Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
Good Friday: ఏసు ప్రభును శిలువ ఎందుకు చేశారో తెలుసా?.. అసలు కారణం ఇదే
క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే అత్యంత ప్రీతిపాత్రమైన, అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు ఆధ్యాత్మికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ఈ రోజున ఏసు ప్రభుకు శిలువ వేశారని, అందుకే గుడ్ ఫ్రైడే జరుపుకుంటారని మనకు తెలుసు. ఏసు చేసిన త్యాగానికి, మానవాళికి చూపెట్టిన మానవత్వపు గుణపాఠానికి ఇది నిదర్శనమని, అందుకే ఈరోజును అత్యంత ప్రత్యేకంగా.. అత్యంత పవిత్రంగా నిర్వహించుకుంటారు. అయితే చాలా మందికి గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసు.. కానీ అసలు యేసుకు శిలువ ఎందుకు వేశారు అనేది తెలియదు. ఏసు ప్రభుకు శిలువ వేయడానికి అనేక సామాజిక, రాజకీయ, మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి? అసలు యేసుకు శిలువ వేసేంత తప్పు ఆయన ఏం చేశారు అనేది ఈ స్టోరీని పూర్తిగా చదివి తెలుసుకోండి.
ఏసును శిలువ వేసిన ప్రధాన కారణాలు:
1. ఆధ్యాత్మిక కారణం.. పాప విమోచన
క్రైస్తవ విశ్వాసం ప్రకారం, మనిషి పాపాలకు విమోచన కలిగించేందుకు దేవుడు తన కుమారుడిని పంపాడని, ఆయనే ఏసు అని నమ్ముతారు. ఏసు శిలువపై తన రక్తాన్ని చిందించి.. మనుషులందరీ పాపాలను ప్రాయశ్చిత్తం చేశాడని, దానికి గుర్తుగానే ఈరోజును జరుపుకుంటారని చెబుతారు. ఆయన మరణం ద్వారా మానవాళికి దైవ అనుగ్రహం మరియు నిత్య జీవం లభించాయని క్రైస్తవులు విశ్వసిస్తారు.

2. యూదా మతాధికారుల అసహనం
ఏసు అప్పటి యూదా మతపెద్దలపై విమర్శలు చేశారు. ఆయన మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని తిట్టారు, దేవుని ప్రేమను మానవ నిబంధనల కంటే ముఖ్యంగా చెప్పారు. ప్రజల మద్దతు పొందుతూ, ఆయన దేవుని కుమారుడిని అని ప్రకటించడంతో, మతపెద్దలు ఆయనను ధర్మానికి భంగపాటు కలిగించే వ్యక్తిగా భావించారు. అందుకే ఆయనకు శిలువ విధించారు.
3. రొమన్ల రాజకీయ అణచివేత
అప్పట్లో యూదయ ప్రదేశ్ రోమన్ల పాలనలో ఉండేది. ఏసు చాలా మందిని తన బోధనతో ఆకర్షించడాన్ని రోమన్లు విప్లవ ప్రమాదంగా చూశారు. "తాను రాజునని" చెప్పడాన్ని రొమన్లు శాసన విరుద్ధంగా భావించి, ఆయన్ను ద్రోహిగా పరిగణించారు. దీంతో ఆయనను శిలువపై పెట్టి.. మరణించే వరకు కొరడా దెబ్బలు కొట్టారని చెబుతుంటారు.
4. యూదాస్ చేసిన మోసం
ఏసు శిష్యుల్లో ఒకడైన యూదాస్ మతాధికారులకు ఏసు నివసించే స్థలాన్ని చూపించి, 30 వెండి నాణేలకి ఆయనను మోసం చేశాడు. దీనివల్ల ఏసును పట్టుకుని రోమన్లకు అప్పగించారు. దీంతో రోమన్లు ఆయనను చిత్రహింసలు పెట్టారు
5. ప్రజాభిప్రాయం
రోమన్ గవర్నర్ పిలాతుకు ఏసులో తప్పు కనబడకపోయినా, ప్రజల ఒత్తిడికి లోనై ఆయనకు శిక్ష విధించాడు. ప్రజలు "యేసును శిలువ వేయండి!" అంటూ అరవడంతో, చివరికి శిలువ శిక్ష విధించబడ్డది.
సందేశం ఏంటంటే..
ఏసు శిలువ వేయడం ఒక దుఃఖకరమైన సంఘటన మాత్రమే కాదు. అది దైవ ప్రేమ, క్షమ, త్యాగం యొక్క అత్యున్నత రూపం. ఆయన తాను చేసిన తప్పుల కోసం కాదు - మన తప్పుల కోసం శిక్ష అనుభవించాడు. ఏసు శిలువ అవడం వలన కొన్ని సందేశాల్లో సమాజంలో బలంగా వినిపిస్తాయి. అవేంటంటే.. ప్రేమ ద్వేషాన్ని మించినది. త్యాగం వలన విమోచనం వస్తుంది. క్షమించడంలో శక్తి ఉంది.



Click it and Unblock the Notifications











