Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
ద్రౌపది తన ఐదుగురి భర్తలతో శృంగార జీవితం ఎలా చేసేది అనే విషయంపై కొన్ని రహస్యాలు..
బహు భార్యాత్వము లేదా ఒక స్త్రీ ఒకరికంటే ఎక్కువ మంది భర్తలను కలిగి ఉండటం గురించి ఆలోచిస్తే ఈ రోజుల్లో అది ఒక వింతగా అనిపించవచ్చు. కానీ ఈ పద్దతిని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే ద్వాపర యుగంలో అనుసరించారు. మహాభారత యుద్ధం జరిగిన కాలంలో ఇది చోటు చేసుకుంది.
దీని ప్రకారం ద్రౌపది అనుకోకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో ఐదుగురి పాండవులను పెళ్లి చేసుకోవలసి వచ్చింది. ఈ మధ్య కాలంలో ద్రౌపది గురించి సామజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చ జరిగింది. చాలామంది ఆమె యొక్క శారీరిక సంబంధాలు మరియు పెళ్లి తర్వాత జరిగే మొదటి రాత్రి పై సామాజిక మాధ్యమాల్లో విభిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కానీ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అసలు నిజం ఏమిటో.
అతిపెద్ద వీరుడైన అర్జునిడిని ద్రౌపది పెళ్లి చేసుకుంది అని చాలా మందికి తెలుసు. అర్జునుడు స్వయంవరంలో భాగంగా ద్రౌపదిని గెలుచుకుంటాడు. కానీ, చాలా మంది ప్రజలు కొన్ని ప్రశ్నలకు సమాధానాలను ఇప్పటికీ వెతుకుతుంటారు. ఎలా ఆమెకు ఐదుగురి అన్నదమ్ములతో వివాహం అయ్యింది? వారందరితో ఎలా సంబంధ బాంధవ్యాలను కొనసాగించింది ? ఇలా ఎన్నో ప్రశ్నలు చాలా మంది మదిని తొలుస్తుంటాయి.
ఇప్పుడు మీరు చదవబోయే వ్యాసంలో మీరు ఎదురుచూసే ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అంతేకాకుండా మీ ఊహాజనిత ఆలోచనలన్నింటికీ తెరపడుతుంది. కాబట్టి ఎక్కువ సమయం వృధా చేయకుండా, మహా భారతంలో ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఏమి జరిగింది అనే విషయమై తెలుసుకుందాం.

1. మహా భారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రదారుల్లో ద్రౌపది కూడా ఒకరు...
మహా భారతంలోని అత్యంత ముఖ్యమైన పాత్రదారుల్లో ద్రౌపది కూడా ఒకరు. పురాణ కథల ప్రకారం ద్రౌపది పాంచాల రాజు అయినా దృపద రాజు కూతురు. ఈమె యజ్ఞ కుండలం లో నుంచి జన్మించందని చాలా మంది నమ్ముతారు.

2. మహాభారతంలో ఈమెకు పెళ్లి ఎలా జరిగింది అనే విషయమై చాలామందికి తెలుసు....
ద్రౌపది పెళ్లి చేసే విషయమై స్వయంవరాన్ని ఏర్పాటుచేస్తే, అందులో ఐదుగురు పాండవులు పాల్గొంటారు. స్వయంవరంలో నియమనిబంధనల ప్రకారం పైన తిరుగుతున్న చేప ను ఎవరైతే క్రింద నీటిలో దాని ప్రతిబింబాన్ని చూసి ఆ చేప కన్నుని గురి చూసి కొడతారో వారికి ద్రౌపదిని ఇచ్చి పెళ్ళిచేయడం జరుగుతుంది. అర్జునుడు గొప్ప విలుకాడు కావడంతో, స్వయంవరంలో గెలిచి ద్రౌపది ని పెళ్లి చేసుకుంటాడు.

3. అర్జునుడు తన అన్నదమ్ములతో కలిసి ద్రౌపదిని...
అర్జునుడు తన అన్నదమ్ములతో కలిసి ద్రౌపదిని తన తల్లి కుంతి దగ్గరకు తీసుకెళ్తాడు. ఆ సమయంలో కుంతి దేవి ఎదో పనిలో నిమగ్నమై ఉండటంతో, ఆమెకు తెలియకుండానే మీరు ఏమైతే తీసుకొచ్చారో దానిని ఐదుగురు సమానంగా పంచుకోండి అని చెబుతుంది.

