Just In
- 3 hrs ago 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- 4 hrs ago ఈ 3 రాశుల వారు ఏప్రిల్ 23 నుండి అప్రమత్తంగా ఉండాలి, అంగారకుడి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటారు
- 8 hrs ago అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
- 9 hrs ago కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
మీ భార్య అలా చేస్తే మీకు అన్నీ నష్టాలే, రాత్రి జుట్టు ఆరబోసుకుని పడుకుందంటే అరిష్టం, అలా చేయకూడదు
ఆడవారు మధ్య పాపిడి తీసి సింధూరం పెట్టుకోవాలి. అలా కాదని పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెడితే, భార్యా భర్తలు మద్య గొడవలు ఎక్కువగా అవుతాయి.మీ భార్య అలా చేస్తే మీకు అన్నీ నష్టాలే.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బందం ఎంతో పవిత్రమైనది. ఎన్నో వేదమంత్రాల సాక్షిగా, పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇద్దరినీ ఏకం చేస్తారు. అలా వారిద్దరూ కలసి ఆనందంగా జీవించాలని పెద్దలు కోరుకుంటారు.
అయితే పెళ్లి అయిన స్త్రీ కొన్ని నియమాలను పాటించాలి. అందులో ముఖ్యమైనది సిందూరం. పెళ్లి అయిన ఆడవారు నుదిటిన సింధూరం పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకోవడం వలన, భర్త దీర్గాయుశ్శుతో ఉంటారు. అలానే కొన్ని చిన్న చిన్న తప్పులు వలన భర్తకు కష్టాలు కూడా మొదలవుతాయి.
మీ భార్య చేసే కొన్ని పనుల వల్ల
మీరు చేసే కొన్ని తప్పులే మిమ్మల్ని పేదరికంలో కి నెడతాయని అధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మీరు, మీ ఇంట్లో వారి మీప్రవర్తనే మీకష్టాలకు కారణమవుతుందనేది కొందరు ఆధ్యాత్మిక నిపుణుల వాదన. మరీ ముఖ్యంగా మీ ఇంట్లోని ఆడవాళ్లు తెలిసో, తెలియకనో చేసిన తప్పులతో లక్ష్మి దేవి మీ ఇంటికి రాకుండా చేస్తాయట. మీ భార్య చేసే కొన్ని పనుల వల్ల మీ ఇంటికి సంపద రాదు.
పాలు, పెరుగు అడిగితే
అయితే ఎటువంటి పనులు చేస్తే లక్ష్మి దేవి ఇంట్లోకి వస్తుంది అనేది తెలుసుకుందాం. సాయంత్రం పూట అంటే సంధ్యా సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చి పాలు, పెరుగు అడిగితే ఇవ్వకూడదట. పాలు, పెరుగు లక్ష్మి దేవి కి ప్రతీకలట. అందుకే ఇవి అడిగిన వారికి ఇవ్వడం వల్ల మీ ఇంట్లోని లక్ష్మి దేవిని మీరే స్వయంగా బయటకు పంపినవారవుతారని హెచ్చరిస్తున్నారు.
వంట పాత్రల్ని, స్టవ్ ను శుభ్రపరచి
వంటింట్లో ఉండేది అన్నపూర్ణాదేవి.. అంటే లక్ష్మీ దేవి స్వరూపమే. కాబట్టి రాత్రిపూట నిద్రించే ముందు వంట పాత్రల్ని, స్టవ్ ను శుభ్రపరచి పడుకోవాలట. ఇలా చేయకపోతే ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకున్నట్లేనట. లక్ష్మీ దేవి అలిగి ఇంట్లోనుంచి బయటకి వెళ్ళిపోతుందట. అలాగే చాలా మంది స్త్రీలు జుట్టు విరబోసుకొని నిద్రిస్తుంటారు.
ఉప్పు అంటే లక్ష్మి దేవికి ఇష్టం
ఇలా చేయడం రాక్షసుల జాతి లక్షణమని పురాణాలు వక్కాణిస్తున్నాయి. ఇటువంటి చర్యలు లక్ష్మీ దేవికి ఇష్టముండదట. ఆమెకు కోపం వస్తుందట. ఉప్పు అంటే ఆ సిరుల తల్లి లక్ష్మి దేవికి ఇష్టం. కనుక ఉప్పును పేపర్ లలో చుట్టి రాత్రి మీరు ఉన్న ఇంట్లోని ప్రతి రూం లో ఉంచాలట.
నెగెటివ్ ఎనర్జీ బయటకు
ఉదయం లేవగానే ఆ ఇంటి స్త్రీ ఎవరితో మాట్లాడకుండా వాటిని తీసి బయట పడేయాలట. ఇలా చేయడం వలన నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుందని పండితుల ఉవాచ. దీంతో లక్ష్మి దేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందట. ఇంట్లో అలాగే చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. వేరే ఏ దిక్కున ఉండకూడదు. అలా ఉంచితే ధనలక్ష్మి మీ ఇంటికి వస్తుంది.
తల దగ్గర నీరు
నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు. నిద్ర లేచి తాగుదామని.. కానీ అలా చేయకూడదు. నీళ్ళ దప్పిక వస్తే పైకి లేచి వెళ్ళి తాగాలి. ఇలా చేస్తే ధనప్రాప్తి ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే వివాహము నందు తప్ప జీవితంలో ఎప్పుడు భార్యతో కలసి భర్త భుజించరాదు అని అంటారు. అలాగే పిల్లలకు, వృద్దులకు పెట్టకుండా ముందే తినరాదు. కాళ్ళు చాపి భోజనం చేయుట దోషం.
సింధూరం పెట్టుకోవాలి
ఆడవారు మధ్య పాపిడి తీసి సింధూరం పెట్టుకోవాలి. అలా కాదని పక్క పాపిడి తీసి అక్కడ సింధూరం పెడితే, భార్యా భర్తలు మద్య గొడవలు ఎక్కువగా అవుతాయి. అంతే కాకుండా, కొందరు అసలు పాపిడి తీయకుండా, సింధూరం పెడతారు. అలా పెట్టడం వలన భర్తకు ఏ దారి దొరక్క నానా కష్టాలు పడతారు. సింధూరం సరిగ్గా పెట్టుకోకపోతే, భర్త అనేక ఆర్ధిక ఇబ్బందులు కూడా చవి చూస్తాడు. అందుకని మద్య పాపిడి తీసి, చక్కగా సింధూరం పెట్టుకుని... సౌభాగ్యంగా వర్ధిల్లండి.