Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
50 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం
హాఫ్ సెంచరీ కొట్టేశారా ? అదేనండీ మీ వయసు 5 పదులు దాటిందా ? అయితే.. ఆరోగ్యం, ఆహారం విషయంలో శ్రద్ధ వహించాల్సిందే. ఇప్పటిదాకా.. ఏం తిన్నా.. ఎలా తిన్నా.. ఇకపై మాత్రం మీ వయసుకు తగ్గట్టు.. శరీరానికి ప్రయోజనాలు చేకూర్చే ఫుడ్ తీసుకుంటే.. మంచిది.
50 ఏళ్లలో అడుగుపెట్టారంటే.. ఆరో్గ్యంపై జాగ్రత్త వహించాలి. తీసుకునే ఆహారంలో పోషక విలువలు, విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని రోజువారీ డైట్ లో చేర్చుకుంటే.. మరో 50 ఏళ్లు ఆయురారోగ్యాలతో బతికేయచ్చు.

తాజా పండ్లు
న్యూట్రీషియస్ ఫుడ్ అంటే అందరూ ముందుగా సూచించేది పండ్లు. తాజా పండ్లలో శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. సీజన్వారీగా అందుబాటులో ఉండే పండ్లు తీసుకుంటూ ఉండాలి.

చేపలు
హాఫ్ సెంచరీ దాటిన పురుషులు.. ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు. అందులో భాగంగా.. వీళ్లు చేపలని వారానికి రెండుసార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాల్మన్, ట్యూనా, హలిబుట్ వంటి చేపలతోపాటు సీ ఫుడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.

ఫ్రూట్ జ్యూస్
పండ్ల రసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొన్ని రకాల పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి పండ్ల రసాలు తీసుకునేటప్పుడు వాటికి పంచదార ఉపయోగించకపోవడం మంచిది. ఎందుకంటే లేటు వయసులో మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువుంటాయి. ఫ్రూట్ జ్యూస్ లు తరచుగా తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

క్యాల్షియం, విటమిన్ డి
ఐదు పదుల వయసులో శరీరానికి క్యాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. కాబట్టి ఈ రెండు శరీరానికి అందేలా చూసుకోవాలి. క్యాల్షియం, విటమిన్ డి సమృద్ధిగా ఉండే బ్రొకోలి, ఆకుకూరలు, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి.

ఉప్పు
లేటు వయసులో బీపీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బీపీ పెరిగితే.. గుండె నొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. బ్రౌన్ రైస్ ఈ వయసులో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చుతాయి.

కూరగాయలు
తాజా కూరగాయలు తీసుకోవాలి. ఫ్రిజ్ లో ఉంచిన ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిది. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి ఫైబర్ అందుతుంది.



Click it and Unblock the Notifications