4. కుంతి చెప్పిన ఆ మాట విని అక్కడున్న చాలామంది ఒక్కసారిగా అవాక్కయ్యారు...
కుంతి చెప్పిన ఆ మాట విని అక్కడున్న చాలామంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ విషయాన్ని ఆమె కూడా గుర్తించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఐదుగురు అన్నదమ్ములు ఎంతో విధేయులు కావడంతో ఆమె ఆజ్ఞను పాటించారు, ద్రౌపదిని భార్యగా స్వీకరించారు.
ద్రౌపది మొదటి రాత్రి యుధిష్ఠిరుడుతో గడిపిందని ఆ తర్వాత భీముడు, అర్జునుడు, మరియు నకుల సహదేవులతో గడిపిందని చాలా మంది నమ్ముతారు.

5. నారద ముని పాత్ర.....
వీళ్ల పెళ్లి తర్వాత నారద ముని పాండవులను కలవడానికి వస్తాడు. ఆ సమయంలో గతంలో జరిగిన ఒక కథని వాళ్లకు వినిపిస్తాడు. ఈ కథ అత్యంత శక్తి వంతమైన అన్నదమ్ములది. వారి పేర్లు సుంద్ మరియు ఉపసుంద్. వీరు ఇరువురూ దేవతలను సైతం జయించారు. కానీ, ఒక అమ్మాయి వీరిరువురి మధ్య మనస్పర్థలు సృష్టించింది. చివరికి ఒకరినొకరు చంపుకున్నారు. పాండవుల విషయంలో ఇలా జరగకూడని నారదుడు భావించాడు. అందుచేత ఇలా జరగకుండా ఉంటానికి ఒక నియమ నిబంధనను పెట్టుకోమని సూచించాడు.

6. ఆ నియమం ప్రకారం ద్రౌపది ఒక్కక్క పాండవుని దగ్గర....
ఆ నియమం ప్రకారం ద్రౌపది ఒక్కక్క పాండవుని దగ్గర కొద్ది కాలం గడుపుతుంది. ద్రౌపది ఏకాంతంగా ఎవరితోనైతే సమయాన్ని గడుపుతూ ఉంటుందో, ఆ సమయంలో వేరొకరు వాళ్ళ వద్దకు అస్సలు వెళ్ళకూడదు. ఒకవేళ ఆలా గనుక ఎవరైనా వెళ్ళినట్లైతే వారికి వనవాస శిక్ష విధించడం జరుగుతుంది.

7. వనవాస శిక్ష ఎందుకు అనుభవించారు....
కథ ప్రకారం, యుధిష్ఠిరుడుతో ద్రౌపది ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఒక వ్యక్తి సహాయం చేయమని అర్జునుడు వద్దకు వస్తాడు. కొంతమంది దొంగలు తన ఆవులను ఎత్తుకెళ్లారని, మీ సహాయం కావాలని అర్జునుడుని కోరగా అందుకు అర్జునుడు అంగీకరిస్తాడు. కానీ అర్జునిడి ఆయుధాలన్నీ యుధిష్ఠిరుడు గదిలో ఉంటాయి. దీంతో తప్పక నియమాన్ని ఉల్లంగించి గదిలోకి వెళతాడు అర్జునుడు. దీంతో వనవాస శిక్ష అనుభవించాల్సి వస్తుంది.

8. సత్యభామ ఒకసారి ద్రౌపదిని అడిగిన రహస్యం....
ఎలా నువ్వు అన్నదమ్ములందరిని ఆనందంగా ఉంచగలుగుతున్నావు అని సత్యభామ ఒకసారి ద్రౌపది ని అడుగుతుంది. " నేను వారికి ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో సేవ చేస్తాను. నా కోపాన్ని, అహాన్ని మరియు కామాన్ని అన్నింటిని ఆ సమయంలో దూరంగా పెడతాను. వారికంటే ముందు ఎప్పుడు కనీసం స్నానం కూడా చేయను " అని ద్రౌపది చెప్పుకొచ్చింది.

9. పదికి ఐదుగురి పురుషులతో వివాహం జరిగినా...
ఇందు కారణంగానే ద్రౌపదికి ఐదుగురి పురుషులతో వివాహం జరిగినా, ఆమెను ఒక ఆదర్శవంతమైన మహిళగా గుర్తించారు మరియు ప్రభావవంతమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా అభివర్ణించారు.



Click it and Unblock the Notifications











