Latest Updates
-
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా!
ముంబైని అతి పెద్ద నగరంగా పిలవడానికి టాప్ 10 సీక్రెట్స్ ...
ముంబై, అసంఖ్యాక కలల నగరం, లక్షలాది మంది ప్రజలు తమ ఎమోషన్స్ ని పంచుకుంటున్న నగరం. రంగు రంగుల జీవితాన్ని ఎలా గడపాలని ప్రజలకు నేర్పించేటటు వంటి అద్భుతమైన నగరం. వైవిధ్యానికి గొప్ప పండుగలకు మరియు సంస్కృతి కి భారతదేశం ప్రసిద్ధి చెందింది, ఇతర నగరాలతో పోలిస్తే ముంబై చాలా మెరుగ్గా కనిపిస్తుంది.
లెక్కలేనన్ని కలలతో నిండివున్న ముంబై కూడా కొన్ని నమ్మలేని వాస్తవాలతో కూడిన చరిత్రను కలిగివుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముంబై ఫస్ట్స్ నగరంగా పిలవబడటం. ఏ రంగం లో అయినా, ముందస్తుగా ముంబై అనుసంధానించబడి ఉండటం ప్రత్యేకత. ముంబై ఎందుకు అల్టిమేట్ టైటిల్ 'ది సిటీ అఫ్ ఫస్ట్స్' గా పిలవబడుతోందో కారణాలను ఇక్కడ చదివి తెలుసుకోండి....

భారతదేశంలో మొదటి పాసెంజర్స్ ట్రైన్
ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లలో భారత రైల్వే ఒకటిగా పేరు పొందింది. 1853 సంవత్సరంలో భారతదేశానికి రైల్వేలను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. బొంబాయి నుంచి థానే వరకు బొంబాయిలో భారతదేశానికి మొట్టమొదటి రైలు ప్రారంభమైంది.

మొదటి సబర్బన్ రైల్వే లైన్
కొన్ని వేళ మంది ముంబై వాసులు వారి పని ప్రదేశాలకు సబర్బన్ రైల్వే లైన్ ద్వారా ప్రయాణిస్తున్నారు.ముంబై ని భారతదేశం యొక్క గుండె అనుకుంటే ఈ లోకల్ ముంబై దానిని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతూ మరియు పంపింగ్ చేస్తూ కాపాడుతూ ఉంటుంది. 1857 లో సబర్బన్ రైల్వే లైన్ ను ప్రవేశపెట్టడం ద్వారా ముంబై మొట్టమొదటి నగరంగా మారింది.

ముంబైలోని వాట్సన్ హోటల్లో మొదటి సినిమా ప్రీమియర్ ని ప్రదర్శించడం
1896 లో, లూమియెర్ బ్రదర్స్ సినిమాటోగ్రాఫ్ ను కనుగొన్న తర్వాత, వారు భారతదేశంలో వారి చిన్న చిత్రాలను ప్రప్రథమంగా ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. కలకత్తా ఆ సమయంలో భారతదేశం యొక్క రాజధానిగా ఉండేది, అయినప్పటికీ బొంబాయిలోని వాట్సన్ హోటల్లో లూమియెర్ బ్రదర్స్ వారి మొట్టమొదటి చిత్రాన్ని ఇక్కడ ప్రదర్శించారు.

భారతదేశం యొక్క మొదటి 5 స్టార్ హోటల్
ప్రపంచంలోని ప్రఖ్యాతి గాంచిన మరియు ఐకానిక్ హోటల్స్ లో ఒకటిగా పిలవబడే తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ 1903 లో ముంబైలో నిర్మించబడింది. ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి 5 స్టార్ హోటల్ గా ఉంది, ఇది ఇప్పుడు ఒక వారసత్వ ప్రదేశం మరియు అందరి ప్రయాణికులు తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్రదేశంగా మారింది. ముంబైకి చెందిన వాటిలో ఇది ఒకటి.

మొట్టమొదటి మోటారు టాక్సీ
ముంబై మరియు కోలకతా వీధుల్లో వేలాది మంది టాక్సీలు నడుపుతున్నారు, అయితే 20 వ శతాబ్దంలో టాక్సీలు ప్రారంభంకాక ముందు వరకు రవాణా మార్గం ప్రవేశపెట్టబడలేదు. మొట్టమొదటి మోటారు టాక్సీ 1911లో ముంబైలో ప్రారంభమైంది.

మొట్టమొదటి ఇండియన్ ఫిల్మ్ షాట్
మియెర్ బ్రదర్స్ చేసిన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రతి ఒక్కరూ తర్వాత సినిమాలు చేయాలని అనుకున్నారు. దాాదా సాహెబ్ ఫాల్కే వచ్చినప్పటికి భారత్ బ్రిటీష్ పాలనలోనే వుంది. అయినప్పటికీ, ఎంతో చొరవ తీసుకొని మొట్టమొదటిసారి తొలి భారతీయ చిత్రాలను రూపొందించడానికి ముందుకు వచ్చింది. దాదార్ లో చిత్రీకరించిన రాజా హరిశ్చంద్ర (చిత్రం) మొట్టమొదటిగా చిత్రీకరించిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా పేరు గాంచింది. ఈ చిత్రం భారతదేశంలో చలనచిత్ర తయారీకి ప్రారంభమైంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ మందికి పైగా ప్రజలను ఆకర్షించే ఒక భీభత్సాభివృద్ధి పరిశ్రమగా పేరు గాంచింది.

భారతదేశంలో మొదటి సివిల్ విమానాశ్రయం
1928 లో స్థాపించబడిన జుహు ఎయిర్ పోర్ట్, భారతదేశం యొక్క మొదటి పౌర విమానయాన విమానాశ్రయం. 1932 లో, J. R. D. టాటా భారతదేశం యొక్క మొట్టమొదటి షెడ్యూల్ ఎయిర్లైన్స్ టాటా ఎయిర్లైన్స్ ని కరాచీ నుండి బొంబాయికి అహ్మదాబాద్ ద్వారా బయలుదేరింది.

భారతదేశంలో మొదటి ఎక్ష్ప్రెస్స్ వే
భారతదేశంలో 22 కంటే ఎక్కువ ఎక్స్ ప్రెస్ మార్గాలు ఉన్నాయి, ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ 2000 సంవత్సరంలో ప్రారంభించిన మొదటి ఎక్స్ ప్రెస్.

ఇంట్లో మొదటి క్రికెట్ ప్రపంచ కప్
2011 లో వాంఖడే స్టేడియంలో MS ధోని ఆడిన ఐకానిక్ సిక్స్ గుర్తుందా? భారతదేశానికి రెండవ ప్రపంచ కప్ గెలిచిన షాట్. కేవలం ఆరు పరుగులు కంటే ఆ షాట్ ఎక్కువ ఉంది. భారతదేశం ప్రపంచకప్ లో విజయం సాధించిన మొదటి మరియు ఏకైక దేశం అయింది. క్రికెట్ ప్రపంచ కప్ ల నాలుగు దశాబ్దాల చరిత్రలో, కేవలం భారతదేశం మాత్రమే ఈ ఘనతను సాధించింది, ఇది ముంబైలో జరిగింది.

భారతదేశంలో మొదటి మోనోరైల్
ఫిబ్రవరి 2014 లో, మోనోరైల్ కు MMRDA గ్రీన్ సంకేతాలను ఇచ్చినప్పుడు, మోనారైల్ను పొందటానికి ముంబై మొట్టమొదటి నగరంగా మారింది, ఎందుకంటే 1920 వ దశకంలో కుండల వాలీ రైల్వే మరియు పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్లు మూసివేయబడ్డాయి.



Click it and Unblock the Notifications











