Just In
- 5 hrs ago Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- 6 hrs ago గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- 9 hrs ago ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- 11 hrs ago ఈ 4 రాశులకు శుక్రుడు, రాహువు కలయిక గొప్ప ఫలితాలిస్తాయి, ఏప్రిల్లో డబ్బు వర్షం కురుస్తుంది
బొప్పాయితో అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి... ఇంకా లెన్నలేనన్నీ ప్రయోజనాలు
బొప్పాయి పువ్వు ఒకటి తీసుకుని బాగా నలిపి దాన్ని పేను కొరికిన చోట రుద్దితే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.
బొప్పాయి పండులో వున్నన్ని విటమిన్లు మరెందులోను ఉండవు. అందరికీ అందుబాటు ధరలో ప్రతి చోటా లభిస్తుంది. మన ఆరోగ్యానికి బొప్పాయిపండు ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ పండును ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో విటమిన్ "ఏ", విటమిన్ "బీ", విటమిన్ "సీ", విటమిన్ "డీ"లు తగుమోతాదులోనున్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
చరిత్ర చెబుతోంది
బొప్పాయి సుమారు 400 సంవత్సరాల క్రితం విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రంగు, రుచి, వాసనలో మేలైన ఈ పండు కాలక్రమంలో దేశమంతా విస్తరించి ప్రజల మన్ననను పొందింది.
బొప్పాయిలో ఇవి ఉంటాయి
బొప్పాయిలో 9.81 గ్రాముల కార్బోహైడ్రేట్స, 5.9 గ్రా ముల చక్కర, 1.8 గ్రాముల పీచుపదార్థం, 0.14 గ్రా. కొ వ్వు, 0.61 గ్రా.ప్రొటీన్, 6.1 శాతం ఎ విటమిన్, మూ డు శాతం బీటాకెరోట్, రెండు శాతం కాల్షియం, ఒక్క శా తం ఐరన్, 1 శాతం పాస్ఫరస్, మూడు శాతం మెగ్నీషి యం, 5 శాతం పొటాషియం, 0.1 శాతం సోడియం ఉన్నా యి.
విటమిన్ డీ
వంద గ్రాముల బొప్పాయిలో 60 నుంచి 126 మిల్లీ గ్రాముల విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. చిగుళ్లవాపును, రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ పండులో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. సూర్యరశ్మి ద్వారా లభించే మొత్తంతో పోల్చితే ఇది చాలా ఎక్కువ.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది
బొప్పాయి మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఆహారాన్ని వెంటనే అరిగేలా చేస్తుంది. టీబీని నివారిస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. రక్తంలోని దోషాలను నివారిస్తుంది. రక్త ప్రసరణ పెరగడానికి దోహదపడుతుంది. వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది. కడుపులోని యాసిడ్స్ను కంట్రోల్ చేస్తుంది.
పపేయిన్ ఎంజైమ్
బొప్పాయికాయలో పపేయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మాంసాహారం త్వరగా అరగడానికి దోహదం చేస్తుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మాంసాహారం వండేటప్పుడు త్వరగా ఉడకడానికి బొప్పాయి కాయ ముక్కలను వేస్తారు.
ఆరోగ్యానికి మేలు
బొప్పాయి పండును ఉదయం బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది. బొప్పాయిపండు ముక్కలకు తేనె చేర్చి తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి ముక్కలను పాలతో ఉదయం పూట తీసుకుంటే కాలేయ సంబంధ జబ్బులు నయం చేస్తుంది.
పచ్చి బొప్పాయి కూర
నీళ్ల విరేచనాలకు బొప్పాయి పండు బాగా పనిచేస్తుంది. కడుపునొప్పితో నీళ్ల విరేచనాలు మొదలైతే బొప్పాయితో నయం చేయవచ్చు. అందుకోసం బొప్పాయి గింజలు రెండు భాగాలు, ఒక భాగం శొంఠి, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణంగా చేయాలి. ఈ చూర్ణాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అంతేగాకుండా పైల్స్ నివారణకు పచ్చి బొప్పాయికాయ కూర బాగా ఉపయోగపడుతుంది.
