Latest Updates
-
వారపు రాశి ఫలాలు 22 నుండి 28 మార్చి: ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఆరోగ్యానికి అమృతం లాంటి నల్ల నువ్వుల లడ్డూ..ఇలా చేసి రోజుకొకటి తింటే జుట్టు రాలడం, PCOD పరార్! -
ఈరోజు రాశి ఫలాలు (22.03.26): ఆదివారం నాడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
పనీర్ లేకుండానే పాలక్ పనీర్!..ఈ 2.0 రెసిపీ చూస్తే వెంటనే వండేస్తారు! -
అబ్బాయిలు vs అమ్మాయిలు..ప్రేమ విషయంలో ఎవరు ఎక్కువ సీరియస్ గా ఉంటారు? -
పర్ఫెక్ట్ అల్లం టీ తయారీకి సీక్రెట్ ఇదే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి! -
నోరూరించే చెట్టినాడ్ చికెన్.. తింటుంటే వావ్ అనాల్సిందే! -
నోరూరించే భాయ్ స్టైల్ చికెన్ బిర్యానీ.. మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
కాఫీ, టీలు ఎక్కువ తాగుతున్నారా? అయితే ఈ నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు! -
రొటీన్ మటన్ కూరలతో బోర్ కొట్టిందా? అయితే ఈ రంజాన్ కు క్రీమీ ఆఫ్ఘానీ మటన్ ట్రై చేయండి..డబుల్ మజా!
భోజన సమయంలో నీరు తాగితే?

సాధారణంగా మనమందరం భోజనం చేసే సమయంలో కనీసం ఒక గ్లాసెడు నీరు దగ్గర పెట్టుకొని మాత్రమే భోజనం చేస్తాం. ఏ ఆహారం తింటున్నప్పటికి ఒక గ్లాసెడు నీరు పక్కన వుండటం తప్పని సరి. ఏ హోటల్ కి వెళ్ళినా సరే పదార్ధాలు ఆర్డరివ్వకముందే, సర్వర్ ఒక గ్లాసెడు నీరు తెచ్చి పెడతాడు. అయితే, ఘన పదార్ధాలు తినేటపుడు, లేదా తిన్న వెంటనే నీరు తాగడం సరికాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఈ రకంగా నీరు తాగితే, అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగిస్తుందని, జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని వీరంటారు.
మరి నీరు ఎప్పుడు తాగాలి? భోజనానికి సరిగ్గా అరగంట ముందు నీరు తాగితే, మీరు తినే ఘన ఆహారాలకు తాగిన నీరు జీర్ణక్రియకు సహకరిస్తుంది. లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే నీరు తాగాలని, ఈ రకంగా తాగే నీరు, పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి ఉపయోగపడుతుందని, ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. నీటిని అవసరం లేని సమయాలలో శరీరానికి అందించితే అది గ్యాస్ సమస్యలకు కూడా దోవతీయవచ్చంటున్నారు.
రోజు మొత్తం మీద శరీరానికి నీటిని ఎలా అందించాలి? ఉదయం లేవగానే కనీసం ఒక లీటరు నీటిని తాగాలి. మధ్యాహ్నం లంచ్ సమయంవరకు నిర్దేశిత కాల వ్యవధితో మరో లీటర్ తాగాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత మొదలుపెట్టి సాయంకాలం స్నాక్స్ లేదా చిరుతిండి వరకు మరో లీటరు నీరు అప్పుడపుడూ, ఆపై రాత్రి డిన్నర్ లోపుగా మరో లీటర్ అంచెలవారీగా తాగితే మొత్తంగా నాలుగు లీటర్ల నీరు ప్రతిరోజూ శరీరానికి అందించినట్లవుతుందని. ఈ క్రమంలో తీసుకునే నీరు తిన్న ఆహారం బాగా జీర్ణమవటానికి, రక్తంలో కలవటానికి, మరుసటిరోజు మలబద్ధకం ఏర్పడకుండా వుండటానికి సహకరిస్తుందని చెపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications









![వారపు రాశి ఫలాలు [19 నుండి 26 మార్చి]: ఈ వారం మీ అదృష్టం ఎలా ఉండబోతోంది? మీ రాశి ఫలాలు ఇక్కడ చూడండి!](https://images.boldsky.com/fit-in/400x225/te/img/2026/03/today-rasi-phalalu-for-all-12-zodiac-signs-19-mar-2026.jpg)

