Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్నెస్పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ద్రౌపది తన ఐదుగురి భర్తలతో శృంగార జీవితం ఎలా చేసేది అనే విషయంపై కొన్ని రహస్యాలు..
బహు భార్యాత్వము లేదా ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం గురించి ఆలోచిస్తే ఈ రోజుల్లో అది ఒక వింతగా అనిపించవచ్చు. కానీ ఈ పద్దతిని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ద్వాపర యుగంలో అనుసరించారు. మహాభారత యుద్ధం జరిగిన కాలంలో ఇది చోటు చేసుకుంది.
దీని ప్రకారం ద్రౌపది అనుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో ఐదుగురి పాండవులను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో ద్రౌపది గురించి సామజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరిగింది. చాలామంది ఆమె యొక్క శారీరిక సంబంధాలు మరియు పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి పై సామాజిక మాధ్యమాల్లో విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అసలు నిజం ఏమిటో.
అతిపెద్ద వీరుడైన అర్జునిడిని ద్రౌపది పెళ్లి చేసుకుంది అని చాలా మందికి తెలుసు. అర్జునుడు స్వయంవరంలో భాగంగా ద్రౌపదిని గెలుచుకుంటాడు. కానీ, చాలా మంది ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇప్పటికీ వెతుకుతుంటారు. ఎలా ఆమెకు ఐదుగురి అన్నదమ్ములతో వివాహం అయ్యింది? వారందరితో ఎలా సంబంధ బాంధవ్యాలను కొనసాగించింది ? ఇలా ఎన్నో ప్రశ్నలు చాలా మంది మదిని తొలుస్తుంటాయి.
ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో మీరు ఎదురుచూసే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా మీ ఊహాజనిత ఆలోచనలన్నింటికీ తెరపడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా, మహా భారతంలో ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఏమి జరిగింది అనే విషయమై తెలుసుకుందాం.

1. మహా భారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రదారుల్లో ద్రౌపది కూడా ఒకరు...
మహా భారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రదారుల్లో ద్రౌపది కూడా ఒకరు. పురాణ కథల ప్రకారం ద్రౌపది పాంచాల రాజు అయినా దృపద రాజు కూతురు. ఈమె యజ్ఞ కుండలం లో నుంచి జన్మించందని చాలా మంది నమ్ముతారు.

2. మహాభారతంలో ఈమెకు పెళ్లి ఎలా జరిగింది అనే విషయమై చాలామందికి తెలుసు....
ద్రౌపది పెళ్లి చేసే విషయమై స్వయంవరాన్ని ఏర్పాటుచేస్తే, అందులో ఐదుగురు పాండవులు పాల్గొంటారు. స్వయంవరంలో నియమనిబంధనల ప్రకారం పైన తిరుగుతున్న చేప ను ఎవరైతే క్రింద నీటిలో దాని ప్రతిబింబాన్ని చూసి ఆ చేప కన్నుని గురి చూసి కొడతారో వారికి ద్రౌపదిని ఇచ్చి పెళ్ళిచేయడం జరుగుతుంది. అర్జునుడు గొప్ప విలుకాడు కావడంతో, స్వయంవరంలో గెలిచి ద్రౌపది ని పెళ్లి చేసుకుంటాడు.

3. అర్జునుడు తన అన్నదమ్ములతో కలిసి ద్రౌపదిని...
అర్జునుడు తన అన్నదమ్ములతో కలిసి ద్రౌపదిని తన తల్లి కుంతి దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ సమయంలో కుంతి దేవి ఎదో పనిలో నిమగ్నమై ఉండటంతో, ఆమెకు తెలియకుండానే మీరు ఏమైతే తీసుకొచ్చారో దానిని ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెబుతుంది.

4. కుంతి చెప్పిన ఆ మాట విని అక్కడున్న చాలామంది ఒక్కసారిగా అవాక్కయ్యారు...
కుంతి చెప్పిన ఆ మాట విని అక్కడున్న చాలామంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ విషయాన్ని ఆమె కూడా గుర్తించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఐదుగురు అన్నదమ్ములు ఎంతో విధేయులు కావడంతో ఆమె ఆజ్ఞను పాటించారు, ద్రౌపదిని భార్యగా స్వీకరించారు.
ద్రౌపది మొదటి రాత్రి యుధిష్ఠిరుడుతో గడిపిందని ఆ తర్వాత భీముడు, అర్జునుడు, మరియు నకుల సహదేవులతో గడిపిందని చాలా మంది నమ్ముతారు.

5. నారద ముని పాత్ర.....
వీళ్ల పెళ్లి తర్వాత నారద ముని పాండవులను కలవడానికి వస్తాడు. ఆ సమయంలో గతంలో జరిగిన ఒక కథని వాళ్లకు వినిపిస్తాడు. ఈ కథ అత్యంత శక్తి వంతమైన అన్నదమ్ములది. వారి పేర్లు సుంద్ మరియు ఉపసుంద్. వీరు ఇరువురూ దేవతలను సైతం జయించారు. కానీ, ఒక అమ్మాయి వీరిరువురి మధ్య మనస్పర్థలు సృష్టించింది. చివరికి ఒకరినొకరు చంపుకున్నారు. పాండవుల విషయంలో ఇలా జరగకూడని నారదుడు భావించాడు. అందుచేత ఇలా జరగకుండా ఉంటానికి ఒక నియమ నిబంధనను పెట్టుకోమని సూచించాడు.

6. ఆ నియమం ప్రకారం ద్రౌపది ఒక్కక్క పాండవుని దగ్గర....
ఆ నియమం ప్రకారం ద్రౌపది ఒక్కక్క పాండవుని దగ్గర కొద్ది కాలం గడుపుతుంది. ద్రౌపది ఏకాంతంగా ఎవరితోనైతే సమయాన్ని గడుపుతూ ఉంటుందో, ఆ సమయంలో వేరొకరు వాళ్ళ వద్దకు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ ఆలా గనుక ఎవరైనా వెళ్ళినట్లైతే వారికి వనవాస శిక్ష విధించడం జరుగుతుంది.

7. వనవాస శిక్ష ఎందుకు అనుభవించారు....
కథ ప్రకారం, యుధిష్ఠిరుడుతో ద్రౌపది ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక వ్యక్తి సహాయం చేయమని అర్జునుడు వద్దకు వస్తాడు. కొంతమంది దొంగలు తన ఆవులను ఎత్తుకెళ్లారని, మీ సహాయం కావాలని అర్జునుడుని కోరగా అందుకు అర్జునుడు అంగీకరిస్తాడు. కానీ అర్జునిడి ఆయుధాలన్నీ యుధిష్ఠిరుడు గదిలో ఉంటాయి. దీంతో తప్పక నియమాన్ని ఉల్లంగించి గదిలోకి వెళతాడు అర్జునుడు. దీంతో వనవాస శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

8. సత్యభామ ఒకసారి ద్రౌపదిని అడిగిన రహస్యం....
ఎలా నువ్వు అన్నదమ్ములందరిని ఆనందంగా ఉంచగలుగుతున్నావు అని సత్యభామ ఒకసారి ద్రౌపది ని అడుగుతుంది. " నేను వారికి ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో సేవ చేస్తాను. నా కోపాన్ని, అహాన్ని మరియు కామాన్ని అన్నింటిని ఆ సమయంలో దూరంగా పెడతాను. వారికంటే ముందు ఎప్పుడు కనీసం స్నానం కూడా చేయను " అని ద్రౌపది చెప్పుకొచ్చింది.

9. పదికి ఐదుగురి పురుషులతో వివాహం జరిగినా...
ఇందు కారణంగానే ద్రౌపదికి ఐదుగురి పురుషులతో వివాహం జరిగినా, ఆమెను ఒక ఆదర్శవంతమైన మహిళగా గుర్తించారు మరియు ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా అభివర్ణించారు.



Click it and Unblock the Notifications