Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
Tirumala Photos: వైభంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..ఈ రోజు ఈ పనులు చేస్తే పాపాలు మూటగట్టుకున్నట్లే
దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలతో పాటుగా తిరుమలలో కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు, బుధవారం తిరుపతిలో వైకుంఠ దర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకి తీసుకొచ్చిన టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వారిని దర్శనానికి అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. ఈ ఫొటోలలో తిరుమల ఆలయం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఫొటోలను ఇక్కడ చూడండి.
ఈ రోజు అస్సలు చేయకూడని పనులివే
వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని పాటిస్తేనే వ్రత ఫలం దక్కుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయకూడదో ఇక్కడ చూడండి.

మాంసాహారం
ఈ రోజున మాంసాహారం తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఇది కేవలం ఏకాదశి రోజునే కాకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఎప్పుడూ వర్తిస్తుంది.
ఉపవాస సమయంలో ఇలా
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఆచారం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు, మనస్సును కూడా నియంత్రించడం. ఈ రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని నమ్మకం. అందుకే బియ్యానికి దూరంగా ఉండాలి. పాలు, పండ్లు, నీరు వంటివి తీసుకోవచ్చు.
వెల్లుల్లి,ఉల్లి వద్దు
ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను వైకుంఠ ఏకాదశి రోజు తీసుకోవడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినది కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి.
పగటి నిద్ర
పగటిపూట నిద్రపోకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. విష్ణు నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తూ గడపాలి.
దూషణ, అబద్దాలు
ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications