Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
స్త్రీలు గాజులు ధరించడం వెనక దాగున్న ఆంతర్యం ఏంటి ?
గాజుల సవ్వడితో చేతులు గలగలా అంటూ శబ్ధం చేస్తే అమ్మాయి అందం రెట్టింపవుతుంది. అయితే గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు.. వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని.. హిందూ సంప్రదాయం చెబుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి. అంతేకాదు.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయి.

ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు. కాబట్టి.. చేతినిండా గాజులేసుకుంటే ఇంట్లో లక్ష్మీ దేవి ఉన్నట్లే అని.. మురిసిపోతారు పెద్దలు. అందుకే పుట్టినప్పటి నుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు. గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం.
రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి. మరి ఏ రంగు గాజులు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలిరంగు గాజులు విఙ్ఞానాన్ని, ఊదారంగు గాజులు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు సంతోషాన్ని, నారింజ రంగు గాజులు విజయాన్ని, తెలుపు రంగు గాజులు ప్రశాంతతను, నలుపు రంగు గాజులు అధికారాన్ని, వెండి గాజులు బలాన్ని, బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం. బంగారు గాజులు ఎన్ని వేసుకున్న కనీసం రెండు మట్టిగాజులైనా ధరించాలి. అమ్మవారి పూజల్లో పసుపు, కుంకుమలతోపాటు గాజులతో పూజిస్తారు. కాబట్టి.. మట్టిగాజులు వేసుకోవడం.. ముత్తైదుతనాన్ని సూచిస్తుంది. గాజులు పగలడాన్ని అమంగళం, అశుభంగా భావిస్తారు భారతీయులు.



Click it and Unblock the Notifications