చెరకు రసంతో కలిపి తీసుకుంటే
10 గ్రాముల బొప్పాయి పాలను చెరకు రసంతో కలిపి తీసుకుంటే పచ్చకామెర్లు నయమవుతాయి. బొప్పాయి పాలలో కొంచెం తేనె కలిపి ఇస్తే కడుపులో నులి పురుగులు పడిపోతాయి. చిన్నపిల్లలకు అరస్పూను ఇస్తే సరిపోతుంది. తేనె కలిపిన పాలకు రెట్టింపుగా వేడి నీరు కలిపి చల్లారిన తర్వాత మాత్రమే తాగించాలి.
గుండెకు సంబంధించిన వ్యాధులకు..
బొప్పాయి ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. 10 గ్రాముల పొడి తీసుకుని ఒక కప్పు వేడి నీటిలో ఐదు నిమిషాలు నానబెట్టి తాగించాలి. దీనివల్ల హైఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఈ నీటికి గుండెనొప్పిని కూడా తగ్గించే గుణం ఉంది. గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు ప్రతీరోజు ఉదయం, సాయంత్రం బొప్పాయి వాడుతుండాలి. మధుమేహం కూడా నయమవుతుంది.
కిడ్నీలో రాళ్లు
రక్తపోటు ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం పరగడుపున బొప్పాయి తీసుకుంటే కంట్రోల్ అవుతుంది. అంతేగాకుండా కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి కూడా ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. బొప్పాయి వేరును అరగదీసి నీటిలో కలిపి దాహం అనిపించినప్పుడల్లా తాగుతుండాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు మాయమవుతాయి.
బాలింతలకు మంచిది
బొప్పాయి ముక్కలను పాలతో కలిపి బ్రేక్ఫాస్టుగా తీసుకుంటే బాలింతలకు స్తన్యం ఎక్కువగా వస్తుంది. అజీర్ణం, ఆకలి మందగించడం, వికారం వంటి లక్షణాలు ఉన్నప్పుడు, గుండెల్లో మంట, కడుపులో నొప్పి, ఆహారం సహించకపోవడం, నీళ్ల విరేచనాలను వెంటనే అరికడుతుంది.
మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది
వేళకు భోజనం చేయకపోవడం, అతిగా భుజించడం, ఆల్కహాల్ వంటివి ఎక్కువగా తాగటం, మానసిక ఒత్తిడి, మితిమీరిన టెన్షన్ వంటివి జీర్ణకోశాన్ని నష్టపరుస్తాయి. ఇలాంటి సమయంలో బొప్పాయి పండు అమోఘంగా పనిచేస్తుంది. బొప్పాయి కాయలను కూరగా వండుకుని రెండు వారాలు తింటే జీర్ణకోశ వ్యాధులు నయమవుతాయి.
చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
బొప్పాయిలో ఫాస్పరస్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనిద్వారా మనిషి ఎదుగుదలకు, కళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆకలి లేకపోవటం, బలహీనత వంటి వాటికి బొప్పాయి అరచెక్కను తింటే ఆకలి పెరగడమే కాకుండా బలహీనత తగ్గుతుంది. ఒక స్పూను బొప్పాయి పాలను తీసుకున్నా ఆకలి పుడుతుంది. బొప్పాయిపండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా, నునుపుగా చేస్తుంది.
నల్లదనం తగ్గుతుంది
బ్యూటీక్రీమ్లు, బ్యూటీ లోషన్లలో పండును ఎక్కువగా వాడతారు. బొప్పాయి చెట్టు పాలు చర్మ సంరక్షణకు లోషన్గా ఉపయోగపడుతాయి. బొప్పాయి కాయలను బాగా ఎండబెట్టి, పొడిగా మార్చి, ఉప్పు కలుపుకుని తింటే చర్మం అందంగా తయారవుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి మాస్క్లా నెల రోజులు చేసుకుంటే నల్లదనం తగ్గి రంగు తేలుతుంది. బొప్పాయి పండు, ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మేలు చేస్తుంది.
విరుగుడు సొంఠి, మిరియాల చూర్ణం
తియ్యగా రుచిగా ఉంటుంది బొప్పాయి. చలువ చేసి నీరు పెంచి శరీరతత్వాన్ని మారుస్తుంది. రక్తస్రావం, రక్తంపడే మూలవ్యాధి, మూత్రద్వారంలో పుట్టినపుండ్లను నివారిస్తుంది. బొప్పాయిపండు ఆలస్యంగా జీర్ణం అవుతుంది. కప్ప, వాతాలను పెంచుతుంది. కడుపు నిండి ఉన్నప్పుడు ఇది తినకూడదు. దీనికి విరుగుడు సొంఠి, మిరియాల చూర్ణం.
శరీరానికి లేపనంగా రాసి
ఎండాకాలంలో శరీరం పేలుతున్న వారు, బాగా పండిన బొప్పాయి గుజ్జును శరీరానికి లేపనంగా రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే పేలడం తగ్గుతుంది. కడుపులో క్రీములు చేరుకున్న వారు బొప్పాయి గింజల చూర్ణం ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే క్రీములు చనిపోతాయి. పచ్చి బొప్పాయి ముక్కలపై కొంచెం పటిక బెల్లం కలిపి తింటే కడుపులోని క్రీములు నశిస్తాయి.
పచ్చి బొప్పాయి కాయ
పచ్చి బొప్పాయి కాయను చెక్కతో గీరాలి. లోహపుతో గీరవద్దు. తెల్లని పాలు స్రవిస్తాయి. గాయంపై ఈ పాలు పోస్తే గాయాలు త్వరగా మానుతాయి. పచ్చి బొప్పాయి కాయపై చెక్కు తీసివేసి అందులోని కండను చిన్న ముక్కలుగా కోసి దానిపై సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడిలను చల్లి నిమ్మరసం పిండాలి. వాటిని సేవిస్తే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. నులి పురుగులు, ఎలుకపాములు నశిస్తాయి.
పాలు వృద్ధి
మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు పాలు వృద్ధి చెందుతాయి. భోజనానంతరం బొప్పాయి పండు ముక్కలు తింటే జీర్ణం అవుతుంది. మలబద్ధకం నివారిస్తుంది. బొప్పాయి శక్తినివ్వడంతో పాటు చలువ చేస్తుంది. పండిన బొప్పాయి ముక్కలలో తేనె, పాలు కలిపిన మిశ్రమం ఎంతో బలవర్థకమైన టానిక్ వంటిది. ఇది తింటే గుండె, నరాలు సబంధిత వ్యాధులు ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది.
గర్భిణులు తినకూడదు
బొప్పాయి ఎంతో మేలు చేస్తుంది. కొందరి అనుభవం ప్రకారం వేడి చేసి అబార్షన్ చేస్తుందని అంటారు. అందుకని గర్భిణులు నాలుగైదు నెలలు బొప్పాయి పండు తినకపోవడం మంచిది. మొలలు, మూల వ్యాధి, లివర్, చర్మవ్యాధులతో బాధపడేవారికి బొప్పాయి మేలు చేస్తుంది. శరీరంపై మచ్చలు, గాట్లు బొప్పాయి ముక్కతో రుద్దితే మామూలు స్థితికి వస్తుంది.
పోషకాలూ పుష్కలం
నిగనిగలాడుతూ చూడగానే నోరూరించే బొప్పాయి పండులో పోషకాలూ పుష్కలంగానే ఉంటాయి. అన్నిరకాల విటమిన్లు, కంటి ఆరోగ్యానికి అవసరమైన బీటాకెరోటిన్ ఇందులో ఉంటాయి. విటమిన్ సి, రెబోఫ్లేవిన్ సమృద్ధిగా ఉంటాయి. చక్కెర, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఈ పండు పైత్యాన్ని తగ్గిస్తుంది.
