Latest Updates
-
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్! -
గుంటూరు కారం పొడి, చిట్టి ఇడ్లీ..ఇలా చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే! -
నో గ్యాస్, నో స్టవ్.. నిమిషాల్లో తయారయ్యే కమ్మని పల్లెటూరి రోటి పెరుగు పచ్చడి..ప్లేట్ అన్నం ఖాళీ అవ్వాల్సిందే! -
రోజూ తినే పప్పు బోర్ కొట్టిందా? అయితే ఈ ధాబా స్టైల్ దాల్ తడ్కా ట్రై చేయండి..గిన్నెలు గిన్నెలు లేపేస్తారు! -
తెలుగువారి తొలి పండుగ: ఉగాది 2026 తేదీ, పేరు, ఆచారాలు, సంప్రదాయాలు -
కేవలం 10 నిమిషాల్లో దూదిలాంటి టమాటో సెట్ దోశ.. పప్పు నానబెట్టే పనే లేదు..బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్! -
భాగస్వామి సంతృప్తిలో అట్టడుగు స్థానంలో భారత్..మూసిన తలుపుల వెనుక అసలు కథ! -
ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు.. ఇలా చేస్తే పర్ఫెక్ట్ గా వస్తాయి..నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతూ అమృతమే! -
పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి రుచిగా, ఒంటికి చల్లగా..అన్నం, ఇడ్లీ, దోశ దేనిలోకైనా అదిరిపోయే కీర దోసకాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..
ఆ దేశం లో మానభంగం చేసిన వాళ్ళను ఏమి చేస్తారో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది
మనం ఉంటున్న సమాజంలో మానవ మృగాలు ఎంతో మంది ఉన్నారు . మహిళలను , అమ్మాయిలను , ఆడపిల్లలను ఎవరినైనా సరే , వావి వరస లేకుండా , మానవత్వం మరచి ,విలువలను గాలికి వదిలి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్న ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు . వాళ్లకు భయం లేదు , దానికి కారణం తప్పు చేస్తే శిక్ష పడుతుంది అని వెన్నులో వణుకు పుట్టించే చట్టాలను మన ప్రభుత్వాలు ఇంకా రూపొందించలేదు .
అందు వల్లనే మన సమాజం లో , దేశం లో మానభంగం అనేది నిత్యం ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంది . ప్రతి రోజు అలాంటి వార్తలను మన మీడియా లో చూస్తూనే ఉన్నాం. నిర్భయ ఘటన తరువాత నిర్భయ చట్టాలను మన ప్రభుత్వాలు తెచ్చినా వ్యవస్థలో మార్పు లేదు,రావటం లేదు .

మన సమాజంలో కూడా అమ్మాయిలను లైంగికంగా వేదించాలన్నా , వారిని మానభంగం చేయాలన్నా భయపడేలా ప్రస్తుతం మన దేశం లో చట్టాలు లేవని , మానభంగం చేయటం అనే విషయాన్ని చాలా తేలికగా తీసుకునే మన దేశం లో , ఇండోనేషియా లాంటి చిన్న దేశం లో అవలంభిస్తున్న కఠిన చట్టాలను మన దేశం లో కూడా రూపొందించాలని సూచిస్తున్నారు చాలా మంది కడుపు మండిన ప్రజలు.

ఇండోనేషియా లో ఏమి జరిగిందంటే....
మన దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన నిర్భయ లాంటి వ్యవహారం ఒకటి ఇండోనేషియా దేశం లో చోటుచేసుకుంది.14 సంవత్సరాల వయసున్న అమ్మాయిని 12 మంది దారుణంగా మానభంగం చేసారు . ఆ తరువాత ఆ అమ్మాయిని అతి కిరాతకంగా హత్య చేసారు . ఈ హృదయ విధారక సంఘటన జరిగిన తరువాత అక్కడి ప్రజలు, ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ దేశ అధ్యక్షుడిని కోరారు . ప్రజల కోరిక మేరకు కఠినమైన చట్టాలను రూపొందిస్తామని హామీ ఇచ్చారు ఆ దేశాధ్యక్షుడు.

ఆ దేశం లో రూపొందించిన కొత్త చట్టాలు మరియు వాటి నియమ నిబంధనలు....
ఎవరైతే మానభంగానికి పాల్పడతారో , అలాంటి వాళ్ళ లో మగతనం దెబ్బతినేలా ఆడవాళ్ళ హార్మోన్లను ఆయా వ్యక్తుల శరీరంలోకి ఎక్కిస్తారు , చేసిన నేరం , దాని తీవ్రతను బట్టి మరణ శిక్ష కూడా విధిస్తారు . ఒక వేళ ఆ వ్యక్తికి మరణ శిక్ష పడక పొతే ,ఆ నేరం చేసిన వాళ్ళ పేర్లను ప్రజలందరి ముందు బహిర్గత పరుస్తారట.అంతే కాకుండా నిరంతరం అతని కదలికలను తెలుసుకునేందుకు వీలుగా వాళ్ళ శరీరంలోకి ఒక ఎలక్ట్రానిక్ చిప్ ని అమరుస్తారట.

మన దేశం లో ఎప్పుడు..?
మహిళల పై జరిగే అకృత్యాలను అరికట్టడానికి ప్రపంచం లో ని చాలా దేశాల్లో ఎన్నో కఠినమైన చట్టాలు ఉన్నాయి . కానీ , స్త్రీలను దేవతలు గా భావించే మన దేశం లో , నిరంతరం మహిళల పై ఎన్నో దాడులు జరుగుతున్నా , కఠినమైన చట్టాలు లేకపోవటం గమనార్హం.

ఇండోనేషియా లాంటి చిన్న దేశాలలోనే
ఇండోనేషియా లాంటి చిన్న దేశాలలోనే నేరాలను అరికట్టడానికి అంత కఠినమైన చట్టాలు అవలంభిస్తున్నప్పుడు , మన దేశం లో కూడా తప్పు చేయాలంటే భయపడేలా చట్టాలు తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.మరి మన దేశం లో ని ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు ఎప్పుడు వేస్తాయో చూడాలి.



Click it and Unblock the Notifications











