For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వాతిప్రియ, పవన్ కుమార్ వేసుకున్న ప్లాన్ చూస్తే అవాక్కు అవుతారు, భర్త ఉన్నా అక్క ప్రియుడిపై మోజు

చిత్తూరు జిల్లా పాకాల గాంధీనగర్‌కు చెందిన స్వాతిప్రియఆమె తల్లిదండ్రులకు రెండో సంతానం. 2015లో గాంధీనగర్‌కే చెందిన దిలీప్‌కుమార్‌తో ఆమెకు వివాహమైంది.స్వాతిప్రియ, పవన్ కుమార్, నగలను ప్రియుడికి అప్పగించి

|

ఇలాంటి ప్రియురాలు ఎవరికీ ఉండదేమో. పెళ్లయి భర్త ఉన్నా కూడా ప్రియుడి బాగు కోరి ఆమె ఒక పక్కా ప్లాన్ వేసింది. ఇంతలా ఎవరూ ప్రియుడికి సహకరించరేమో. ప్రియడ్ని ఏదైనా బిజినెస్ లో సెటిల్ చేద్దామనుకుంది. తన అక్క భర్తను విడిచిపెట్టి మరో వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిపైనే ఆమె చెల్లెలు కూడా ఇష్టం పెంచుకుంది. తర్వాత అతన్నే ఆ చెల్లెలు పెళ్లి చేసుకోవాలని భావించింది. అతన్ని బాగా సెటిల్ చేద్దామని ప్లాన్ వేసింది. కానీ చివరకు ఆమె ప్రయత్నం బెడిసికొట్టింది. తప్పుడు ఫిర్యాదు చేసి పోలీసులనే పక్కదారి పట్టించాలని ప్రయత్నించింది ఆమె.

మనస్సుపడ్డ వాడికి అప్పగించింది

మనస్సుపడ్డ వాడికి అప్పగించింది

బంగారు నగలను తాను మనస్సుపడ్డ వాడికి అప్పగించింది. తర్వాత వాటిని దొంగలు దోచుకున్నారంటూ డ్రామా ఆడింది. ఇక పోలీసులను కూడా నమ్మించేందుకు ట్రై చేసింది ఈ అమ్మడు. పోలీసులకే ఫస్ట్ ఆమె వేసిన ప్లాన్ అర్థం కాక ఆమె చెప్పిన మాటల్ని నమ్మేశారు. చివరకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

స్వాతిప్రియకు 2015లో దిలీప్‌కుమార్‌తో వివాహం

స్వాతిప్రియకు 2015లో దిలీప్‌కుమార్‌తో వివాహం

చిత్తూరు జిల్లా పాకాల గాంధీనగర్‌కు చెందిన స్వాతిప్రియ

ఆమె తల్లిదండ్రులకు రెండో సంతానం. 2015లో గాంధీనగర్‌కే చెందిన దిలీప్‌కుమార్‌తో ఆమెకు వివాహమైంది. ఇక స్వాతిప్రియ అక్కకు అయిదేళ్ల కిందట వివాహం జరిగింది. అయితే స్వాతిప్రియ అక్కకు, ఆమె

భర్తకు ఏర్పడిన గొడవల వల్ల ఆమె మెట్టినింటి నుంచి పుట్టింటికి తిరిగొచ్చేసింది.

పవన్‌కుమార్‌తో పరిచయం

పవన్‌కుమార్‌తో పరిచయం

మూడేళ్లుగా స్వాతిప్రియ అక్క తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

ఇక స్వాతిప్రియ అక్క ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వంటి వాటిలో కాలక్షేపం చేస్తుంటే ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా తూర్పుగోదావరి జిల్లా కరప మండలం, నడకుదురుకు చెందిన పవన్‌కుమార్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

పవన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్వాతిప్రియ అక్క

పవన్ ను పెళ్లి చేసుకోవాలనుకున్న స్వాతిప్రియ అక్క

పవన్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో సేల్స్‌ విభాగంలో ఉద్యోగం చేసేవాడు. పవన్ కుమార్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు స్వాతిప్రియ అక్కడ తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది. ఆమె తల్లిదండ్రులు సైతం అడ్డు చెప్పలేదు. దీంతో తిరుపతిలోని అర్బన్‌హట్‌ వద్ద వారు కలుసుకునేవారు.