కూరగా వండి తీసుకుంటే
హృదయానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి కాయను కూరగా వండి తీసుకుంటే బాలింతలకు మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. బొప్పాయి పాలు, బెల్లంతో కలిపి తినిపిస్తే చిన్నారుల కడుపులో ఉండే నులి పురుగులు నశిస్తాయి. బొప్పాయి ఆకులు మెత్తగా దంచి, పసుపుతో కలిపి పట్టు వేస్తే బోదకాలు తగ్గుతుంది. ఈ పండు తింటే గర్భస్రావం అవుతుందని, గర్భిణులు తినకపోవడమే మేలని పెద్దలటే మేలు చేస్తుంది.
డెంగీ జ్వరం వచ్చిన వారికి
డెంగీ జ్వరం వచ్చిన వారి శరీరంలో ప్లేట్లెట్లను పెంచేందుకు బొప్పాయి పండు, ఆకులు ఉపయోగపడతాయని అందరికీ తెలిసిందే. ఎన్నో రకాల పోషకాలకు బొప్పాయి పండు నిలయంగానూ ఉంది. దీన్ని నిత్యం తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే బొప్పాయి ద్వారా మనం ఎలాంటి అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
వెంట్రుకలు మళ్లీ వస్తాయి
బొప్పాయి పువ్వు ఒకటి తీసుకుని బాగా నలిపి దాన్ని పేను కొరికిన చోట రుద్దితే అక్కడ వెంట్రుకలు మళ్లీ మొలుస్తాయి. 4 నుంచి 5 రోజుల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. బొప్పాయి చెట్టు కాండానికి గాటు పెడితే అందులోంచి పాలు వస్తాయి. ఆ పాలను తీసుకుని చర్మంపై రాస్తే తామర, గజ్జి వంటి చర్మ సంబంధ సమస్యలు పోతాయి.
లివర్ క్లీన్ అవుతుంది
బొప్పాయి కాండం పాలను 60 చుక్కల మోతాదులో తీసుకుని దానికి సమాన భాగంలో చక్కెర కలిపి 3 పూటలా తీసుకుంటే గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు పోతాయి. మలబద్దకం కూడా తగ్గుతుంది. బొప్పాయి పాలను ఒక టీస్పూన్ మోతాదులో నిత్యం తాగుతుంటే దాంతో లివర్ శుభ్ర పడుతుంది. పెరిగిన ప్లీహం, లివర్ మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి.
బొప్పాయి పాలను
బొప్పాయి పచ్చికాయకు గాటు పెడితే దాంట్లో నుంచి పాలు వస్తాయి. వాటిని ఒక పాత్రలో సేకరించి ఆ పాత్రను బాగా కాల్చిన ఇసుకపై ఉంచాలి. దీంతో ఆ పాలు తెల్లని చూర్ణంలా మారుతాయి. ఈ చూర్ణాన్ని రోజుకు 2 సార్లు చిటికెడు మోతాదులో చక్కెర లేదా పాలతో తింటే అమితమైన జీర్ణశక్తి కలుగుతుంది.తేలు కుట్టిన చోట బొప్పాయి కాండం పాలు రాస్తే తేలు విషం హరించుకుపోతుంది.
బోదకాలు
బొప్పాయి ఆకును బాగా నూరి పేస్ట్లా చేసి కడితే బోదకాలు తగ్గిపోతుంది.ఉడుకుతున్న మాంసంలో బొప్పాయి కాయ ముక్కలను వేస్తే ఆ మాంసం త్వరగా ఉడకడమే కాదు, బాగా మెత్తగా కూడా మారుతుంది.బొప్పాయి పండును 2, 3 నిలువు ముక్కలుగా కట్ చేసి రోజూ తింటుంటే మొలలు తగ్గిపోతాయి.