Latest Updates
-
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్! -
జిమ్కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. వెళ్లేముందు ఈ ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి.! -
బ్రేక్ఫాస్ట్లో పొట్టకి తేలికగా అనిపించేలా టమాటా సేమియా ఉప్మా.. ఇలా చేస్తే అస్సలు అంటుకోదు.!
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.!
జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఆచార్య చాణక్యుడు తన సూత్రాల్లో వివరించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ఎలా ఉండాలి, స్త్రీపురుషులు సమాజంలో ఎలా మెలగాలి, కుటుంబ బంధాలు ఎలా కొనసాగాలనే విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో పరిశుభ్రత, దైనందిన అలవాట్లకు సంబంధించి కొన్ని కీలక విషయాలను ఆచార్య చాణక్య తెలిపారు. ముఖ్యంగా మనిషి పరిశుభ్రతకి సంబంధించి ప్రతిరోజూ స్నానం అనేది ముఖ్యం. ఇక రోజువారీ స్నానంతో పాటు కొన్ని పనులు పూర్తి చేసిన తప్పనిసరిగా స్నానం చేయాలని చాణక్య పేర్కొన్నారు. అందుకు గల కారణాలను కూడా వివరించారు. ప్రధానంగా చాణక్య చెప్పిన నాలుగు పనుల గురించి తెలుసుకుందాం..

నూనెతో మసాజ్ అనంతరం
చాణక్యుని నీతి శాస్త్రం ప్రకారం శరీరానికి నూనె రాసుకున్న తర్వాత లేదా మర్దన చేసుకున్న తర్వాత స్నానం చేయడం తప్పనిసరి. మర్దన చేసుకున్న తర్వాత శరీరం జిడ్డుగా మారుతుంది. దీని వల్ల చెమట, దుమ్ము అంటుకుపోతుంది. మలినాలు అలాగే ఉండిపోతాయి. అందుకే శరీరానికి నూనె రాసిన కాసేపటికి శుభ్రంగా సబ్బుతో స్నానం చేయాలి. దీంతో బాడీపై మలినాలు తొలగి తాజాగా ఉంటుంది.

శ్మశాన వాటిక నుంచి ఇంటికి వచ్చిన వెంటనే..
హిందూ మత సంప్రదాయం ప్రకారం ఎవరైనా చనిపోయాక అంత్యక్రియలు లేదా దహన సంస్కారాలు పూర్తయి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడం అనేది తప్పనిసరి. ఇది అనాది కాలంగా వస్తున్న సంప్రదాయం. చాణక్య నీతి కూడా ఈ సంప్రదాయం కొనసాగించాల్సిందేనని చెబుతుంది. దీనికి పరిశుభ్రత ప్రధాన కారణం. అంత్యక్రియలు జరిగిన ఇంటి నుంచి తిరిగి వచ్చాక.. ఆ స్థలంలోని పొగ, ఇతర కణాలు బట్టలకు, శరీరానికి అంటుకుపోతాయి. ఇలాగే ఇంటికి వచ్చి పడుకోవడం, ఇతర పనులు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే రాగానే తప్పనిసరిగా స్నానం చేయాలి.

సంభోగం తర్వాత
చాణక్యుని నీతి శాస్త్రం ప్రకారం.. భార్యాభర్తలు సంభోగం తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. ఈ ఘట్టం తర్వాత స్నానం చేసి వంట పనులు, ఇతర పనులు చేయాలని బోధిస్తుంది. అనాది కాలం నుంచి దీనిని శారీరక, మతపరమైన పవిత్రతతో ముడిపెట్టారు. సంభోగం తర్వాత స్నానం చేయకపోతే శరీరం పవిత్రం కాదని చెబుతోంది.

జుట్టు, గడ్డం కటింగ్ తర్వాత
పురుషులు జుట్టు కత్తిరించుకున్నాక లేదా గడ్డం చేసుకున్న తర్వాత చిన్న చిన్న వెంట్రుకలు శరీరానికి అంటుకుపోతాయి. ఇవి సులభంగా వదిలిపోవు. ఇలాగే వంట, భోజనం వంటి పనుల్లో పాల్గొంటే అవి తినే ఆహారంలోకి వెళ్లిపోతాయి. అందుకు స్నానం చేసినట్లయితే వెంట్రుకలు శుభ్రంగా తొలగిపోతాయి. అందుకే షేవింగ్, హెయిర్ కటింగ్ తర్వాత వెంటనే స్నానం చేయడం తప్పనిసరి అని చాణక్య నీతి బోధిస్తోంది.



Click it and Unblock the Notifications