Latest Updates
-
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ‘బయోటిన్ డ్రింక్’.. ఒక్క గ్లాసు తాగితే చాలు.. నిమిషాల్లో రెడీ.! -
పోషకభరితమైన, రుచికరమైన దొండకాయ మసాలా రైస్,,లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ రెసిపి ఇది! -
టీ, కాఫీతో హార్మోన్ల సమస్య.. మహిళల్లో గర్భధారణ, సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందా.? -
నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది! -
100 ఏళ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా బతికించే బ్రేక్ ఫాస్ట్..దీన్ని మించింది ప్రపంచంలోనే లేదు! -
భోజనం తర్వాత డెజర్ట్ లేదా డ్రింక్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే జెల్లీ కాఫీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.! -
ఏం జరుగుతోందిరా: పగలు ప్రియుడితో, రాత్రి భర్తతో ఉంటా..మహిళ కోరికతో అందరికీ మైండ్ బ్లాక్!
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
రాఖీ పండుగ అనగానే తోబుట్టువులు సోదరులకు కట్టే రాఖీలతో పాటు మార్కెట్లో రకరకాల స్వీట్లు కూడా కనబడుతుంటాయి. ఈ ఏడాది ఆగస్టు 28న రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీ పండుగ రాగానే మార్కెట్లో రంగురంగుల స్వీట్లు దర్శనమిస్తాయి. కానీ మీ ఇంట్లో మీ చేతులతో చేసిన స్వీట్ సోదరుడికి తినిపిస్తే ఆ ఆనందమే వేరు.
రాఖీ పండుగకి మీ ఇంట్లోనే తయారుచేయగలిగన అద్భుతమైన స్వీట్ కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్. పాలలో ఉండే కమ్మదనం, కుంకుమపువ్వు సువాసన, పిస్తాపప్పుల రుచి కలగలిసిన ఈ స్వీట్ పండుగకు మరింత శోభను తెస్తుంది.

కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తయారీకి కావలసిన పదార్థాలు
చిక్కటి పాలు (ఫుల్ క్రీమ్ మిల్క్) - 1 లీటరు
నిమ్మరసం - 2 లేదా 3 టేబుల్ స్పూన్లు
పంచదార - 4 నుండి 5 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు రేకులు - 8-10
యాలకుల పొడి - అర టీస్పూన్
పిస్తా పప్పులు - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - ట్రేకి రాయడానికి కొద్దిగా
కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తయారీ విధానం
-ముందుగా గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు నానబెట్టుకోవాలి.
-తర్వాత మందపాటి అడుగు ఉన్న వెడల్పాటి గిన్నెను తీసుకుని, పాలు పోసి మీడియం మంటపై మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు మంటను తగ్గించి, గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. గిన్నె అంచులకు అంటుకునే మీగడను గీకి మళ్లీ పాలలోనే కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల మిల్క్ కేక్ కు అద్భుతమైన రుచి, చిక్కదనం వస్తుంది.
-పాలు సగానికి పైగా ఇగిరిపోయే వరకు ఉడికించాలి.
-పాలు బాగా చిక్కబడిన తర్వాత, మంటను పూర్తిగా తగ్గించాలి. ఇప్పుడు నిమ్మరసాన్ని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ నెమ్మదిగా కలపాలి. పాలు పన్నీర్ లాగా పూర్తిగా విరిగిపోకుండా, కేవలం చిన్నచిన్న పూసల్లా మారేలా చూసుకోవాలి. మిల్క్ కేక్ ప్రత్యేకత అంతా ఈ నోట్లో కరిగిపోయే పూసల ఆకృతిలోనే ఉంటుంది.
-పాలు పూసల్లా మారిన తర్వాత, అందులో చక్కెర, ముందుగా నానబెట్టుకున్న కుంకుమపువ్వు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇవన్నీ బాగా కలిసేలా తక్కువ మంటపై ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడి, గిన్నె అంచులను వదిలేస్తున్న సమయంలో... యాలకుల పొడి, సగం తరిగిన పిస్తా పప్పులను వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి.
-ఒక చతురస్రాకారపు ట్రేకి కొద్దిగా నెయ్యి రాసి ఉంచుకోవాలి. సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని ట్రేలో వేసి సమానంగా సర్దాలి. దీనిపైన మిగిలిన పిస్తా పలుకులు, కొన్ని కుంకుమపువ్వు రేకులను చల్లి నెమ్మదిగా చేత్తో అదమాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు చల్లారనిచ్చి, ఆ తర్వాత కనీసం 2-3 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. అది బాగా గట్టిపడిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కత్తిరించుకోవాలి.
-రక్షాబంధన్ రోజున మీ సోదరుడికి రాఖీ కట్టిన తర్వాత, మీరు ప్రేమతో చేసిన ఈ కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ తినిపించండి. ఈ స్వీట్ తిన్నాక, మీ సోదరుడు మీ వంటకు ముగ్ధుడవటం ఖాయం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications