Latest Updates
-
ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఎన్ని రోజులు తినాలి? ఈ రహస్యం మీకు తెలుసా? -
ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే. -
రాగి పూరీ-ఉల్లిపాయ మసాలా..లెక్కలేకుండా తినేయడం గ్యారెంటీ! -
అన్నం, పప్పు,పరాఠా, రోటీల్లోకి బెస్ట్ కాంబినేషన్..రాజస్థానీ స్పెషల్ వెల్లుల్లి ఎర్ర మిరప చట్నీ -
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్!
లక్ష్మణుడి భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు భర్తతో ముద్దూ ముచ్చట లేకుండా ఎందుకు నిద్రపోయింది?
వన వాసం అయిపోయాక లక్ష్మణుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లేచింది ఊర్మిళ. తర్వాత తన భర్తను కూడా కొద్దిసేపు కనుక్కోలేకపోయింది. లక్ష్మణుడి భార్య ఊర్మిళ 14 సంవత్సరాలు ఎందుకు నిద్రపోయింది.
రాముడి భార్య సీతమ్మ గురించి అందరికీ తెలుసు. ఆమె పడ్డ కష్టాలు ఆమె జీవితం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఊర్మిళ స్వయానా సీతమ్మ తల్లి చిన్నాన కుమార్తె.

లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది
సీతమ్మ రాముడి కోసం ఎలా త్యాగాలు చేసిందో ఊర్మిళ కూడా లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది. సీతమ్మవారు రాముడి వెంట వనవాసం వెళ్లారు. వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్లాడు. తాను కూడా వస్తానని
భర్తను అడిగింది ఊర్మిళ. నువ్వేమీ మాతో పాటు రావొద్దు అక్కడి కష్టాలు నువ్వు తట్టుకోలేవు అంటాడు ఊర్మిళతో లక్ష్మణుడు.

నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో
అయితే లక్ష్మణుడు ఊర్మిళా.. నువ్వు నా కోసం ఒక పని చెయ్యాలని కోరుతాడు. చెప్పండి.. మీరు ఏమి అడిగితే అది చెయ్యడానికి నేను సిద్ధం అని చెబుతుంది ఊర్మిళ. ఏమీ లేదు నా నిద్ర మొత్తం నువ్వు తీసుకో... నీ మెలకువను నాకు ఇవ్వు అంటాడు. సరే అండి.. అలాగే అంటూ లక్ష్మణుడి నిద్ర మొత్తం ఆమెనే తీసుకుంది.

14 సంవత్సరాలు నిద్రలోనే
అలా ఆమె 14 సంవత్సరాలు నిద్రలోనే ఉండిపోయింది. లక్ష్మణుడు 14 సంవత్సారాల పాటు వనవాసంలో ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. అన్నావదినలను కంటికిరెప్పలా చూసుకుంటూ ఉండిపోయాడు. ఊర్మిళ జీవితం ఏ ముద్దూ ముచ్చటా లేకుండా అలా నిద్రలోనే గడిచిపోయింది. అన్నేళ్లు కనీసం ఆహారం కూడా తీసుకోలేదు.

ఇంద్ర జిత్తుడిని చంపాలంటే
వన వాసం అయిపోయాక లక్ష్మణుడు నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు లేచింది ఊర్మిళ. తర్వాత తన భర్తను కూడా కొద్దిసేపు కనుక్కోలేకపోయింది. అంత గాఢనిద్రలో ఆమె ఉంది. అయితే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్రపోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఇంద్ర జిత్తుడిని చంపాలంటే 14 సంవత్సరాల పాటు నిద్ర ఉండకూడదు. ఆహారం ముట్టకూడదు. ఈ విషయం ముందే తెలుసుకున్న లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్రపోకుండా ఏమీ తినకుండా ఉన్నాడు. అందువల్లే యుద్ధంలో ఇంద్రజిత్తుడిని చంపగలిగాడు.

నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే
ఈ విషయం తన అన్న శ్రీరాముడికి కూడా తెలియకుండా గడిపాడు లక్ష్మణుడు. తనకిచ్చే అన్నాన్ని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడు లక్ష్మణుడు. చివరకు ఈ విషయం తెలిసిన రాముడు తనపై తమ్ముడు చూపిన ప్రేమకు ఆనందపడ్డాడు. నీలాంటి తమ్ముడు ఒక్కడుంటే చాలు ఈ విశ్వాన్నే జయించొచ్చు అనుకున్నాడు.



Click it and Unblock the Notifications











