Latest Updates
-
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన! -
బయట బండి మీద దొరికే రుచితో ఇంట్లోనే భేల్ పూరీ.. ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
ఇడ్లీ, దోసెల్లోకి ఈసారి వంకాయ చట్నీ రుచి చూడండి..లెక్కపెట్టకుండా తినేస్తారు -
హైదరాబాద్ స్పెషల్ ఇరానీ ఛాయ్.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి! -
చపాతీ, పూరీ, పులావ్ లలోకి అదిరిపోయే మీల్ మేకర్ మసాలా గ్రేవీ.. నాన్ వెజ్ కూడా దీని ముందు దిగదుడుపే!
Tirumala Photos: వైభంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు..ఈ రోజు ఈ పనులు చేస్తే పాపాలు మూటగట్టుకున్నట్లే
దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవాలయాలతో పాటుగా తిరుమలలో కూడా ఇవాళ వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే అధికారులు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. వైకుంఠ ద్వారం గుండా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు, బుధవారం తిరుపతిలో వైకుంఠ దర్శనం కోసం టిక్కెట్లు జారీ చేసే సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన భక్తులందరినీ ప్రత్యేకంగా తిరుమలకి తీసుకొచ్చిన టీటీడీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వారిని దర్శనానికి అనుమతించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ఆలయాన్ని చాలా అందంగా ముస్తాబు చేశారు. ఈ ఫొటోలలో తిరుమల ఆలయం చాలా చాలా అద్భుతంగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ ఫొటోలను ఇక్కడ చూడండి.
ఈ రోజు అస్సలు చేయకూడని పనులివే
వైకుంఠ ఏకాదశి రోజు కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కొన్ని పనులు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని పాటిస్తేనే వ్రత ఫలం దక్కుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏం చేయకూడదో ఇక్కడ చూడండి.

మాంసాహారం
ఈ రోజున మాంసాహారం తీసుకోవడం పూర్తిగా నిషేధం. ఇది కేవలం ఏకాదశి రోజునే కాకుండా ఆధ్యాత్మిక సాధన చేసేవారికి ఎప్పుడూ వర్తిస్తుంది.
ఉపవాస సమయంలో ఇలా
వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఆచారం. ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడం మాత్రమే కాదు, మనస్సును కూడా నియంత్రించడం. ఈ రోజున బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదు. ఎందుకంటే పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని నమ్మకం. అందుకే బియ్యానికి దూరంగా ఉండాలి. పాలు, పండ్లు, నీరు వంటివి తీసుకోవచ్చు.
వెల్లుల్లి,ఉల్లి వద్దు
ఉల్లి, వెల్లుల్లి వంటి తామసిక ఆహారాలను వైకుంఠ ఏకాదశి రోజు తీసుకోవడం వల్ల మనస్సు చంచలంగా మారుతుంది. ఏకాదశి వ్రతం ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినది కాబట్టి ఈ రోజున సాత్విక ఆహారం తీసుకోవాలి.
పగటి నిద్ర
పగటిపూట నిద్రపోకూడదు. రాత్రంతా జాగరణ చేయాలి. విష్ణు నామస్మరణ, భజనలు, కీర్తనలు చేస్తూ గడపాలి.
దూషణ, అబద్దాలు
ఈ రోజున ఎవరినీ దూషించకూడదు, కోపం తెచ్చుకోకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, ఎవరితోనూ గొడవ పడకూడదు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి.



Click it and Unblock the Notifications











