Latest Updates
-
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే..
Gayatri Mantra : గాయత్రి మంత్రం పఠించడం వెనక రహస్యం..!
గాయత్రి మంత్రంలో అనంతమైన శక్తి ఉంటుంది. వేదపండితుల దగ్గరి నుంచి సాధారణ పండితుడి వరకు అందరూ గాయత్రి మంత్రాన్ని తప్పుకుండా జపించాలని భక్తులకు సూచిస్తుంటారు. ప్రతీ రోజు ఉదయం లేవగానే గాయత్రీ మంత్రం పఠించడం వల్ల ఆ రోజు వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాము. గాయత్రీ మంత్ర శబ్దంలో అతీతమైన శక్తి దాగుంది.
అన్ని వేదాల్లో ఉన్నదంతా గాయత్రీ మంత్రంలో ఉందని నమ్మకం. ఇదే వేదాలన్నింటి సారాంశంగా కూడా పేర్కొంటారు. ఈ మంత్రంలో ఉన్న పవిత్ర శక్తమంతమైన శబ్దం శుభాలను కలిగించడమే కాక భయంకరమైన కలలను పారదోలుతుందని అంటారు. కానీ ఈ మంత్రాన్ని చాలా నిష్టతో ధ్యానంతో పరిశుభ్రతతో మాత్రమే పఠించాలని పండితులు సూచిస్తున్నారు.
గాయత్రీ మంత్రం
ఓం భూర్-భువః స్వాః
తత్-సవితుర్-వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ ||

మానసిక ప్రశాంత
గాయత్రీ మంత్రం పఠిస్తే మానసిక ప్రశాంతతో పాటు శరీరంలోని జీవనాడులు ప్రభావితమై శరీరం ఆరోగ్యంగా కూడా మారుతుందని ఆయుర్వేధ శాస్గ్రవేత్తలు చెబుతున్నారు. మనసు దిగులుగా ఉన్నప్పుడు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా పఠించవచ్చు. కానీ సూర్యుడు రాకముందే పఠించడం వల్ల ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. ఎన్ని సార్లైనా గాయత్రీ మంత్రాన్ని పఠించవచ్చు. మొదటగా రోజూ ఒకసారితో ప్రారంభించండి. తరువా ఆ సంఖ్యను 5, 10, 20 నుంచి అలా 108 సార్లు ప్రతీ రోజు పఠించేలా ప్రయత్నం చేయండి.
భక్తితో శ్రద్ధతో క్రమశిక్షణతో
గాయత్రీ మంత్రాన్ని భక్తితో శ్రద్ధతో క్రమశిక్షణతో పఠించాలి. మామూలుగా చదివినట్టు కాకుండా ఈ ఆర్టికల్లో పైన తెలుగులో గాయత్రీ మంత్రాన్ని ఇచ్చిన విధంగానే ఉచ్ఛరిస్తూ పఠించాలి. మీకు పఠించడం ఇష్టం లేని సమయంలో గాయత్రీ మంత్రాన్ని పఠించవద్దు, మీరు మానసిక సమస్యలో ఉన్నా, మనసు ఆందోళన చెందుతున్నా లేక మీరు చాలా కోపంగా ఉన్నా కూడా గాయత్రీ మంత్రాన్ని పఠించరాదు. మీరు మనశ్శాంతి కావాలనుకొని పఠిస్తే పఠించవచ్చు. కానీ భక్తి, శ్రధ్ద లేనిది మాత్రం గాయత్రీ మంత్రాన్ని పఠించవద్దు.
108 సార్లు
108 అనేది దైవ సంఖ్య. ఈ సంఖ్యతో అంతా శుభమే జరుగుతుంది. కబట్టి గాయత్రీ మంత్రాన్ని 108 పఠించడం వల్ల కొన్ని రోజుల్లోనే మీరు మంచి ఫలితాలను పొందుతారు. గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు చదవడానికి 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది. మీ ఒక రోజులో అంటే 24 గంటల్లో 25 నిమిషాలనేవి చాలా తక్కువ సమయం. ఈ 25 నిమిషాలు శ్రద్ధగా భక్తిగా గడిపితే మిగిలిన గంటలు రోజు మొత్తం సంతోషంగా ప్రశాంతంగా సాగిపోతుంది. కాబట్టి గాయత్రీ మంత్రాన్ని పైన చెప్పిన విధంగా మాత్రమే పఠించాలి. గాయత్రీ మంత్ర శబ్దంలోనే అనంతమైన శక్తి ఉందని పండితులు చెప్పిన విషయాన్ని ఎప్పటికీ స్మరించుకుంటూ ఉండాలి.



Click it and Unblock the Notifications











