Just In
- 1 hr ago మీనరాశిలో కుజుడు-రాహువు కలయిక వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది..జూన్ 1 వరకు ఈ రాశులకు కష్టాలు తప్పవు..జాగ్రత్త
- 5 hrs ago ఈరోజు రాశి ఫలాలు : గురువారం సాయిబాబా ఆశీస్సులతో ఏఏ రాశుల వారికి ఈ రోజు శుభకరం, ఎవరికి అశుభం
- 10 hrs ago Lazy Husband Signs: 4 సోమరిపోతు రాశులు, వీరిని పెళ్ళి చేసుకుంటే సంకనాకిపోతారు..అంతే..ఒక్కపనికి పనికిరారు
- 13 hrs ago పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
ఈ 6 వస్తువులను బెడ్ క్రింద 21 రోజులు పెట్టుకుంటే ఎలాంటి సమస్యైనా పరిష్కారమవుతుంది
పురాతన సంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహం సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదొడుకులను వాస్తు ప్రకారం సరి చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుంద
జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. శాస్త్రాలు, పురాణాల ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు రెండు మూల కారణాలుంటాయి . వాటిని ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుంది. ఒకటి జీవి కర్మ ఫలితం, రెండోది యాదృచ్ఛికంగా జరిగే తప్పుల ఫలితం. చెడు లేదా మంచి కర్మల ఫలితంగా ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వీటిలో వాస్తు ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు ఏ పని తలపెట్టినా అనుకూల ఫలితాలు వెల్లడి కావు.
పురాతన సంప్రదాయాలతో జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవచ్చు. వృత్తి, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ, వివాహం సంబంధాల్లో ఎదురయ్యే ఒడిదొడుకులను వాస్తు ప్రకారం సరి చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...
కోపం తగ్గించుకోవడానికి
రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీరుపోసి మంచం కింద లేదా పక్కన ఉంచాలి. అలాగే రెడ్ సాండిల్ వుడ్ (ఎర్ర చందనం చెక్క)ను దిండు కింద పెట్టుకోవాలి. దీని వల్ల కోపం, ఉద్రేకాలు అదుపులో ఉంటాయట.
వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరగడానికి
వెండి పాత్రలో లేదా గిన్నెలో నీరుపోసి పడుకునే మంచం కింద పెట్టుకోవాలి. అలాగే వెండితో తయారు చేసిన వస్తువులను ధరించడం వల్ల చర్మారానికి తాకితే అద్భుతమైన ఫలితం ఉంటుందట. దీని వల్ల వ్యక్తుల్లో దృఢ సంకల్పం పెరుగుతుందట.
దోష నివారణకు :
బంగారం లేదా వెండి ఆభరణాలను దిండు కింద పెట్టుకుంటే జన్మకుండలిలోని దోష నివారణ అవుతుందట.
అదృష్టం పొందడానికి :
వెండితో చేసిన చేపలను దిండు కింద లేదా పక్కన పెట్టుకోవాలట. అలాగే వెండి పాత్రలో నీళ్లు నింపి అందులోసిల్వర్ పిష్ వేసి ఉంచినా..దీని వల్ల అంతులేని అదృష్టం కలుగుతుందట.
ద్రుష్టి దోషాలు తొలడానికి :
ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి 21 రోజుల పాటు మంచం కింద ఉంచాలట. అంతే కాకుండా జాతి రత్నమైన నీలమణిని కూడా దిండు కింద పెట్టుకుంటే చెడు దోష నివారణ జరుగుతుందట.
ఇత్తడి చెంబులో నీళ్లు పోసి
ఇత్తడి చెంబులో నీళ్లు పోసి మంచం కింద ఉంచితే మంచి ఫలితం ఉంటుందట.