భోజనం వెంటనే నిద్ర, మరణానికి ఆహ్వానమా..?

After Eating,Sleeping Is a Life Threat..?
భో్జనం చేసిన వెంటనే నిద్రపో్తే త్వరగా మరణం దాపరిస్తుందా..?, తిన్న వెంటనే సంభోగంలో పాల్గొంటే ఆయుష్షు తగ్గిపోతుందా..?, అవననే అంటున్నారు వైద్య నిపుణులు. భోజనానికి నిద్రకు కనీసం 2 గంటల వ్యవధి పాటించాలంట. భో్జనం చేసిన తరువాత 100 నుంచి 200 అడుగులు తప్పనిసరిగా నడిచి ఆ తరువాత కూర్చోవాలి.

నడకను పక్కనపెట్టడం వల్ల పొట్టపెరుగుతుంది. రాత్రి సాధ్యమైనంత వరకు పెందలాడే తినాలి. సులభంగా అరిగే ఆహార పదర్ధాలను భుజించటం వల్ల జీర్ణ వ్యవస్థ సమర్ధవంతంగా పని చేస్తుందట. భోజనం అనంతరం పండ్లు తినే అలవాటున్నవారు, భోజనానికి రెండు గంటల ముందుగాని, రెండు గంటల తరవాతగాని ఈ ప్రక్రియకు పూనుకోవాలంటున్నారు.

ఆరోగ్యవంతమైన అలవాట్లను పెడచెవిన పెట్టి, తిన్నవెంటనే నిద్రించిటంతో పాటు సెక్స్ లో పాల్గొనే వారికి ఆయుష్షు తగ్గి మరణం త్వరగా దాపరిస్తుందని వైద్య నిపుణులతో పాటు ఆయుర్వేద శాస్త్ర్రాలు హెచ్చరిస్తున్నాయి.

Story first published: Wednesday, October 12, 2011, 10:14 [IST]
Desktop Bottom Promotion