Just In
- 3 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 4 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 4 hrs ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
- 5 hrs ago టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
కఫం, గొంతునొప్పి మరయు గొంత ఇన్ఫెక్షన్ తరిమికొట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మిరియాల కషాయం... ఇంట్లోనే తయారీ
మన భారతీయ వంటలకు సంబంధించినంత వరకు మిరియాలు చాలా ముఖ్యమైన స్సైసీ మసాలా దినుసు. ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినిసు. ఔషధగుణాలు పుష్కలంగా ఉండే ఈ నల్ల మిరియాలు బ్లాక్ మిరియాలని కాదు 'బ్లాక్ గోల్డ్' అని కూడా పిలుస్తారు. అందువల్ల, ఇన్ఫెక్షన్, వైరస్ లు ఉన్న ఈ కాలంలో, ఇంట్లో పెప్పర్ డికాక్షన్ తాగడం వల్ల జ్వరం, జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అంతే కాదు ఇది అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించే ఇమ్యూనిటి బూస్టర్ గా పనిచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలను ఇచ్చే ఈ మిరియాల కషాయంను ఇంట్లోనే స్వయంగా ఎలా చేయాలో ఈ కథనంలో చూద్దాం..
మిరియాలలో పోషకాలు
బ్లాక్ మిరియాల్లో థయామిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, ఇ, బి6 మరియు కె వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదేవిధంగా, జింక్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ మరియు కాల్షియం వంటి పోషకాలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.
అందుకే ఈ మిరియాలు అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. మిరపకాయలోని విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జలుబు, దగ్గు మరియు గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలకు వ్యతిరేకంగా ఇవి ప్రభావవంతంగా ఉంటాయి. అలాంటి నల్ల మిరయాల 20 నిమిషాల్లో సులభంగా డికాక్షన్ ఎలా తయారు ఇక్కడ తెలుసుకుందాం.
మిరియాల కషాయం ఎలా తయారు చేయాలి:
మిరియాల కాషాయం సిద్ధం చేయడానికి నల్ల మిరియాలు, తులసి, తాటి బెల్లం లేదా చక్కెర మరియు నీరు వంటి పదార్థాలు అవసరం. మీరు మీ జలుబు నుండి బయటపడటానికి కేవలం 20 నిమిషాల్లో ఈ మిరియాల కషాయాన్ని తయారు చేసుకోవచ్చు.
కావాల్సినవి:
నల్ల మిరియాలు - 1/4 కప్పు
తులసి : 10 ఆకులు
తాటి బెల్లం - 2 టేబుల్ స్పూన్లు
నీరు - 2 కప్పులు
తయారీ విధానం:
ఓవెన్లో పాన్ పెట్టి అందులో ఎండు మిరియాలు వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి.
చల్లారిన తర్వాత మిక్సీలో వేసి బాగా రుబ్బుకోవాలి.
ఒక పాత్రలో 2 కప్పుల నీటిని వేడి చేయండి.
తులసి మరియు తాటి బెల్లంతో పాటు మిరియాలు పొడి వేసి బాగా మిక్స్ చేసి మీడియం మంట మీద 15 నిమిషాలు వేడి చేయండి.
తర్వాత ఫల్టర్ లో ఈ కషాయాన్ని వడగట్టాలి. వెచ్చగా తాగాలి.
ఈ కషాయాన్ని సేవించడం వల్ల అజీర్తి, దగ్గు, జలుబు వంటి లక్షణాలు తగ్గుతాయి.
మిరియాల పొడి యొక్క ప్రయోజనాలు
మిరియాలలో ఉండే పైపెరిన్ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రవించడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అపానవాయువు మరియు అతిసారం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సి సాధారణ కోరింత దగ్గుకు వ్యతిరేకంగా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది.
ఇందులోని విటమిన్ సి చర్మం వృద్ధాప్యం, ముడతలు మరియు ఫైన్ లైన్లను తగ్గిస్తుంది.
ఇందులోని యాంటీబయాటిక్ గుణాలు మన రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.