Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
మీ ఇంట లక్ష్మీదేవి గృహప్రవేశం చేయాలంటే కంపల్సరీ దీపాలు వెలిగించాలి..!!
‘‘దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''
హిందు పండగలన్నింటిలోకి, ఘనంగా సెలబ్రేట్ చేసుకునే అతి పెద్ద పండుగ దీపావళి, అన్ని పండుగలకి తలంటు పోసుకోవడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకోవడం, బందుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది. కానీ, ఈ పండుగకి వీటన్నింటితో పాటు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదే ''దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం ' దీనికి సంబంధించిన విష్ణు పురాణంలో ఒక కథ కనబడుతుంది. దీపావళి నాడు మహాలక్ష్మీ విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయడానికి బయలు దేరిన లక్ష్మీ దేవి ఏ ఇంట్లో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం??

లక్ష్మీ అనుగ్రహం కోరుకునే వారు అప్పటి నుంచీ దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించడం ప్రారంభించారు. లక్ష్మీ దేవి తనవాహనమైన గుడ్ల గూబ ఎక్కి, సూర్యాస్తమయ సమయం, అనగా సాయం సద్య లేక ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకూ సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణపురాణంలో ఉంది.

''దీపంపరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు. అటువంటి సంధ్యా దీపమా నీకు నమస్కారము''

''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్జానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతోనే. మాములు చీకట్లే కాదు, అజ్జానం, దు:ఖం, శోకం, అలసత, రోగం, మాంద్యము, మ్రుత్యువు మొదలైనవన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం.

పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' సూర్యుడు తన సహస్రకకరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. కానీ ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయామయుడైన కర్మాసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. 'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన:''ఆ అగ్ని దేవుని మన ఇంట్లోని దీపమందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల యందలి చీకట్లను పారదోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం..!

"సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతిమిరాపహామ్ '' ఇంతటి మహాదాశయంతో, సద్భావనతో , సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మీకి ప్రతి రూపం అవటం, దానిని చూసి లక్ష్మీ దేవి అనుగ్రహించటం సమంజసమే.

దీపాలని చూసి లక్ష్మీ అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెబుతారు. చతుర్మాస్యం పూర్తి అయిన శ్రీమహావిష్ణువు నిద్రమేల్కొనే రోజుగా దీపావళిని చెబుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనుక దీపాలు వెలిగించాలట.

దీసావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసి కోట దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికి ఒక పద్దతుంది. తులసి పూజ అయినాక, కృత్తిక నక్షత్ర దర్శనం చేయాలంటారు. ఈ నెల అంతా కృత్తికల పేరు గలది కదా! తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారు జామున దామోదరుని, పగలు, శివుణ్ణి, సాయంత్రం లక్ష్మీని ఆరాధించాలి.



Click it and Unblock the Notifications