అక్క ద్వారా పరిచయం

అక్క ద్వారా పరిచయం

ఇక తన అక్క ద్వారా పవన్ కుమార్ ను స్వాతిప్రియకు కూడా పరిచయం చేసుకుంది. దీంతో స్వాతిప్రియ బావా.. బావా అంటూ వరస కలిపింది. అలా పవన్ కుమార్ కు స్వాతిప్రియ పరిచయం అయ్యింది. అక్క మాదిరిగానే స్వాతిప్రియ కూడా పవన్ కుమార్ తో బాగా మెలిగేది.

అక్కకు తెలియకుండా యవ్వారం

అక్కకు తెలియకుండా యవ్వారం

అక్కకు తెలియకుండా పవన్ కుమార్ కు వాట్సాప్‌, ఫోన్‌ ద్వారా స్వాతిప్రియ టచ్ లో ఉండేది. స్వాతిప్రియ, పవన్‌కుమార్‌ ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. విషయం ఇంటి వద్ద తెలిసి మందలించారు. అదేం లేదూ.. కాబోయే బావ కదాఅని అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను అని బుకాయిస్తూనే స్వాతిప్రియ పవన్‌కుమార్‌కు మరింత దగ్గరైంది.

సహకరించాలనుకుంది

సహకరించాలనుకుంది

ఇక తాను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం అంత బాగాలేదనీ, చేతిలో డబ్బులుంటే మరింత పెద్ద ఉద్యోగం సంపాదించుకోవచ్చని పవన్‌కుమార్‌ స్వాతిప్రియకు చెప్పాడు. దీంతో అతనికి సహకరించాలని స్వాతి ప్రియ నిర్ణయించుకుంది. ఇద్దరు కలిసి కుట్ర పన్నారు. తమ తల్లిదండ్రులు కొనిచ్చిన చంద్రహారానికి బీమా సైతం చేయించడం వల్ల దొంగలు తీసుకెళ్లినట్లు కేసు పెడితే బంగారం మళ్లీ పొందవచ్చని ప్లాన్ వేసుకున్నారు.

స్వాతిప్రియ నగలను అప్పగించింది

స్వాతిప్రియ నగలను అప్పగించింది

అనుకున్న ప్లాన్‌ ప్రకారం ఇటీవల అమ్మవారి మెడలో అలంకరించి తరువాత తాను ధరించాలని స్వాతిప్రియ నమ్మబలికి పూజ చేయించింది. ఆ నగలతోనే రామాలయానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పింది. కానీ నేండ్రగుంటకు వెళ్లి నగలన్నీ పవన్‌కుమార్‌ పంపిన అతని స్నేహితుడికి స్వాతిప్రియ అప్పగించింది.

పోలీసులకు ఫిర్యాదు చేసింది

పోలీసులకు ఫిర్యాదు చేసింది

తాను మే 11న పాకాల పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని రైల్వేకాలనీ శ్రీరామాలయానికి వచ్చి వెళుతుండగా గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు కళ్లలో కారం కొట్టి తన వద్ద ఉన్న నగలను దోచుకెళ్లారంటూ స్వాతిప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే ఘటన జరగడంతో తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విచారణ ప్రారంభించారు

పవన్‌కుమారే నగలను బ్యాంకులో పెట్టాడు

పవన్‌కుమారే నగలను బ్యాంకులో పెట్టాడు

పోలీసులు ఫోన్‌ సంభాషణతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి కేసును ఛేదించారు. తరచూ స్వాతిప్రియతో ఫోన్‌లో మాట్లాడిన పవన్‌కుమారే ఆ నగలను నడకుదురు సిండికేట్‌ బ్యాంకులో పెట్టి రూ.3.13 లక్షల రుణం పొందినట్లు గుర్తించారు. తప్పుడు ఫిర్యాదు చేయడం, పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించడం, కుట్ర, బీమా సంస్థను మోసం చేసేందుకు ప్రయత్నించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని స్వాతిప్రియపై కేసు నమోదు చేశారు. నగలను కాజేసిన పవన్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు.

పోలీసులకే చుక్కలు చూపించింది స్వాతిప్రియ

పోలీసులకే చుక్కలు చూపించింది స్వాతిప్రియ

ఇలా పోలీసులకే మొదట తన ప్లాన్ ద్వారా చుక్కలు చూపించింది స్వాతిప్రియ. తనకు భర్త ఉన్నా కూడా అక్క ప్రియుడిపై మోజుపడి ఆమె చేసిన పనులు చూస్తే అందరూ అవాక్కు అవ్వాల్సిందే మరి.

English summary

jewellery robbery case twist in chittoor

jewellery robbery case twist in chittoor
Desktop Bottom Promotion