Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
పట్టుచీరపై రామాయణం.. 60 మీటర్ల వస్త్రంపై 32 వేల సార్లు ‘జై శ్రీరామ్’.. ఆంధ్రా నేతన్న నుండి అద్భుత కళాఖండం...
60 మీటర్ల పట్టుచీరపై ‘జై శ్రీరామ్’ నామాన్ని 13 భారతీయ భాషల్లో 32, 200 సార్లు వచ్చేలా డిజైన్ చేసిన ఆంధ్రా చేనేత కళాకారుడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తి శ్రీసత్య సాయి జిల్లాలోని ధర్మవరానికి చెందిన జురాజు నాగరాజు అనే నేతన్న అద్భుతమైన కళా ఖండాన్ని ఆవిష్కరించాడు. 60 మీటర్ల పట్టు చీరపై 13 భారతీయ భాషల్లో ఏకంగా 32, 200 సార్లు 'జై శ్రీరామ్' అనే నామాన్ని డిజైన్ చేసి రూపొందించాడు.

అంతేకాదండోయ్ ఆ పట్టు వస్త్రంపై రామాయణ ఘట్టాలను సైతం డిజైన్ చేశాడు. నాగరాజు రూపొందించిన ఈ చీరను చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. దీన్ని సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయ్యింది. నాగరాజు స్వయంగా రూపొందించిన ఈ ప్రత్యేకమైన పట్టు వస్త్రాన్ని 'రామ కోటి వస్త్రం'గా పిలుస్తున్నట్లు నాగరాజు వివరించారు.

ఈ పట్టు వస్త్రంపై రామాయాణంలోని సుందరకాండలోని 168 ఘట్టాలను కళ్లకు కట్టేలా రూపొందించినట్లు వెల్లడించాడు. దీన్ని రూపొందించడం అంత సులువు కాదని.. దీని కోసం చాలా కష్టపడినట్టు వివరించారు. ఖర్చు కూడా భారీగానే అయ్యిందని తెలిపాడు.
ఈ పట్టుచీర దాదాపు 16 కిలోల బరువు ఉంటుందని, 44 ఇంచుల వెడుల్పు ఉన్న ఈ చీరను రూపొందించేందుకు 4 నెలల సమయం పట్టిందని పేర్కొన్నాడు. దీని కోసం సుమారు ఒకటిన్నర లక్ష రూపాయలు ఖర్చయ్యిందన్నారు. ఈ చీరను రూపొందించేందుకు తనకు మరో ముగ్గురు సహాయం చేసినట్లు వివరించారు.
ఈ చీరను అయోధ్యలో నిర్మించే రామాలయంలో రాముడికి సమర్పించనున్నట్లు వివరించాడు.



Click it and Unblock the Notifications