Vizag Beach Clean: తాగి బండ్లు నడిపిన మందుబాబులతో బీచ్ క్లీన్ చేయించిన వైజాగ్ కోర్టు

మందుబాబులకు విశాఖ మేజిస్ట్రేట్ కోర్టు వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయాలని వారికి శిక్ష విధించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని మేజిస్ట్రేట్ కోర్టు వారికి శిక్ష విధించింది.

మందు తాగి వాహనాలు నడపొద్దురా బాబు అంటే ఎవడూ వినడు. పూటుగా తాగి జాలీగా బండ్లు, కార్లు నడుపుతుంటారు. తాగిన మైకంలో రోడ్డుపై వెళ్లే ఎవర్నో ఢీకొట్టి ప్రమాదాలకు కారణం అవుతుంటారు. వీరిని కట్టడి చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మందుబాబులకు చలాన్లు, ఫైన్లు, జైలు శిక్షలు విధిస్తూనే ఉంటున్నారు. కానీ వారిలో ఏమార్పు లేదు. కానీ ఇప్పుడు విశాఖ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు మందుబాబుల పరువు అంతా బీచులో కొట్టుకుపోయేలా చేసింది.

Vizag court directs 52 drunk drivers to clean beach know in Telugu

మందుబాబులకు విశాఖ కోర్టు వేసిన శిక్షను ఇప్పుడు చాలా మంది భేష్ అంటున్నారు. తాగిన వాళ్ల తిక్క కుదిరిందని, ఇంకోసారి తాగి రోడ్లపైకి రారని అంటున్నారు. అన్ని నగరాల్లోలాగే విశాఖ లోనూ మందు బాబులు ఎక్కువే. తాగి వాహనాలు నడపొద్దు అంటే ఒక్కడూ వినే రకం కాదు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతూనే ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. చలానాలు, జరిమానాలు కట్టి మరోసారి అదే సీన్ రిపీట్ చేస్తుంటారు.

వైజాగ్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 3 రోజుల్లో 50 మంది దొరికారు. 50 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారించిన న్యాయమూర్తి వారికి భిన్నమైన శిక్ష విధించారు. వైజాగ్ లోని ఆర్కే బీచ్ లో చెత్తను ఏరివేయాలని వారికి శిక్ష విధించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు బీచ్ లోని చెత్తను ఏరివేస్తుండాలని మేజిస్ట్రేట్ కోర్టు వారికి శిక్ష విధించింది.

పోలీసుల పర్యవేక్షణలో 52 మంది మందుబాబులు బీచ్ ను క్లీన్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మందుబాబులకు న్యాయమూప్రిత మంచి శిక్షణ విధించారని, ఇంకోసారి మందు తాగి రోడ్డు ఎక్కరని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. మందుబాబుల తిక్క కుదిర్చేందుకు ఇదే సరైన శిక్ష అంటున్నారు. మందుబాబుల కిక్కు దిగేందుకు మాంచి కిక్కిచ్చే శిక్షణ విధించారని శెభాష్ అంటున్నారు.

2022లో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులు 8893 నమోదయ్యాయి. విశాఖపట్నంలోనని రీజనల్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఆర్టీఏ) వైజాగ్ లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1,1140 మంది వాహనదారుల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. న్యూ ఇయర్ 2023 నాడు మద్యం తాగి వాహనాలు నడపడంపై దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. వీరిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన 76 మంది ఉన్నారు.

Story first published: Thursday, February 23, 2023, 15:25 [IST]
Desktop Bottom Promotion