Latest Updates
-
యువతకే సవాల్ విసిరేలా చంద్రబాబు యోగా విన్యాసాలు..తన సీక్రెట్ బయటపెట్టిన ఏపీ సీఎం -
మిగిలిపోయిన అన్నంతో ఇలా వెజ్ బిర్యానీ చేస్తే..పక్కింటోళ్లు కూడా ప్లేట్లు పట్టుకొస్తారు! -
సమ్మర్ సోల్స్టిస్ ఎఫెక్ట్: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. అదృష్టం మీదే! -
కెమికల్స్ ఉన్న కూరగాయలను ఎలా గుర్తించాలి? -
నేడు వ్యతీపాత యోగం: ఈ తప్పులు చేస్తే భారీ నష్టాలు తప్పవు.. జాగ్రత్త! -
లలితా సహస్రనామం స్త్రీలు ఎందుకు ఈ పారాయణం చేయాలి? శుక్రవారం మహత్యం -
చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం: ఈ రాశుల వారికి క్రమశిక్షణతో పాటు అదృష్టం, సంపద రెట్టింపు! -
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 21 నుండి 27 జూన్ 2026 వరకు -
మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. భారీ లాభాలు! - ఆదివారం, 21 జూన్ 2026 -
ఫాదర్స్ డే స్పెషల్.. నాన్న కోసం లక్నో నవాబీ స్టైల్ కిమామి సేమియా'.. ఈ రుచి అస్సలు మర్చిపోరు!
జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి, ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకోవడానికి పసుపు ఎలా ఉపయోగపడుతుందో తెలుసా?
కుర్కుమిన్ ఎలా తన ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ, మెదడులో ఉండే మంటను తగ్గించే సమర్ధత దీనికి ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ మంటకు, అల్జీమర్స్ వ్యాధికి మరియు ఎక్కువ ఒత్తిడ
జ్ఞాపకశక్తి పెరగటానికి, ఆలోచన విధానం మెరుగుపడటానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది ఎలానో తెలుసుకోవాలంటే ఒకసారి మీరు ఈ వ్యాసాన్ని చదవండి. సాధారణంగా భారతీయ వంటలన్నింటిల్లో పసుపు ఎక్కువగా వాడుతుంటారు. పసుపు వల్ల అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పసుపు జ్ఞాపకశక్తిని పెంచుతుంది మరియు తేలికపాటిగా అవ్యవహరించేవారికి, వయస్సు రీత్యా జ్ఞాపకశక్తి తగ్గిపోయే వ్యక్తులకు, అలా జరగకుండా వారి యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది. అమెరికాకు చెందిన ఒక ప్రఖ్యాత సంస్థ ఒక పెద్ద పరిశోధన చేపట్టింది. ఆ పరిశోధనలో కుర్కుమిన్ మెదడు యొక్క పనితీరు పై ఎలా ప్రభావం చూపుతుంది మరియు చిత్త వైకల్యం రాకుండా ఎలా నిరోధిస్తుంది అనే విషయాలతో పాటు, అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వ్యక్తుల యొక్కమెదడులో కంటికి కనపడని ఫలకాలు మరియు ఏర్పడ్డ దూరం వల్ల కలిగే సంభావ్య ప్రభావం ఎలా ఉంది అనే విషయాన్ని అధ్యయనం చేయడం జరిగింది.

పసుపులో కుర్కుమిన్ అనే పదార్ధం ఉంటుంది. దీనికి కాలిన గాయాలను మాన్పించే శక్తి ఉంది మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇందుచేతనే భారతదేశంలో ఉండే వృద్ధుల్లో అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నాయని మరియు అభిజ్ఞ ప్రదర్శన కూడా బాగుందని గుర్తించారు.

" కుర్కుమిన్ ఎలా తన ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయం ఎవరికీ సరిగ్గా తెలియదు. కానీ, మెదడులో ఉండే మంటను తగ్గించే సమర్ధత దీనికి ఎక్కువగా ఉందని గుర్తించారు. ఈ మంటకు, అల్జీమర్స్ వ్యాధికి మరియు ఎక్కువ ఒత్తిడికి సంబంధం ఉందని " అమెరికాకు చెందిన ప్రఖ్యాత పరిశోధకులు చెబుతున్నారు.

ఈ మొత్తం అధ్యయనానికి 50 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఉండి, కొద్దిగా జ్ఞాపకశక్తి పై పిర్యాదులుచేసే 40 మంది పెద్దలను తీసుకోవడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారందరికి అప్పుడప్పు ప్లాసిబో కానీ లేదా 90 మిల్లి గ్రాముల కుర్కుమిన్ ని రోజుకు రెండు సార్లు 18 నెలల పాటు ఇవ్వడం జరిగింది. వ్యక్తులు ఎవరైతే కుర్కుమిన్ స్వీకరించడం జరిగిందో, వారిలో జ్ఞాపకశక్తి మరియు దృష్టిని కేంద్రీకరించే సామర్థ్యం గణనీయంగా పెరిగిందని గుర్తించారు. కానీ, అదే సమయంలో ప్లాసిబో తీసుకున్నవారిలో ఎటువంటి మార్పు లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications