దుశ్చర్యలకు ప్రతిఫలం ఈ జన్మలోనే కాక మారు జన్మలోనూ అనుభవించవలసి వస్తుంది.
4. విజయానికి మార్గం:
ప్రపంచమంతా భౌతిక సుఖాలకై ఆరాటంలో బంధీ అయ్యి ఉంది. మానవుడు ఈ తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడుతుంటాడు. ఈ సుఖాలన్ని ఒక మాయ తప్పితే శాశ్వతమైనవి కావు. ఆ భ్రమలో నుండి బయటపడితే కానీ మానవుడు అజేయుడు కాలేడు. ఈ ప్రపంచంలో మనుషులందరు ఒక వస్తువు పట్లనో లేక ఒక వ్యక్తి పట్లనో వ్యామోహం పెంచుకుని, అందుకై ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అపజయాలకు ఇది ముఖ్యకారణం. విజయప్రాప్తికై మనిషి, తాత్కాలిక సుఖాలకు దూరంగా ఉండాలి.
5. నీ జీవితాన్ని మార్చేయగల సాధనం:
అత్యాశ మాత్రమే మనిషి సుఖాల వెనుక పరిగెట్టడానికి కారణం. డబ్బుకై అత్యాశ, ప్రేమకై అత్యాశ, పేరుకై అత్యాశ, ఇలా వివిధ రకాలైన అత్యాశల వలన ఆధ్యాత్మిక ఉన్నతి సాధించడానికి అడ్డంకులుగా మారతాయి. ఇవన్నీ జీవించడానికి అవసరమైనప్పటికి,వాటి కొరకు అతిగా అర్రులు చాచకూడదు.
వీటన్నింటినీ జీవితంలో సమతూకంలో ఉంచాలంటే, ధ్యానం మరియు యోగా ద్వారా సాధ్యమవుతుందని ఆ పరమేశ్వరుడు సెలవిచ్చాడు. ఇక్కడి నుండే ఆధ్యాత్మికత మొదలవుతుంది.